Suspended: ఆ పని చేసినందుకు ముగ్గురు పంచాయతీ కార్యదర్శులపై వేటు.. సస్పెండ్ చేసిన కలెక్టర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నాగర్కర్నూల్ జిల్లాలో విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన అధికారులపై జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ ఉక్కుపాదం మోపారు. ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించి, నిధుల వినియోగంలో పారదర్శకత పాటించని ముగ్గురు పంచాయతీ కార్యదర్శులను సస్పెండ్ చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ చర్య జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
నిధుల దుర్వినియోగంపై కఠిన చర్యలు..
Also Read
- కేవలం రూ. 8,999 లకే120Hz డిస్ప్లే, 6000mAh బ్యాటరీతో Lava Virat V1 5G, Virat V1 స్మార్ట్ఫోన్లు లాంచ్..!
- Google Security: పాస్వర్డ్ మరిచిపోయారా?.. ఇకపై ఒక్క 'సెల్ఫీ వీడియో'తో అకౌంట్ రికవర్!
- Supreme Court: నీట్ లీకేజీపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం.. కేంద్రం, NTAకు న్యాయస్థానం కీలక ఆదేశాలు..
- Delhi Police: విద్యార్థి ఆందోళనల ఎఫెక్ట్.. పోలీసులందరి సెలవులు రద్దు..
కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన 15వ ఆర్థిక సంఘం (15th Finance Commission) గ్రాంట్ల వినియోగంలో తీవ్రమైన లోపాలు జరిగినట్లు కలెక్టర్ గుర్తించారు. పంచాయతీ అభివృద్ధి పనుల కోసం కేటాయించిన నిధులను వినియోగించేటప్పుడు ఈ-గ్రామ్ స్వరాజ్ (e-Gram Swaraj) పోర్టల్ మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. అయితే.. సంబంధిత పంచాయతీ కార్యదర్శులు ఈ నిబంధనలను తుంగలో తొక్కి.. నిధులను ఇష్టారాజ్యంగా దారిమళ్లించడమే కాకుండా.. రికార్డుల నిర్వహణలో తీవ్ర అలసత్వాన్ని ప్రదర్శించారు.
సస్పెన్షన్కు గురైన వారు వీరే..
బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిన కింది అధికారులపై సస్పెన్షన్ వేటు పడింది. అందులో పి. కిషన్ ఒకరు. వంగూరు మండలం, కొండారెడ్డిపల్లి గ్రామపంచాయతీ (గ్రేడ్-IV కార్యదర్శి)కి కార్యదర్శిగా పని చేస్తు్న్నారు. కొల్లాపూర్ మండలం, సింగోటం గ్రామపంచాయతీలో గ్రేడ్-III కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్న పి. అర్జునయ్యపై కూడా వేటు పడింది. కొల్లాపూర్ మండలం, అంకిరావుపల్లి గ్రామపంచాయతీలో గ్రేడ్-III కార్యదర్శిగా పని చేస్తున్న ఆర్. ప్రేమచంద్ కూడా సస్పెన్షన్ కు గురయ్యారు.
విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన వీరికి వ్యతిరేకంగా వచ్చిన ఫిర్యాదులు, ప్రాథమిక విచారణ నివేదికల ఆధారంగా కలెక్టర్ మంగళవారం ఈ ఉత్తర్వులు జారీ చేశారు. కేవలం కార్యదర్శుల మీదనే కాకుండా, వారి పనితీరును పర్యవేక్షించడంలో విఫలమైన మండల స్థాయి అధికారులపై కూడా కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వంగూరు, కొల్లాపూర్ మండలాల మండల పంచాయతీ అధికారులకు (MPOs) షోకాజ్ నోటీసులు జారీ చేశారు. క్షేత్రస్థాయిలో పనులు ఎలా జరుగుతున్నాయి, నిధులు సక్రమంగా వినియోగించబడుతున్నాయా లేదా అని చూడాల్సిన బాధ్యత మీపై లేదా అని ఆయన ప్రశ్నించారు.
కలెక్టర్ హెచ్చరిక..
ప్రభుత్వ నిధులు ప్రజల ప్రయోజనాల కోసమే వినియోగించాలని, ఎక్కడైనా అవినీతి లేదా నిబంధనల ఉల్లంఘన జరిగితే ఉపేక్షించే ప్రసక్తే లేదని కలెక్టర్ బాదావత్ సంతోష్ స్పష్టం చేశారు. ప్రతి పైసాకు జవాబుదారీతనం ఉండాలని, ఈ-గ్రామ్ స్వరాజ్ పోర్టల్లో ఎప్పటికప్పుడు వివరాలు నమోదు చేయాలని ఆయన సూచించారు. విధి నిర్వహణలో అజాగ్రత్తగా ఉండే ఏ అధికారికైనా ఇదే గతి పడుతుందని ఆయన ఈ సందర్భంగా హెచ్చరిక జారీ చేశారు.
తాజావార్తలు
-
కేవలం రూ. 8,999 లకే120Hz డిస్ప్లే, 6000mAh బ్యాటరీతో Lava Virat V1 5G, Virat V1 స్మార్ట్ఫోన్లు లాంచ్..!
-
Srinivasa Mangapuram: ‘శ్రీనివాస మంగాపురం’కు సెన్సార్ క్లియరెన్స్.. ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్కు సిద్ధం!
-
Google Security: పాస్వర్డ్ మరిచిపోయారా?.. ఇకపై ఒక్క ‘సెల్ఫీ వీడియో’తో అకౌంట్ రికవర్!
-
Supreme Court: నీట్ లీకేజీపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం.. కేంద్రం, NTAకు న్యాయస్థానం కీలక ఆదేశాలు..
-
Delhi Police: విద్యార్థి ఆందోళనల ఎఫెక్ట్.. పోలీసులందరి సెలవులు రద్దు..
ట్రెండింగ్
-
రూ. 19,499లకే 50MP సోనీ కెమెరా, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో iQOO Z11 Lite 5G లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: సక్సెస్ను తలకెక్కించుకోను.. బుద్దిగా ఉంటా.. వైభవ్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Kakarakaya Ulli Karam: చేదు లేకుండా కమ్మటి ‘కాకరకాయ ఉల్లి కారం’.. ఇలా చేస్తే పిల్లలు కూడా వదలకుండా తింటారు!
-
Vaibhav Sooryavanshi: బుడ్డోడి బ్యాటింగ్ మిస్ అయ్యారా?.. వైభవ్ మెరుపు ఇన్నింగ్స్ ఫుల్ వీడియో మీకోసమే!
-
ఒక్కసారి ఛార్జ్ చేస్తే 526 కి.మీ రేంజ్, Level-2 ADASతో Kia Syros EV లాంచ్.. రూ.13.49 లక్షల ప్రారంభ ధరతో.!