Modi-Trump: ప్రధాని మోడీకి ట్రంప్ ఫోన్.. 40 నిమిషాల పాటు సంభాషణ..
- ప్రధాని మోడీకి ట్రంప్ ఫోన్..
- 40 నిమిషాల పాటు సంభాషణ..
- ఇరాన్ యుద్ధం, హార్ముజ్ జలసంధి గురించి చర్చ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Modi-Trump: ప్రధాని నరేంద్రమోడీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య మంగళవారం 40 నిమిషాల పాటు టెలిఫోన్ సంభాషణ జరిగింది. అమెరికా-ఇరాన్ కాల్పులు విరమణ తర్వాత ఇద్దరు నాయకుల ఇదే మొదటిసారి మాట్లాడుకోవడం. ట్రంప్తో మాట్లాడిన వివరాలను ప్రధాని మోడీ ఎక్స్ ద్వారా వెల్లడించారు. ‘‘ నా మిత్రుడు, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నుంచి నాకు ఫోన్ కాల్ వచ్చింది. వివిధ రంగాల్లో ద్వైపాక్షిక సహకారంలో సాధించిన గణనీయమైన పురోగతిని సమీక్షించాము. అన్ని రంగాల్లో మన సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి కట్టుబడి ఉన్నాము. పశ్చిమాసియా పరిస్థితి గురించి చర్చించాము. హార్ముజ్ జలసంధిని తెరిచి, సురక్షితంగా ఉంచాల్సిన ప్రాముఖ్యతను నొక్కి చెప్పాము’’ అని పేర్కొన్నారు.
Read Also: Suspended: ఆ పని చేసినందుకు ముగ్గురు పంచాయతీ కార్యదర్శులపై వేటు.. సస్పెండ్ చేసిన కలెక్టర్..
Also Read
- Maharashtra Politics: కాంగ్రెస్లో శరద్ పవార్ పార్టీ విలీనం ? మహారాష్ట్ర రాజకీయాల్లో తెరవెనుక నడుస్తున్న హైడ్రామా ఇదే!
- Ayodhya Ram Mandir: అయోధ్య రామ్ మందిర్ కొలువుల్లో 'కమిషన్ల' భాగోతం.. ట్రస్ట్ కీలక సభ్యుల రాజీనామా వెనుక అసలు రహస్యం ఇదేనా?
- Schools and Colleges Closed: ఎడతెరిపి లేని వర్షాలు.. ఈ జిల్లాల్లో స్కూళ్లు, కాలేజీలకు సెలవు
- WhatsApp Username Feature: వాట్సాప్ కొత్త ఫీచర్పై సందేహాలన్నింటికీ చెక్.. మెటా కీలక ప్రకటన
ఈ ఫోన్ కాల్ సందర్భంగా ఇరాన్ యుద్ధం, వాణిజ్యంపై చర్చించినట్లు భారతదేశంలో అమెరికా రాయబారి సెర్గియో గోర్ వెల్లడించారు. భారత్, అమెరికాల మధ్య పటిష్టమైన సంబంధాలు ఉన్నాయని ఆయన అన్నారు. రెండు దేశాల మధ్య ఆర్థిక బంధం మరింత బలపడగలదని, రాబోయే కొద్ది రోజుల్లో భారత్ అమెరికాల మద్య ఇంధనంతో పాటు కొన్ని అతిపెద్ద ఒప్పందాలు కుదిరే అవకాశం ఉందని ఆయన అన్నారు. అమెరికా భారతదేశాన్ని ఎంతో ప్రేమిస్తుందని ట్రంప్ మోడీతో అన్నారని గోర్ తెలిపారు.
ఇటీవల పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్లో యూఎస్-ఇరాన్ మధ్య 21 గంటల పాటు శాంతిచర్చలు జరిగాయి. అయితే, ఈ చర్చలు ఎలాంటి ఫలితం ఇవ్వకుండానే ముగిశాయి. చర్చలు విఫలమైనట్లు ఇరు దేశాలు ప్రకటించాయి. చర్చలు విఫలమైన తర్వాత హార్ముజ్ జలసంధిని దిగ్భంధిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. దీంతో మరోసారి రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి.
Received a call from my friend President Donald Trump. We reviewed the substantial progress achieved in our bilateral cooperation in various sectors. We are committed to further strengthening our Comprehensive Global Strategic Partnership in all areas. We also discussed the…
— Narendra Modi (@narendramodi) April 14, 2026
తాజావార్తలు
-
Ather 450X Overtones: ఏథర్ కొత్త 450X ఓవర్టోన్స్ సిరీస్.. 900W ఫాస్ట్ ఛార్జర్, వాయిస్ కమాండ్తో మరింత స్మార్ట్!
-
Shruti Haasan : ఐడెంటిటీ కోల్పోతున్న శృతి హాసన్
-
Jeans Cleaning Tips: కొత్త జీన్స్ త్వరగా పాతబడుతుందా..? అసలు కారణం మీ ఉతికే విధానమే..!
-
Maharashtra Politics: కాంగ్రెస్లో శరద్ పవార్ పార్టీ విలీనం ? మహారాష్ట్ర రాజకీయాల్లో తెరవెనుక నడుస్తున్న హైడ్రామా ఇదే!
-
Celebrity Updates: ప్రెగ్నెన్సీ నుంచి ఫ్యామిలీ అప్డేట్స్ వరకు.. సెలబ్రిటీల కొత్త స్టైల్ ఇదే
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: సంజునే స్వయంగా ఛాన్స్ ఇస్తున్నాడు.. రెండో టీ20లో వైభవ్ అరంగేట్రం!
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!
-
Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?