Mayawati: బంగ్లాదేశ్ హిందువుల పరిస్థితికి కాంగ్రెస్ కారణం.. ఇప్పుడు ముస్లిం ఓట్ల కోసం..
- బంగ్లాదేశ్ హిందువుల్ని వెనక్కి తీసుకురావాలి..
- అక్కడ హిందువుల పరిస్థితికి కాంగ్రెస్ కారణం..
- ముస్లిం ఓట్ల కోసమే సంభాల్ అంటూ అరుస్తోంది..
- బీఎస్పీ అధినేత్రి మాయవతి సంచలన విమర్శలు..
Mayawati: బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న అకృత్యాలపై బహుజన్ సమాజ్ పార్టీ(బీఎస్పీ) అధినేత్రి మాయావతి స్పందించారు. శనివారం ఆమె మాట్లాడుతూ.. బంగ్లాదేశ్లో హిందువుల పరిస్థితికి కాంగ్రెస్ కారణమని ఆరోపించారు. కాంగ్రెస్పై విరుచుకుపడిన ఆమె.. రాజ్యాంగ సభకు డాక్టర్ భీమ్ రావ్ అంబేద్కర్ని ఎన్నుకున్నందుకు శిక్షగా, హిందూ మెజారిటీ ప్రాంతం అయినప్పటికీ కాంగ్రెస్ బెంగాల్ని పాకిస్తాన్కి ఇచ్చిందని ఆరోపించారు. ఆ తర్వాత ఈ ప్రాంతం బంగ్లాదేశ్లో భాగమైందని చెప్పారు.
Also Read
- Producing States in India: భారత్లో 'పెట్రోల్' బావులు ఏయే రాష్ట్రాల్లో ఉన్నాయో తెలుసా?
- Amrit Bharat Express: రైల్వే ప్రయాణికులు శుభవార్త.. పట్టాలపైకి మరో రెండు అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు..
- Viral: ‘మీసాల పిల్ల’ అంటూ ఎగతాళి చేశారు.. కట్ చేస్తే ప్రశంసల హోరు..
- Padma Awards 2027: దేశ అత్యున్నత పౌర పురస్కారాలు.. నేడే నామినేట్ చేసుకోండి.. పూర్తి వివరాలివే!
కాంగ్రెస్ ముస్లింలను బుజ్జగిస్తోందని మాయావతి మండిపడ్డారు. సంభాల్ మసీదు సమస్యని లేవనెత్తడాన్ని ఆమె ప్రస్తావించారు. పొరుగుదేశంలో హిందువులపై పెద్ద సంఖ్యలో అఘాయిత్యాలు జరిగి బలవుతున్నారని, వారిలో దళితులు, బడుగు బలహీన వర్గాలకు చెందిన వారే ఎక్కువగా ఉన్నారని, కాంగ్రెస్ పార్టీ మౌనంగా ఉండి, ఇప్పుడు సంభాల్, సంభాల్ అంటూ ముస్లిం ఓట్ల కోసం అరుస్తోందని విమర్శించారు.
సమాజ్వాదీ(ఎస్పీ) పార్టీ కాంగ్రెస్కి సహకరిస్తుందని దుయ్యబట్టారు. హిందువులను బంగ్లాదేశ్ నుంచి తీసుకురావాలని ఆమె కోరారు. వారి భద్రతకు హామీ ఇవ్వకపోతే, అక్కడి హిందువులను వెంటనే వెనక్కి తీసుకురావానలి ఆమె డిమాండ్ చేశారు. ఈ విషయంలో కాంగ్రెస్, ఎస్పీలు నాణేనానికి రెండు ముఖాలని, ఇలాంటి పరిస్థితుల్లో బీజేపీ నేతృత్వంలోని కేంద్రం తన బాధ్యతల్ని నిర్వర్తించాలని కోరారు. కాంగ్రెస్ వల్లే బంగ్లాదేశ్ హిందువులు నష్టపోయారంటూ మండిపడ్డారు.
#WATCH | Lucknow, Uttar Pradesh: BSP chief Mayawati said, "…Hindus are becoming victims of crimes in large numbers in the neighbouring country Bangladesh. Most of them are Dalits and people from weaker sections…Congress party is silent and is now shouting 'Be careful' only… pic.twitter.com/IPHfIvDenz
— ANI (@ANI) December 7, 2024
తాజావార్తలు
-
Crane Accident : శంకర్పల్లిలో విషాదం.. క్రేన్ కూలి ముగ్గురు మృతి
-
DC Vs RCB: హమ్మయ్య.. ‘49’ తప్పించుకున్నాం.. ఢిల్లీ క్యాపిటల్స్ హ్యాపీ..
-
Bordeaux : ఈ ఒక్క ప్రాంతం వైన్ ప్రపంచాన్ని ఎలా మార్చింది..??
-
Yatra: హీరోగా రజనీకాంత్ మనవడు.. కొడుకు సిల్వర్ స్క్రీన్ ఎంట్రీపై ధనుష్ క్లారిటీ ఇదే!
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
ట్రెండింగ్
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!