Maoist Bunker Seized: ఛత్తీస్గఢ్లో బయటపడ్డ మావోయిస్టు బంకర్.. బాంబులు స్వాధీనం!
- ఛత్తీస్గఢ్: దండకారణ్యంలో అలజడి రేపిన టన్నెల్..
- బీజాపూర్ వద్ద బయటపడ్డ మావోయిస్టు బంకర్..
- బంకర్లో గన్ఫౌండ్రీ పరికరాలు, మందుగుండు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Maoist Bunker Seized: ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా భద్రతా బలగాలు సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. ఇప్పటికే దాదాపు 20 మంది మావోలను బలగాలు హత మార్చేశాయి. ఈ క్రమంలోనే బీజాపూర్, సుక్మా జిల్లాల సరిహద్దులో ఉన్న తుమ్రైల్లి అటవీలో నక్సల్స్ బంకర్ను డీఆర్జీ సైనికులు గుర్తించారు. ఈ క్రమంలో బంకర్లో నుంచి భారీగా ఆయుధాలను, పేలుడు పదార్థాలను తయారు చేసే సామాగ్రిని హస్తగతం చేసుకున్నారు. అయితే, కొత్త టెక్నాలజీతో భద్రతా బలగాలకు హాని కలిగించేలా సొరంగం లోపల బాంబులు తయారు చేసేందుకు మావోయిస్టులు గాజు సీసాలను వినియోగిస్తున్నట్లు గుర్తించారు. ఇక, ఆయుధాలు తయారు చేసే యంత్రాలతో పాటు ఎలక్ట్రికల్ వైర్లు, బాటిల్ బాంబులను స్వాధీనం చేసుకున్నారు.
Read Also: NTR’S Death Anniversary: ఎన్టీఆర్ ఘాట్లో జూ.ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ నివాళులు
Also Read
- Tamil Nadu Budget 2026: జెన్-జెడ్ విద్యార్థులపై ప్రభుత్వం వరాల జల్లు.. గోల్డ్ కాయిన్స్, పట్టు చీరలు, సైకిళ్ల పంపిణీ..!
- PM Modi: "మార్క్ జుకర్బర్గ్ ప్రధాని మోడీకి క్షమాపణ చెప్పాలి, లేకపోతే..." మెటా సీఈఓకు పార్లమెంటరీ ప్యానెల్ అల్టిమేటం?
- Terror Modules: జంతర్ మంతర్ నిరసనల్లో టెర్రరిస్ట్లు.. 9 మంది పాకిస్థాన్ ఐఎస్ఐ ఉగ్రవాదులు అరెస్ట్
- Udhayanidhi Stalin: తంబీ..ఇంతలా దిగజారాలా? ఉదయనిధి నోటికి ఎంత వస్తే అంత మాట్లాడేస్తాడా..?
కాగా, బీజాపూర్ జిల్లాలోని పూజారి కాంకేరు, మారేడుబాక ఫారెస్ట్ ఏరియాలో నక్సల్స్ ఆపరేషన్లో పాల్గొన్న సమయంలో భద్రతా బలగాలు తాలిపేరు నది ఒడ్డున తుమ్రెల్లి అటవీ ప్రాంతంలో ఈ సొరంగాన్ని కనుగొన్నారు. ఈ చర్యతో మావోయిస్టులకు కోలుకోలేని షాక్ తగిలిందని చెప్పాలి. ఇదిలా ఉండగా.. ఇటీవల ఛత్తీస్గఢ్లో మావోయిస్టులే టార్గెట్గా భద్రతా బలగాలు దాడులు చేస్తున్నారు. ఒక్క జనవరి నెలలోనే దాదాపు 35 మంది వరకు నక్సలైట్లను భద్రతా బలగాలు చంపేశారు. అయితే, ఈశాన్య రాష్ట్రాలతో పాటు ఆఫ్ఘనిస్తాన్ , ఇరాక్ లాంటి దేశాల్లో తీవ్రవాదులు ఉండే ప్రదేశాల్లో ఇలాంటి బంకర్లు మనకి కనిపిస్తుంటాయి.
Read Also: Budget Session : జనవరి 31నుంచి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు.. ఎంతకాలం కొనసాగుతాయో తెలుసా ?
అలాగే, దంతేవాడ, బీజాపూర్, కాంకేర్, నారాయణపూర్, సుక్మ జిల్లాల్లో వేల మంది సీఆర్పీఎఫ్, డీఆర్జీ కోబ్రా బలగాలు అనువణువున గాలిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా నిన్న భారీ ఎన్ కౌంటర్లో 15 మందికి పైగా మావోయిస్టులు మృత్యువాత పడ్డారు. ఈ కూంబింగ్ కొనసాగుతున్న నేపథ్యంలో ఛత్తీస్ గడ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా ఊసూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని తుమ్రెల్లి దండకారణ్యంలోని తెలంగాణ జిల్లాల్లోని తాళి పేరు నది వెనుక సమీపంలో మావోల బంకర్ ను డీఆర్జీ సైన్యం గుర్తించింది.
తాజావార్తలు
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
Tejaswini Nandamuri : బాలయ్య కూతురిని డైరెక్ట్ చేయబోయే దర్శకురాలు ఎవరంటే?
-
Harish Rao: సమ్మక్క సాగర్ ప్రాజెక్టుపై కుట్ర జరుగుతోంది.. హరీశ్రావు సంచలన ఆరోపణలు
-
Karikala First Look: సందీప్ కిషన్ ‘కరికాల’ ఫస్ట్ లుక్ అదిరింది!.. ఇలాంటి అవతార్లో ఎప్పుడూ చూడలే..
-
Mohammad Amir-IPL 2027: పాక్ స్టార్ మహ్మద్ అమీర్కు లైన్ క్లియర్.. ఇక ఐపీఎల్ 2027లో ఆడతాడా?
ట్రెండింగ్
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!
-
VVS Laxman Chief Selector: అజిత్ అగార్కర్కు బిగ్ షాక్.. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్గా వీవీఎస్ లక్ష్మణ్?
-
Yamaha R15, MT-15 MotoGP ఎడిషన్ బైక్స్ మళ్లీ వచ్చేశాయి.. కొత్త కలర్ ఆప్షన్లతో FZ-S సిరీస్ కూడా అప్డేట్..!
-
కేవలం 50 మాత్రమే.. లగ్జరీతో పాటు ఫ్యాషన్ టచ్..! MG Cyberster, M9 Couture Edition కార్లు లాంచ్.!