Manmohan Singh: మన్మోహన్ సింగ్ పాలనలో ‘‘బెస్ట్ మూమెంట్’’, ‘‘అతిపెద్ద నిరాశ’’..
- భారత ఆర్థిక వ్యవస్థ రూపశిల్పి, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి..
- ఆయన పాలనలో ‘‘బెస్ట్ మూమెంట్’’, ‘‘అతిపెద్ద విచారం’’ ఇవే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Manmohan Singh: భారతదేశ ఆర్థిక వ్యవస్థ రూపశిల్పి, 1991లో దేశాన్ని ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కించిన ఆర్థికవేత్త, రెండు సార్లు ప్రధానిగా పనిచేసిన డాక్టర్ మన్మోహన్ సింగ్(92) గురువారం ఎయిమ్స్లో మరణించారు. దాదాపుగా దివాళా అంచున ఉన్న దేశాన్ని, ప్రస్తుతం 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మార్చిన ఘనత మన్మోహన్ సింగ్కి దక్కుతుంది. అప్పటి వరకు లైసెన్స్ రాజ్, బ్రూరోక్రసీ ఆధిపత్యంలో కొట్టుమిట్టాడుతున్న భారత ఆర్థిక వ్యవస్థకు స్వేచ్ఛా ఆర్థిక వ్యవస్థగా మార్చారు. గ్లోబలైజేషన్, లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్కి దారులు తెరిచారు. దీని వల్ల రెండేళ్లలోనే భారత్ దివాళా అంచు నుంచి మెరుగైన విదేశీ మారక నిల్వలు కలిగిన దేశంగా మారింది. పీవీ నరసింహరావు హయాంతో ఆయన ఆర్థిక మంత్రిగా పనిచేసి ధైర్యంగా నిర్ణయాలు తీసుకున్నారు.
అయితే, ఇలాంటి వ్యక్తి తన జీవితంలో అత్యుత్తమ క్షణం, అతిపెద్ద విచారం ఉన్నాయని చెప్పారు. జనవరి 3, 2014న ప్రధానమంత్రిగా తన చివరి ప్రెస్ కాన్ఫరెన్స్లో డాక్టర్ సింగ్ను ప్రధానమంత్రిగా ఈ రెండింటి గురించి చెప్పారు. ‘‘ సామాజిక, ఆర్థిక మార్పుల ప్రక్రియను అణిచివేసేందుకు ప్రయత్నించిన అణు వర్ణవివక్షను అంతం చేయడానికి అమెరికాతో అణు ఒప్పందాన్ని కుదుర్చుకోవడాన్ని తన కెరీర్లో ‘‘అత్యుత్తమ క్షణం’’. మనదేశం అనేక విధాలుగా సాంకేతిక అభివృద్ధి చెందుతోంది’’ అని ఆయన చెప్పారు.
Also Read
- CM Revanth Reddy: చరిత్రలో సువర్ణాక్షరాలతో నిలిచే రోజు ఇది.. జల వివాదాలకు శాశ్వత పరిష్కారం..!
- CM Vijay: ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన విజయ్.. ఫొటోలు వైరల్
- Ketan Agarwal Murder: యూట్యూబ్ సెర్చ్, కేఫ్లో మంతనాలు.. కేతన్, సియా కేసులో కీలక ఆధారాలు..
- DK Shivakumar: తుంగభద్ర వేదికగా నీటి ఐక్యత సందేశం ఇచ్చిన డీకే శివకుమార్
Read Also: Bhatti Vikramarka: మన్మోహన్ సింగ్ మృతి దేశానికే కాదు కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు..
అణుశక్తి, సాంకేతిక పరిజ్ఞానాన్ని శాంతియుతంగా ఉపయోగించడాన్ని ప్రోత్సహించే ఐక్యరాజ్యసమితి ఏజెన్సీ అయిన అంతర్జాతీయ అణుశక్తి సంస్థ (IAEA), ఆగస్టు 2008లో భారతదేశంతో భద్రతా ఒప్పందాన్ని ఆమోదించింది. దీని తర్వాత అమెరికా న్యూక్లియర్ సప్లయర్స్ గ్రూప్(ఎన్ఎస్జీ)ని సంప్రదించి, భారత్కి పౌర అవసరాల కోసం టెక్నాలజీని బదిలీ చేయడానికి మినహాయింపు ఇచ్చింది.NSG సెప్టెంబరు 6, 2008న భారతదేశానికి మినహాయింపును మంజూరు చేసింది.
మన్మోహన్ సింగ్ తన పాలనలో ‘‘అతిపెద్ద విచారం’’గా ఆరోగ్య సంరక్షణ రంగమని చెప్పారు. ఈ రంగంలో తాను అనుకున్నంతగా పనిచేయలేదని వెల్లడించారు. “నన్ను క్షమించండి. నేను ఈ విషయం గురించి ఆలోచించలేదు. కానీ ఖచ్చితంగా, నేను ఆరోగ్య సంరక్షణ, పిల్లలకు ఆరోగ్య సంరక్షణ, మహిళలకు ఆరోగ్య సంరక్షణలో చాలా ఎక్కువ చేయాలనుకుంటున్నాను. మేము ప్రారంభించిన జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ ఆకట్టుకునే ఫలితాలను సాధించింది, అయితే ఇంకా చాలా చేయాల్సి ఉంది’’ అని చెప్పారు.
తాజావార్తలు
-
INDA Vs SLA: మరోసారి ఫామ్ కొనసాగించిన సాయి సుదర్శన్.. 132 పరుగులతో వీరవిహారం..
-
CM Revanth Reddy : తుంగభద్రకు కొత్త ఊపిరి.. 33 గేట్లు ప్రారంభం.!
-
Shehbaz Sharif: ఇరాన్ అధ్యక్షుడి టూర్లో పాక్ ప్రధాని వింత ప్రవర్తన.. నెట్టింట తీవ్ర విమర్శలు
-
PoK: పీఓకే ప్రజల్ని ఆకలితో చంపేస్తున్న పాకిస్తాన్..
-
Bunny Vas : తెలుగుమ్మాయని అవకాశం ఇస్తే.. మాకు 15 రూల్స్ పెట్టింది.
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!