PM Modi: “వెనక నుంచి దాడి చేయడంపై నమ్మకం లేదు”.. బాలాకోట్ ఎయిర్స్ట్రైక్స్పై కీలక వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: కర్ణాటక ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రధాని నరేంద్రమోడీ పాకిస్తాన్పై బాలాకోట్ వైమానిక దాడుల గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. సోమవారం బాగల్ కోట్లో జరిగిన ర్యాలీలో మాట్లాడిన ఆయన.. ‘‘వైమానిక దాడుల గురించి పాక్ అధికారులకు తెలియజేసిన తర్వాతే మీడియాకు ఫోన్ చేసి సమాచారాన్ని అందించాలని బలగాలను కోరాను, అయితే, వారు తన ఫోన్ లిఫ్ట్ చేయలేదు. నేను బలగాలను వెచి ఉండాలని కోరాను, వారు ఫోన్ తీసుకున్న తర్వాత విషయాన్ని తెలియజేశాను. మోడీ వెనుక నుంచి దాడి చేయడాన్ని నమ్మడు. బహిరంగంగా పోరాడుతాడు’’ అని అన్నారు.
Read Also: Ap Elections: విజయనగరం టీడీపీ రెబల్ అభ్యర్థికి గాజు గ్లాసు గుర్తు కేటాయింపు
Also Read
- Fire Break : ఉత్తర్ ప్రదేశ్ ఘజియాబాద్లో భారీ అగ్ని ప్రమాదం
- PM Kisan 23వ విడత: ఖరీఫ్ సీజన్ వేళ రైతులకు కీలక అప్డేట్.. జూన్ 18న రూ.2,000 ఖాతాలో జమ అవుతాయా?
- Narendra Modi: 'జవహర్ లాల్ నెహ్రూ'ను అధిగమించిన నరేంద్ర మోడీ.. అత్యధిక కాలం ప్రధానిగా.!
- Petrol and Diesel Prices: పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరుగుతాయా? వాహనదారులకు షాక్ తప్పదా?
ఎన్నికల్లో ఓడిపోతామనే ఆలోచనలో ఉన్న వ్యక్తులు టెక్నాలజీని ఉపయోగించి నకిలీ వీడియోలను తయారు చేస్తున్నారని ప్రధాని అన్నారు. ‘‘వారు ఏఐ టెక్నాలజీని దుర్వినియోగం చేస్తున్నారు, సోషల్ మీడియాలో నా వాయిస్తో తప్పుడు విషయాలను చెబుతున్నారు. ఇది పెద్ద ముప్పును సృష్టస్తోంది’’ అని చెప్పారు. ఇలాంటి వీడియోలు వస్తే పోలీసులకు, బీజేపీ కార్యకర్తలకు తెలియజేయాలని, నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మీ ఓటు మోడీని బలపరుస్తుందని, ఆపై దేశం ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారుతుందని, దేశాన్ని తయారీ రంగానికి కేంద్రంగా, నైపుణ్య కేంద్రంగా తీర్చిదిద్దాలనేదే మా సంకల్పం అని మోడీ అన్నారు.
కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం బెంగళూర్ని టెక్ హబ్ నుంచి ట్యాంకర్ హబ్గా మార్చారని, నగరంలో నెలకొన్న నీటి సంక్షోభాన్ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ట్యాంకర్ మాఫియాకు ప్రభుత్వం సాయం చేసిందని దుయ్యబట్టారు. ట్యాంకర్ మాఫియా కాంగ్రెస్కి కమీషన్ చెల్లించిందని ఆయన పేర్కొన్నారు. ఈ ర్యాలీలో బీజేపీ నేత బీఎస్ యడియూరప్ప, బీజేపీ అభ్యర్థులు, బాగల్కోట్, విజయపుర ఎంపీలు పీసీ గడ్డిగౌడర్, రమేష్ జిగాజినాగి తదితరులు పాల్గొన్నారు.
తాజావార్తలు
-
LIC Saral Pension: ఈ ఎల్ఐసీ పాలసీ తెలుసా? ఒక్కసారి ఇన్వెస్ట్ చేస్తే చాలు.. ఆ తర్వాత జీవితాంతం చేతికి రూ.21000!
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
Hitech City Traffic : గంట వర్షం.. 3 గంటల నరకం..! హైదరాబాద్ ఐటీ హబ్ను ముంచేసిన భారీ వర్షం
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
ట్రెండింగ్
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!
-
Ceiling Fan Speed: సీలింగ్ ఫ్యాన్ స్పీడ్ తగ్గిందా.? కారణం ఇదే కావచ్చు.! కొత్తది కొనేముందు ఈ విషయాలు తప్పక చెక్ చేయండి.!
-
WWDCలో పొరపాటున ‘ఫోల్డబుల్ ఐఫోన్’ వివరాలు లీక్ చేసుకున్న Apple.!
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి