Maoist Bunker Seized: ఛత్తీస్గఢ్లో బయటపడ్డ మావోయిస్టు బంకర్.. బాంబులు స్వాధీనం!
- ఛత్తీస్గఢ్: దండకారణ్యంలో అలజడి రేపిన టన్నెల్..
- బీజాపూర్ వద్ద బయటపడ్డ మావోయిస్టు బంకర్..
- బంకర్లో గన్ఫౌండ్రీ పరికరాలు, మందుగుండు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Maoist Bunker Seized: ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా భద్రతా బలగాలు సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. ఇప్పటికే దాదాపు 20 మంది మావోలను బలగాలు హత మార్చేశాయి. ఈ క్రమంలోనే బీజాపూర్, సుక్మా జిల్లాల సరిహద్దులో ఉన్న తుమ్రైల్లి అటవీలో నక్సల్స్ బంకర్ను డీఆర్జీ సైనికులు గుర్తించారు. ఈ క్రమంలో బంకర్లో నుంచి భారీగా ఆయుధాలను, పేలుడు పదార్థాలను తయారు చేసే సామాగ్రిని హస్తగతం చేసుకున్నారు. అయితే, కొత్త టెక్నాలజీతో భద్రతా బలగాలకు హాని కలిగించేలా సొరంగం లోపల బాంబులు తయారు చేసేందుకు మావోయిస్టులు గాజు సీసాలను వినియోగిస్తున్నట్లు గుర్తించారు. ఇక, ఆయుధాలు తయారు చేసే యంత్రాలతో పాటు ఎలక్ట్రికల్ వైర్లు, బాటిల్ బాంబులను స్వాధీనం చేసుకున్నారు.
Read Also: NTR’S Death Anniversary: ఎన్టీఆర్ ఘాట్లో జూ.ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ నివాళులు
Also Read
- Siya Goyal: ప్రియుడి కోసం కాబోయే భర్త హ*త్య.. పూణే కోటలో నిందితులతో క్రైమ్ సీన్ రీక్రియేట్.. కుటుంబ సభ్యుల్లో ఆవేదన
- Woman Litters In Train: రైలు కోచ్లో చెత్త విసిరి, సీటు పక్కనే చేతులు కడిగిన మహిళ.. సివిక్ సెన్స్పై దేశవ్యాప్తంగా చర్చ
- Bharat Taxi Launch: ఓలా, ఉబర్లకు చెక్.. రంగంలోకి కేంద్ర ప్రభుత్వ ‘భారత్ టాక్సీ’.. అమిత్ షా మెగా ప్లాన్!
- PM Modi: సీషెల్స్లో మోడీ పర్యటన.. వృక్ష ఉద్యానవనం సందర్శన
కాగా, బీజాపూర్ జిల్లాలోని పూజారి కాంకేరు, మారేడుబాక ఫారెస్ట్ ఏరియాలో నక్సల్స్ ఆపరేషన్లో పాల్గొన్న సమయంలో భద్రతా బలగాలు తాలిపేరు నది ఒడ్డున తుమ్రెల్లి అటవీ ప్రాంతంలో ఈ సొరంగాన్ని కనుగొన్నారు. ఈ చర్యతో మావోయిస్టులకు కోలుకోలేని షాక్ తగిలిందని చెప్పాలి. ఇదిలా ఉండగా.. ఇటీవల ఛత్తీస్గఢ్లో మావోయిస్టులే టార్గెట్గా భద్రతా బలగాలు దాడులు చేస్తున్నారు. ఒక్క జనవరి నెలలోనే దాదాపు 35 మంది వరకు నక్సలైట్లను భద్రతా బలగాలు చంపేశారు. అయితే, ఈశాన్య రాష్ట్రాలతో పాటు ఆఫ్ఘనిస్తాన్ , ఇరాక్ లాంటి దేశాల్లో తీవ్రవాదులు ఉండే ప్రదేశాల్లో ఇలాంటి బంకర్లు మనకి కనిపిస్తుంటాయి.
Read Also: Budget Session : జనవరి 31నుంచి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు.. ఎంతకాలం కొనసాగుతాయో తెలుసా ?
అలాగే, దంతేవాడ, బీజాపూర్, కాంకేర్, నారాయణపూర్, సుక్మ జిల్లాల్లో వేల మంది సీఆర్పీఎఫ్, డీఆర్జీ కోబ్రా బలగాలు అనువణువున గాలిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా నిన్న భారీ ఎన్ కౌంటర్లో 15 మందికి పైగా మావోయిస్టులు మృత్యువాత పడ్డారు. ఈ కూంబింగ్ కొనసాగుతున్న నేపథ్యంలో ఛత్తీస్ గడ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా ఊసూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని తుమ్రెల్లి దండకారణ్యంలోని తెలంగాణ జిల్లాల్లోని తాళి పేరు నది వెనుక సమీపంలో మావోల బంకర్ ను డీఆర్జీ సైన్యం గుర్తించింది.
తాజావార్తలు
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
SUV Safety: ఎస్యూవీలతో పాదచారులకు ముప్పు.. 8 ఏళ్లలో 3,000కు పైగా మరణాలు!
-
Red Magic Tablet 5 Pro: రెడ్ మ్యాజిక్ టాబ్లెట్ 5 ప్రో వచ్చేస్తోంది.. 8300mAh బ్యాటరీ, 185Hz OLED డిస్ప్లే
-
Animation Universe: టాలీవుడ్లో కొత్త ట్రెండ్.. ‘ఆర్య’ కోసం యానిమేటెడ్ యూనివర్స్ సిద్ధం!
-
Back To Back Releases : మూడు నెలల్లో మూడు సినిమాలు రిలీజ్ చేస్తున్న స్టార్ హీరో
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!