Encounter: మావోలు-పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు.. మావోయిస్టు కమాండర్ మృతి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Encounter: ఛత్తీస్గఢ్లో మరోసారి పోలీసులు, మావోయిస్టులకు మధ్య కాల్పులు చోటుచేసుకున్నాయి. ఆ రాష్ట్రంలో భెజ్జీ ప్రాంతంలో జరిగిన కాల్పుల్లో పలువురికి గాయాలైనట్లు తెలుస్తోంది. ఈ ఎన్కౌంటర్లో మావోయిస్టు హద్మా అలియాస్ సంకు మృతి చెందినట్లు సమాచారం. ప్రస్తుతం హద్మా అలియాస్ సంకు మావోయిస్టు డీవీసీఎం కమాండర్గా పని చేస్తున్నట్లు సమాచారం.
హద్మా అలియాస్ సంకు మాడ్ ప్రాంతంలో చురుకైనా మావోయిస్టుగా గుర్తింపు పొందారు. సుక్మాలోని దాదాపు అన్ని ప్రధాన సంఘటనల్లోనూ హుద్మా ప్రమేయం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లాలోని అటవీ ప్రాంతంలో సోమవారం భద్రతా బలగాలతో జరిగిన ఎన్కౌంటర్లో ఓ నక్సల్ హతమయ్యాడని పోలీసులు తెలిపారు. జిల్లా రిజర్వ్ గార్డ్ బృందం నక్సల్స్ వ్యతిరేక ఆపరేషన్లో ఉన్నప్పుడు భెజ్జీ పోలీస్ స్టేషన్ పరిధిలోని భండార్పదర్ గ్రామ సమీపంలోని అడవిలో ఈ ఉదయం కాల్పులు జరిగినట్లు ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (బస్తర్ రేంజ్) సుందర్రాజ్ వెల్లడించారు. ఉదయం 7:30 గంటల ప్రాంతంలో పెట్రోలింగ్ బృందం అడవి గుండా ముందుకు వెళుతుండగా.. ఇరువర్గాల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి.
Also Read
Gyanvapi case: జ్ఞానవాపీ కేసులో ముస్లింల తరపు న్యాయవాది గుండెపోటుతో మృతి
తుపాకీ కాల్పులు ఆగిన తర్వాత, ఘటనా స్థలం నుంచి ఒక అల్ట్రా మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నామని, ప్రాథమికంగా చనిపోయిన మావోయిస్టును మావోయిస్టుల డివిజనల్ కమిటీ సభ్యుడు (డీవీసీ) మాద్వి హద్మాగా గుర్తించామని ఐజీ తెలిపారు. సమీప ప్రాంతాల్లో సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోందని ఆయన తెలిపారు. గత పది రోజుల్లో సుక్మా జిల్లాలో జరిగిన వేర్వేరు ఎన్కౌంటర్లలో నక్సల్స్ను హతమార్చడం ఇది మూడోసారి.
తాజావార్తలు
-
Horror Movie: మైత్రి మూవీ మేకర్స్ నుంచి తొలి హారర్ మూవీ.. ‘418’తో భయపెట్టేందుకు సిద్ధం!
-
Home Guard: 5 నెలలుగా జీతం లేదు.. కన్నీటి పర్యంతమైన మహిళా హోంగార్డు
-
CM Revanth Reddy: పదవుల కోసం గాంధీ భవన్కు రావొద్దు.. పార్టీ నేతలకు సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్
-
Google Pixel 11a: గూగుల్ పిక్సెల్ 11a.. 8GB RAM, 120Hz డిస్ప్లే, Tensor G6 చిప్సెట్.. కొత్త ఫీచర్లు ఇవే!
-
Virat Kohli Retirement: తప్పుకుంటా.. బీసీసీఐకి విరాట్ కోహ్లీ వార్నింగ్.. వీడియో వైరల్!
ట్రెండింగ్
-
Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!