Indo-Pak Border: సరిహద్దులో బాలిక, బాలుడి మృతదేహాలు లభ్యం.. మిస్టరీగా డెత్!
- భారత్-పాకిస్థాన్ సరిహద్దులో బాలిక, బాలుడి మృతదేహాలు లభ్యం
- పాకిస్థాన్ జాతీయులుగా గుర్తింపు.. అధికారుల దర్యాప్తు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత్-పాకిస్థాన్ అంతర్జాతీయ సరిహద్దులో బాలిక, బాలుడి మృతదేహాలు తీవ్ర కలకలం రేపాయి. రాజస్థా్న్లోని జైసల్మేర్లోని ఇండో-పాక్ సరిహద్దులో కుళ్లిపోయి ఉన్న రెండు మృతదేహాలను బీఎస్ఎఫ్ జవాన్లు స్వాధీనం చేసుకుంది. సంఘటనాస్థలి నుంచి ఖాళీ వాటర్ బాటిల్, ఐడీలు, సిమ్ కార్డు స్వాధీనం చేసుకున్నారు. ఐడీకార్డులను బట్టి పాకిస్థాన్ జాతీయులుగా అధికారులు గుర్తించారు. భారత్ నుంచి పాకిస్థాన్కు వెళ్తున్నారా? లేదంటే పాకిస్థాన్ నుంచి భారత్లోకి అక్రమంగా ప్రవేశిస్తు్న్నారా? అనేది ఇంకా తేలలేదు. తాజాగా వర్షాలు కురవడంతో పాదముద్రలు గానీ.. ఆనవాళ్లు గానీ ఏమీ కనిపించలేదు. ఇక కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: Patancheru : పాశమైలారం పేలుడు ఘటన.. 10కి చేరిన మృతుల సంఖ్య
Also Read
- Nepal: నేపాల్ భారత భూభాగాలను ఆక్రమించుకుంది.. బాలెన్ షా సంచలన వ్యాఖ్యలు..
- Indian Railways: రేపటి నుంచి రైల్వే కొత్త రూల్స్.. వెయిటింగ్ టికెట్లు, అడ్వాన్స్ బుకింగ్లలో కీలక మార్పులు
- UP Encounter: సూర్య హత్య, అసద్ ఎన్కౌంటర్.. యోగి సర్కార్పై ఎస్పీ విమర్శలు..
- West Bengal: మమతకు భారీ షాక్.. 80 మందిలో 20 మంది ఎమ్మెల్యేలే హాజరు!
పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం… భారత భూభాగంలో మృతదేహాలు కనిపించాయని చెప్పారు. పాకిస్థాన్ సిమ్ కార్డు, ఐడీలు, మొబైల్ ఫోన్, వాటర్ బాటిల్ సంఘటనాస్థలి నుంచి స్వాధీనం చేసుకున్నారు. డీహైడ్రేషన్ కారణంగానే ఇద్దరూ చనిపోయి ఉంటారని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ఎక్కడ నుంచి ఎక్కడికి వెళ్తున్నారనేది తేలాల్సి ఉందని చెప్పారు. ఇద్దరు మృతదేహాలు కూడా కుళ్లిపోయి ఉన్నట్లు తెలిపారు.
ఇది కూడా చదవండి: Rukmini Vasanth : రెమ్యునరేషన్ విషయంలో తగ్గేదేలే..
భారత భూభాగం నుంచి 10-12 కిలోమీటర్ల దూరంలో ఈ రెండు డెడ్బాడీలు కనిపించాయని.. ఐడీ కార్డులను బట్టి మృతులు రవి కుమార్(17), శాంతి బాయి(15)గా గుర్తించినట్లు జైసల్మేర్ ఎస్పీ సుధీర్ చౌదరి వెల్లడించారు. 2023లో జారీ చేయబడిన ఐడీ కార్డులు అని తెలిపారు. ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోందని.. ఆధారాలు నిర్ధారించేందుకు ప్రయత్నిస్తు్న్నట్లు పేర్కొన్నారు. వారం క్రితం చనిపోయి ఉంటారని అంచనా వేశారు. మృతదేహాలను రామ్గఢ్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ మార్చురీకి పంపారు. పోస్ట్మార్టం పరీక్ష తర్వాత మరణానికి కారణాన్ని నిర్ధారించనున్నారు.
#WATCH | Jaisalmer, Rajasthan | On dead bodies of Pakistani nationals found near India-Pakistan border, SP Sudhir Chaudhary says, "Around 11 AM yesterday, a local resident reported that the body of a young woman had been found a few kilometres from the international… pic.twitter.com/tYQ3ZOonIy
— ANI (@ANI) June 29, 2025
తాజావార్తలు
-
RCB Champion: ఐపీఎల్ ఫైనల్లో విరాట్ కోహ్లీ విశ్వరూపం.. రెండో సారి కప్ అందుకున్న RCB..
-
Vaibhav Sooryavanshi: కోహ్లీ, గిల్, యశస్వి జైస్వాల్ను వెనక్కి నెట్టిన వైభవ్ సూర్యవంశీ.. 15 ఏళ్ల వయస్సులోనే అరుదైన రికార్డు..
-
Virat Kohli: ఆకాశమే హద్దుగా చెలరేగిన విరాట్ కోహ్లీ.. 19 ఏళ్ల ఐపీఎల్ హిస్టరీలో అరుదైన రికార్డు సాధించిన కింగ్..
-
GT Vs RCB: వార్ వన్ సైడ్ అయిపోయింది.. ఫైనల్ మజా రావడం లేదు.. నిరాశలో అభిమానులు..
-
Kitchen Hacks : ఇంట్లో తోడుపెట్టిన పెరుగుపై నీరు చేరుతోందా.? ఈ చిట్కాలతో గడ్డలా చిక్కటి పెరుగు రెడీ.!
ట్రెండింగ్
-
Home Safety Tips : మీ ఇంటి దగ్గర పాము కనిపిస్తే భయపడకండి, ఈ 5 సులభమైన చిట్కాలను పాటించండి!
-
Balcony Tips : బాల్కనీలో పావురాల లొల్లి ఎక్కువైందా.? ఈ సింపుల్ ట్రిక్స్తో గుడ్బై చెప్పేయండి.!
-
Wash Basin Blocked : వాష్ బేసిన్ బ్లాక్ అయిందా.? ప్లంబర్ అవసరం లేకుండా ఈ చిట్కాలతో నిమిషాల్లో క్లియర్ చేయండి.!
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!