Modi-Rabuka: ఎవరో మీతో సంతోషంగా లేరు.. మోడీతో ఫిజీ ప్రధాని వ్యాఖ్య
- ఎవరో మీతో సంతోషంగా లేరు
- మోడీతో ఫిజీ ప్రధాని రబుకా వ్యాఖ్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఫిజీ ప్రధాని రబుకా మూడు రోజుల పర్యటన నిమిత్తం భారత్కు వచ్చారు. పర్యటనలో భాగంగా ప్రధాని మోడీతో ఫిజీ ప్రధాని రబుకా బృందం ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించారు. సోమవారం నాడు వాణిజ్యం, పెట్టుబడులు వంటి రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడంపై చర్చలు జరిపినట్లు వర్గాలు పేర్కొన్నాయి.
ఇది కూడా చదవండి: PM Modi: రేపు 2 దేశాల పర్యటనకు వెళ్లనున్న మోడీ
Also Read
- Kerala CM: కేరళ కాంగ్రెస్లో వర్గపోరు.. సీఎంగా ఆయనకే రాహుల్ మద్దతు..
- PM Modi: పరాన్నజీవి కాంగ్రెస్, డీఎంకేను వెన్నుపోటు పొడిచింది.. ప్రధాని మోడీ ఫైర్..
- Elvish Yadav: ప్రముఖ యూట్యూబర్ ఎల్విష్ యాదవ్కు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ బెదిరింపులు!
- Himanta Biswa Sarma: హిమంత ది అన్స్టాపబుల్.. శాసనసభ పక్ష నాయకుడిగా ఏకగ్రీవంగా ఎన్నిక.. సీఎం ఓత్ ఫిక్స్ డేట్
ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ వరల్డ్ అఫైర్స్ (ICWA) నిర్వహించిన సప్రూ హౌస్లో ‘ఓషన్ ఆఫ్ పీస్’ అనే అంశంపై ఉపన్యాసం ఇచ్చిన తర్వాత జరిగిన సంభాషణలో రబుకా.. మోడీతో మాట్లాడుతూ.. ఎవరో ‘‘మీతో సంతోషంగా లేరు’’ అని, ‘‘మీరు ఆ అసౌకర్యాలను తట్టుకునేంత పెద్దవారు.’’ అని వ్యాఖ్యానించారు. భారత్పై ట్రంప్ 50 శాతం సుంకం విధించడంతో రెండు దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీతో ఫిజీ ప్రధాని రబుకా ఈ విధంగా సంభాషించారు.
ఇది కూడా చదవండి: UP: సీఎం యోగి సరికొత్త నిర్ణయం.. 7 నగరాల్లో ట్రాఫిక్ కంట్రోల్ కోసం ఏం చేశారంటే..!
అమెరికా అధ్యక్షుడితో తనకు ఎలాంటి వ్యక్తిగత సంభాషణ లేదని.. రష్యా అధ్యక్షుడితో ద్వైపాక్షిక చర్చలు జరపాలని కోరానని ఆయన అన్నారు. ప్రధాని మోడీ మా భావాలను, భావనను అర్థం చేసుకున్నారని రబుకా పేర్కొన్నారు. భారతదేశం ఒక ముఖ్యమైన భాగస్వామి అని.. శాంతి మహాసముద్రంగా పసిఫిక్ దార్శనికత మన ప్రాంతానికి మాత్రమే కాకుండా ప్రపంచ శాంతి, స్థిరత్వానికి దోహదపడేలా ఫిజీ, భారతదేశం కలిసి పనిచేయగలవు అని ఫిజీ ప్రధాని రబుకా అన్నారు.
దక్షిణ పసిఫిక్ దేశమైన ఫిజీ. సముద్ర భద్రత రంగంలో భారతదేశానికి ముఖ్యమైనది. రెండు దేశాలు బలమైన సాంస్కృతిక మరియు ప్రజల మధ్య సంబంధాలను కలిగి ఉన్నాయి.
తాజావార్తలు
-
Kerala CM: కేరళ కాంగ్రెస్లో వర్గపోరు.. సీఎంగా ఆయనకే రాహుల్ మద్దతు..
-
Pakistan Terror Attack: పాలు పోసి పెంచిన పామే కాటేసింది.. పాకిస్థాన్లో ఉగ్రదాడి!
-
CM Vijay: తమిళనాడు సీఎంగా దళపతి విజయ్ .. ‘జన నాయగన్’ సినిమా రిలీజ్ ఎప్పుడంటే?
-
Hantavirus Outbreak: హంటావైరస్ కలకలం.. లక్షణాలు, చికిత్సపై WHO కీలక హెచ్చరిక.. కొత్త మహమ్మారిగా మారుతుందా..?
-
PM Modi: పరాన్నజీవి కాంగ్రెస్, డీఎంకేను వెన్నుపోటు పొడిచింది.. ప్రధాని మోడీ ఫైర్..