Ap Elections: విజయనగరం టీడీపీ రెబల్ అభ్యర్థికి గాజు గ్లాసు గుర్తు కేటాయింపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీలో సార్వత్రిక ఎన్నికల వేళ జనసేన గాజు గ్లాస్ సింబల్ వివాదం క్రమంగా పెరుగుతోంది. సార్వత్రిక ఎన్నికల కీలక ఘట్టం నేటితో ముగిసింది. సోమవారం సాయంత్రం నామినేషన్ల ఉపసంహరణ గడువు కూడా ముగిసింది. గుర్తింపు పొందిన పార్టీ అభ్యర్థులతో పాటు రెబల్ అభ్యర్థులకు గుర్తులు కేటాయించే పనిలో ఎన్నికల అధికారులు పడ్డారు. గుర్తుల ఎంపికలో కీలక పరిణామం చోటుచేసుకుంది. జనసేన పార్టీ సింబల్ గాజు గ్లాసు గుర్తును ఫ్రీ సింబల్ జాబితాలో ఉంచిన విషయం తెలిసిందే. విజయనగరంలో బిగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది. టీడీపీ రెబల్ అభ్యర్థిగా బరిలోకి దిగిన మీసాల గీతకు ఎన్నికల అధికారులు గాజుగ్లాసు గుర్తును కేటాయించారు. దీంతో అక్కడి కూటమి నేతల్లో ఆందోళన మొదలైంది. ఆమెకు గ్లాసు గుర్తు కేటాయించడంపై టీడీపీ నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కాని నిబంధనల ప్రకారమే కేటాయించినట్లు అధికారులు వెల్లడించారు. రెబల్ అభ్యర్థికి జనసేనకు సంబంధించిన గుర్తు కేటాయించడంతో టీడీపీ అభ్యర్థి, అనుచరులు తమ గెలుపుపై ప్రభావం చూపే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
READ MORE: Attack On BJP: బీజేపీ కార్యకర్తపై దాడి.. ఆ పార్టీ చెందిన పలువురు వ్యక్తులపై ఆరోపణ..
Also Read
- Sridhar Babu: త్వరలోనే డిజిటల్ అసెంబ్లీ, డిజిటల్ కౌన్సిల్.. మంత్రి శ్రీధర్ బాబు కీలక ప్రకటన
- KL Rahul: టీమిండియాకు భారీ షాక్.. శుభ్మన్ గిల్ అవుట్.. కెప్టెన్గా కేఎల్ రాహుల్.!
- Bhatti Vikramarka: పెట్టుబడులకు తెలంగాణే ఫస్ట్ ఛాయిస్ కావాలి.. ఎన్నారైలకు భట్టి విక్రమార్క పిలుపు
- WTC 2025-27: ఆస్ట్రేలియా టాప్, భారత్ 5వ స్థానం.. మిగిలిన 9 మ్యాచ్లు డూ ఆర్ డై..
కూటమి తరఫున సీట్లు పంచుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో విజయనగరం సీటు టీడీపీ కేటాయించారు. ఆ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు పోటీ చేస్తున్నారు. ప్రస్తుతం రెబల్ అభ్యర్థి మీసాల గీతకు గాజు గ్లాసు గుర్తు కేటాయించడంతో టీడీపీ అభ్యర్థిపై ప్రభావం పడే అవకాశం కనిపిస్తోంది. ఈ అంశంపై కూటమి నేతలు, ముఖ్యంగా జనసేన పార్టీ నాయకులు ఎన్నికల సంఘానికి వినతులు సమర్పిస్తున్నారు. గాజు గ్లాసును ఫ్రీ సింబల్ జాబితా నుంచి తొలగించాలని కోరుతున్నారు.
తాజావార్తలు
-
Sridhar Babu: త్వరలోనే డిజిటల్ అసెంబ్లీ, డిజిటల్ కౌన్సిల్.. మంత్రి శ్రీధర్ బాబు కీలక ప్రకటన
-
Gujarat Well Mystery: వింత ఘటన.. బావిలో నీరు అలల్లా కదలికలు, రంగంలోకి అధికారులు (వీడియో)
-
Varanasi Update: ‘వారణాసి’పై క్రేజీ అప్డేట్.. ఈసారి పకడ్బందీగా ప్లాన్ చేసిన రాజమౌళి!
-
KL Rahul: టీమిండియాకు భారీ షాక్.. శుభ్మన్ గిల్ అవుట్.. కెప్టెన్గా కేఎల్ రాహుల్.!
-
Bhatti Vikramarka: పెట్టుబడులకు తెలంగాణే ఫస్ట్ ఛాయిస్ కావాలి.. ఎన్నారైలకు భట్టి విక్రమార్క పిలుపు
ట్రెండింగ్
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్కు గుడ్బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!
-
12 అంగుళాల 2K 90Hz డిస్ప్లే, క్వాడ్ స్పీకర్లతో HP OmniPad 12 భారత్లో లాంచ్..!
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!