CM Revanth Reddy: చరిత్రలో సువర్ణాక్షరాలతో నిలిచే రోజు ఇది.. జల వివాదాలకు శాశ్వత పరిష్కారం..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Revanth Reddy: తుంగభద్ర డ్యామ్ 33 క్రస్ట్ గేట్ల ప్రారంభోత్సవ కార్యక్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమం చరిత్రలో నిలిచిపోయే ఘట్టమని పేర్కొన్న ఆయన, భారతదేశంలో ఉన్న కొద్దిమంది ప్రముఖ నాయకుల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒకరని ప్రశంసించారు. తుంగభద్ర డ్యామ్ గేట్ల పునరుద్ధరణ వల్ల అనంతపురం, కర్నూలు, పాలమూరు ప్రాంతాల్లోని లక్షలాది మంది రైతుల సమస్యలకు పరిష్కారం లభిస్తుందని రేవంత్ రెడ్డి అన్నారు. అనంతపురం, కర్నూలు జిల్లాల సమస్యలతో పాటు పాలమూరు వలసల గురించి తనకు పూర్తి అవగాహన ఉందని చెప్పారు. ఈ ప్రాంతాల రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని నీటి వనరుల నిర్వహణలో సమన్వయం అవసరమని పేర్కొన్నారు.
కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ సమక్షంలో మూడు రాష్ట్రాల నీటి సమస్యలను ప్రస్తావించామని తెలిపారు రేవంత్ రెడ్డి… కేంద్రంలో సీఆర్ పాటిల్ ఉండటం వల్ల ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదాలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. నీటి వాటాల విషయంలో అన్ని రాష్ట్రాల హక్కులను పరిరక్షిస్తూ కేంద్రం సానుకూల నిర్ణయాలు తీసుకుంటుందని విశ్వసిస్తున్నానని చెప్పారు. గద్వాల్, అలంపూర్, పాలమూరు ప్రాంతాలకు సంబంధించిన రాజోలిబండ డైవర్షన్ స్కీంకు 15.9 టీఎంసీల నీటి కేటాయింపు ఉన్నప్పటికీ, ప్రస్తుతం కేవలం ఐదు నుంచి ఆరు టీఎంసీల నీటినే రైతులు వినియోగించుకుంటున్నారని రేవంత్ రెడ్డి వెల్లడించారు. వాస్తవానికి రావాల్సిన నీరు కూడా పూర్తిస్థాయిలో అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
Also Read
- JP Nadda - CJP Leaders: నడ్డాతో సీజేపీ నాయకుల భేటీ.. సీజేపీ డిమాండ్స్ ఇవే!
- West Bengal: సెప్టెంబర్ 1 నుంచి బెంగాల్లో కొత్త రూల్.. మాతృ భాషకు పట్టం కట్టిన సీఎం సువేందు అధికారి!
- Abhijeet Dipke: ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత.. కాక్రోచ్ జనతా పార్టీ చీఫ్ అభిజీత్ దీప్కే అరెస్ట్..
- India First Dengue Vaccine: శుభవార్త.. భారత్లో తొలి డెంగ్యూ వ్యాక్సిన్కు ఆమోదం.. ఎవరికి? ఎన్ని డోసులు? పూర్తి వివరాలు
తుంగభద్రలో నీటి కూడిక, తరలింపు, పంపకాల విషయంలో ఉన్న సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాల్సిన అవసరం ఉందని అన్నారు రేవంత్.. ఈ అంశాలను కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. రాజకీయాలకు అతీతంగా తుంగభద్ర నది ఒడ్డున జరుగుతున్న ఈ చర్చలు భవిష్యత్తులో చారిత్రాత్మక నిర్ణయాలకు దారి తీస్తాయని పేర్కొన్నారు. ఇక, మైసూరు మహారాజు, నిజాం నవాబు దూరదృష్టితో నిర్మించిన తుంగభద్ర డ్యామ్ నేటికీ లక్షలాది మంది ప్రజలకు జీవనాధారంగా నిలుస్తోందని అన్నారు. మూడు రాష్ట్రాల ప్రజల సంక్షేమం కోసం నీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం కనుగొనే దిశగా ఈ సమావేశం కీలక మలుపు అవుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి..
తాజావార్తలు
-
Nagarjuna: “ఈ అరుపుల కోసమే అఖిల్ ఇన్నేళ్లు ఎదురుచూశాడు”.. ‘లెనిన్’ సక్సెస్ మీట్లో నాగార్జున ఎమోషనల్!
-
Housing Scheme: సొంతిళ్లు లేని వారికి శుభవార్త.. రేపటి నుంచే దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం..
-
Nag Chaitanya: ‘ఆ రోజు నుంచే అఖిల్ నా హీరో’.. తమ్ముడిపై నాగచైతన్య ఎమోషనల్ కామెంట్స్!
-
Public Charging: రైల్వే స్టేషన్లో ఫోన్ ఛార్జింగ్ పెడుతున్నారా? జర జాగ్రత్త.. మీ బ్యాంక్ ఖాతా ఖాళీ కావచ్చు!
-
Akhil Akkineni : మూడో రోజుకి బ్రేక్ ఈవెన్ అవ్వడం చాలా చాలా రోజుల తర్వాత జరిగింది
ట్రెండింగ్
-
SAIL Recruitment: పరీక్ష లేకుండానే 1,110 అప్రెంటిస్ పోస్టులు.. దరఖాస్తు ఎక్కడ చేసుకోవాలంటే.?
-
Ferrari Amalfi Spider: ఫెరారీ కొత్త కన్వర్టిబుల్ సూపర్కార్ లాంచ్.. ధర ఎంతంటే?
-
Rohit Sharma: మజా ఉండదు కదా.. రిటైర్మెంట్ వార్తలపై తొలిసారి స్పందించిన రోహిత్ శర్మ!
-
Mahindra New SUV: ఆగస్టు 15న మహీంద్రా నుంచి కొత్త SUV.. స్కార్పియో N ఫేస్లిఫ్ట్ ఎంట్రీ ఖాయమేనా?
-
Paneer Tikka Recipe: ప్రోటీన్ రిచ్ ఫుడ్.. టేస్టీ “పన్నీర్ టిక్కా”ను ఇంట్లో సులువుగా చేసేయండి ఇలా.!