Ap Elections: విజయనగరం టీడీపీ రెబల్ అభ్యర్థికి గాజు గ్లాసు గుర్తు కేటాయింపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీలో సార్వత్రిక ఎన్నికల వేళ జనసేన గాజు గ్లాస్ సింబల్ వివాదం క్రమంగా పెరుగుతోంది. సార్వత్రిక ఎన్నికల కీలక ఘట్టం నేటితో ముగిసింది. సోమవారం సాయంత్రం నామినేషన్ల ఉపసంహరణ గడువు కూడా ముగిసింది. గుర్తింపు పొందిన పార్టీ అభ్యర్థులతో పాటు రెబల్ అభ్యర్థులకు గుర్తులు కేటాయించే పనిలో ఎన్నికల అధికారులు పడ్డారు. గుర్తుల ఎంపికలో కీలక పరిణామం చోటుచేసుకుంది. జనసేన పార్టీ సింబల్ గాజు గ్లాసు గుర్తును ఫ్రీ సింబల్ జాబితాలో ఉంచిన విషయం తెలిసిందే. విజయనగరంలో బిగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది. టీడీపీ రెబల్ అభ్యర్థిగా బరిలోకి దిగిన మీసాల గీతకు ఎన్నికల అధికారులు గాజుగ్లాసు గుర్తును కేటాయించారు. దీంతో అక్కడి కూటమి నేతల్లో ఆందోళన మొదలైంది. ఆమెకు గ్లాసు గుర్తు కేటాయించడంపై టీడీపీ నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కాని నిబంధనల ప్రకారమే కేటాయించినట్లు అధికారులు వెల్లడించారు. రెబల్ అభ్యర్థికి జనసేనకు సంబంధించిన గుర్తు కేటాయించడంతో టీడీపీ అభ్యర్థి, అనుచరులు తమ గెలుపుపై ప్రభావం చూపే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
READ MORE: Attack On BJP: బీజేపీ కార్యకర్తపై దాడి.. ఆ పార్టీ చెందిన పలువురు వ్యక్తులపై ఆరోపణ..
Also Read
- MLA Yarlagadda Venkata Rao: గన్నవరం ఎమ్మెల్యే గైర్హాజరుతో మళ్లీ చర్చ.. ఏటీసీ ప్రారంభోత్సవానికి ఎందుకు డుమ్మా..?
- Meerut Murder: ఆరేళ్ల క్రితం ప్రేమ పెళ్లి.. డ్రైవర్తో ఎఫైర్.. భర్తను పాముతో కరిపించి చంపేసిన భార్య..
- WHO Cancer Report 2026: ఏడాదికి కోటి మంది మృతి..! క్యాన్సర్పై WHO షాకింగ్ నివేదిక..
- KTR: 70 వేల ఉద్యోగాలు ఇచ్చినట్టు నిరూపిస్తే.. శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటా.!
కూటమి తరఫున సీట్లు పంచుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో విజయనగరం సీటు టీడీపీ కేటాయించారు. ఆ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు పోటీ చేస్తున్నారు. ప్రస్తుతం రెబల్ అభ్యర్థి మీసాల గీతకు గాజు గ్లాసు గుర్తు కేటాయించడంతో టీడీపీ అభ్యర్థిపై ప్రభావం పడే అవకాశం కనిపిస్తోంది. ఈ అంశంపై కూటమి నేతలు, ముఖ్యంగా జనసేన పార్టీ నాయకులు ఎన్నికల సంఘానికి వినతులు సమర్పిస్తున్నారు. గాజు గ్లాసును ఫ్రీ సింబల్ జాబితా నుంచి తొలగించాలని కోరుతున్నారు.
తాజావార్తలు
-
MLA Yarlagadda Venkata Rao: గన్నవరం ఎమ్మెల్యే గైర్హాజరుతో మళ్లీ చర్చ.. ఏటీసీ ప్రారంభోత్సవానికి ఎందుకు డుమ్మా..?
-
Meerut Murder: ఆరేళ్ల క్రితం ప్రేమ పెళ్లి.. డ్రైవర్తో ఎఫైర్.. భర్తను పాముతో కరిపించి చంపేసిన భార్య..
-
The Odyssey: రూ.2000 కోట్ల బడ్జెట్.. నోలన్ మ్యాజిక్కు ఇండియా ఫిదా.. ‘ది ఒడిస్సీ’కి అదిరిపోయే ఓపెనింగ్!
-
Explainer: అట్లాంటిక్ కింద 300°C వేడి నీరు.. సూర్యకాంతి లేకుండా జీవం ఎలా బతుకుతోంది?
-
WHO Cancer Report 2026: ఏడాదికి కోటి మంది మృతి..! క్యాన్సర్పై WHO షాకింగ్ నివేదిక..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!
-
185Hz OLED డిస్ప్లే, లిక్విడ్ కూలింగ్తో పవర్ఫుల్ గేమింగ్ ట్యాబ్లెట్ REDMAGIC Astra 2 లాంచ్..!