Monsoon: జూన్ 9న కేరళలోకి రుతుపవనాలు.. బిపోర్జాయ్ తుఫాన్ ప్రభావం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Monsoon: ఈ ఏడాది నైరుతి రుతుపవనాల ఆగనమనం ఆలస్యం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. సాధారణంగా జూన్ మొదటివారంలోనే రుతుపవానాలు కేరళ తీరాన్ని తాకాలి. అయితే ఇప్పటి వరకు కేరళను చేరుకోలేదు. జూన్ 4న రెండు రోజులు ఆలస్యంగా కేరళలోకి నైరుతి రుతుపవనాలు వస్తాయని ముందుగా భారత వాతావరణ కేంద్రం (ఐఎండీ) అంచనా వేసింది. అయితే అరేబియా సముద్రంలో ‘బిపోర్జాయ్’ తుఫాన్ ఏర్పడటంతో నైరుతి రుతుపవనాలు మరింత ఆలస్యం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇదిలా ఉంటే శుక్రవారం అంటే జూన్ 9 నాటికి కేరళను రుతుపవనాలు తాకే అవకాశం ఉందని, అందుకు అన్ని పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని ఐఎండీ బుధవారం అంచనా వేసింది. ఇదిలా ఉంటే ఈ రుతుపవనాల రాక మరింత ఆలస్యం అవుతుందని ప్రైవేటు వాతావరణ సంస్థ ‘స్కైమెట్’ అంచనా వేస్తోంది. బిపోర్జాయ్ తుఫాన్ కారణంగా నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకేందుకు మరో 2-3 రోజులు పట్టే అవకాశం ఉందని అంచనా వేసింది.
Also Read
- Tamil Nadu: విత్తనాలు చల్లింది అన్నామలై.. పంట కోసుకున్నది విజయ్.. తమిళ గడ్డపై "సింగం" ఫార్ములా బ్లాక్బస్టర్!!
- Delhi: ఢిల్లీ అగ్నిప్రమాద ఘటనలో కీలక విషయాలు బట్టబయలు.. వంటవాడి నిర్లక్ష్యానికి 21 మంది బలి..
- TMC Rebellion: కోల్కతా టు ఢిల్లీ.. పార్లమెంట్కు పాకిన టీఎంసీ తిరుగుబాటు సెగ.. దీదీకి తప్పని అగ్నిపరీక్ష!
- Delhi: అభిజీత్ దిప్కే పిలుపునకు భారీ స్పందన.. ‘కాక్రోచ్ మాస్కులు’ ధరించి నిరసన బాట పట్టిన యువత..
Read Also: Arvind Kejriwal: కన్నీరు పెట్టుకున్న ముఖ్యమంత్రి..
గతేడాది జూన్1న కేరళ తీరాన్ని రుతుపవనాలు తాకాయి. ఈ ఏడాది ఆ తేదీ నాటికి కనీసం శ్రీలంకను కూడా దాటలేదు. ప్రస్తుతం అరేబియా సముద్రంలో తుఫాన్ కారణంగా రుతుపవనాల కదలిక బలహీనంగా ఉందని వాతావరణ నిపుణులు తెలిపారు. ఈ ఏడాది సాధారణంతో పోలిస్తే 96 శాతం వర్షపాతం నమోదు అయ్యే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. దీనికితోడు ఎల్ నినో ప్రభావం కూడా ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
అరేబియా సముద్రంలో ఏర్పడిన బిపోర్జాయ్ తుఫాన్ వేగంగా బలపడుతోంది. తీవ్ర తుఫాన్ గా మారింది. బుధవారం ఉదయం 5.30 గంటలకు గోవాకు 890 కిలోమీటర్ల దూరంలో పశ్చిమ నైరుతి ప్రాంతంలో, ముంబాయికి 1000 కిలోమీటర్ల నైరుతిలో, పోర్ బందర్ కు 1,070 కిలోమీటర్ల దూరం దక్షిణాన- నైరుతిలో తుఫాన్ కేంద్రీకృతమై ఉంది. రాగల మూడు రోజుల్లో ఇది ఉత్తర-వాయువ్య దిశలో కదిలే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ముందు జాగ్రత్తలో సముద్రంలోకి ప్రజలు వెళ్లవద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు.
తాజావార్తలు
-
Anasuya: నా గొంతు నొక్కేయాలని చూశారు.. భరించలేకే జబర్దస్త్ నుంచి బయటకొచ్చా?
-
Digital Arrest Scam: ముందు కాల్ వస్తుంది.. తర్వాత వీడియో కాల్.. చివరికి ఖాతాలోని డబ్బంతా మాయం!
-
Manav Suthar: టీమిండిలో మరో యువ కెరటం.. భారత టెస్టు జట్టులోకి దూసుకొచ్చిన ఈ కుర్రాడు ఎవరో తెలుసా?
-
CM Revanth Reddy: నన్ను మభ్యపెట్టడం అంత ఈజీ కాదు.. సీఎం రేవంత్రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు..
-
Anasuya: బాధ్యత ఉండక్కర్లా.. బుచ్చిబాబు’కి అనసూయ పరోక్ష కౌంటర్?
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!