UP: సీఎం యోగి సరికొత్త నిర్ణయం.. 7 నగరాల్లో ట్రాఫిక్ కంట్రోల్ కోసం ఏం చేశారంటే..!
- ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి సరికొత్త నిర్ణయం
- 7 నగరాల్లో ట్రాఫిక్ కంట్రోల్ కోసం చారిత్రిక నిర్ణయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సరికొత్త నిర్ణయం తీసుకున్నారు. చారిత్రాత్మక కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టారు. ఏడు నగరాల్లో పూర్తిగా ట్రాఫిక్ నియంత్రణ కోసం మహిళా సిబ్బందినే నియమించాలని పోలీస్ శాఖకు ఆదేశించారు. లింగ సమతుల్యత కోసం ముఖ్యమంత్రి ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఇది కూడా చదవండి: PM Modi: రేపు 2 దేశాల పర్యటనకు వెళ్లనున్న మోడీ
Also Read
- Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
- India-China Ties: ప్రధాని మోడీ ఒక్క ప్రకటనతో చైనాలో ఆనందం..
- Gurugram: ఆమె అమ్మాయినే తెలియదు.. గురుగ్రామ్ బైకర్ను ఢీకొట్టిన నిందితుడు వింత వాదన
- India’s Artificial Sun: భారత్ ‘ఆర్టిఫిషియల్ సన్’ ప్రయోగం సక్సెస్.. సూర్యుడి కేంద్రం కంటే 20 రెట్లు వేడి!
నెల రోజుల ప్రత్యేక శిక్షణా కార్యక్రమం తర్వాత ప్రస్తుత సివిల్ పోలీస్ ఫోర్స్ నుంచి తీసుకోబడిన సుమారు 600 మంది మహిళా హెడ్ కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లను పరిగణనలోకి తీసుకోనున్నారు. అక్టోబర్ నుంచి లక్నో, కాన్పూర్, ఘజియాబాద్, ప్రయాగ్రాజ్, వారణాసి, ఆగ్రా, గౌతమ్ బుద్ధ్ నగర్ పోలీసు కమిషనరేట్లలో మహిళా సిబ్బంది నియమితులు కానున్నారు.
ఇది కూడా చదవండి: Off The record: మిత్రపక్షం టీడీపీకే షాకిచ్చిన బీజేపీ నేత..!
లింగ సమానత్వంలో భాగంగా ట్రాఫిక్ నియంత్రణ కోసం ముఖ్యమంత్రి యోగి ఆదేశాల మేరకు మహిళలను నియమిస్తున్నట్లు అదనపు జనరల్ ఆఫ్ పోలీస్ (ట్రాఫిక్) సత్యనారాయణ్ తెలిపారు. మొదటిసారిగా ఈ విధానాన్ని ప్రవేశపెడుతున్నట్లు చెప్పుకొచ్చారు. ఉద్యోగాల ఎంపిక ప్రక్రియ ప్రస్తుతం జరుగుతోందని.. అభ్యర్థులు క్లీన్ సర్వీస్ రికార్డ్ కలిగి ఉండాలని.. ట్రాఫిక్ విధులను చేపట్టడానికి సంసిద్ధతను వ్యక్తం చేయాలని తెలిపారు. మొదటి దశలో ఏడు కమిషనరేట్లలో ప్రతిదానిలో 13 మంది మహిళా హెడ్ కానిస్టేబుళ్లు, 30 మంది మహిళా కానిస్టేబుళ్లను నియమించనున్నట్లు వెల్లడించారు.
మహిళా సిబ్బందికి ప్రత్యేక శిక్షణ సెప్టెంబర్ మొదటి వారంలో ప్రారంభం కానుంది. ట్రాఫిక్ విభాగాన్ని విస్తరించడంలో భాగంగా సివిల్ పోలీసుల నుంచి 5,000 మంది పురుష సిబ్బందిని చేర్చుకోవడానికి కూడా అనుమతి ఇచ్చింది. కొత్తగా చేరిన పురుషులు, మహిళలు అందరూ జోనల్ మరియు కమిషనరేట్ కేంద్రాల్లో శిక్షణ పొందనున్నారు.
తాజావార్తలు
-
Lava Virat Curve: 3D కర్వ్డ్ AMOLED స్క్రీన్, 6000mAh బ్యాటరీ.. 7100 ప్రాసెసర్, 50MP కెమెరా.. సెప్టెంబర్ 21న లాంచ్..
-
Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
-
Marriage Rumours: ఆ హీరోతో పెళ్లి రూమర్లపై ఓపెన్ అయిన హీరోయిన్!
-
Trump: ఉక్రెయిన్-రష్యా ఇంధన వసతులపై దాడి చేయమని చెప్పాయి.. ట్రంప్ కీలక ప్రకటన
-
Saudi Arabia: సౌదీ అరేబియాకు జాక్పాట్.. మదీనాలో భారీగా యురేనియం నిల్వలు..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!