CM Revanth Reddy: చరిత్రలో సువర్ణాక్షరాలతో నిలిచే రోజు ఇది.. జల వివాదాలకు శాశ్వత పరిష్కారం..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Revanth Reddy: తుంగభద్ర డ్యామ్ 33 క్రస్ట్ గేట్ల ప్రారంభోత్సవ కార్యక్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమం చరిత్రలో నిలిచిపోయే ఘట్టమని పేర్కొన్న ఆయన, భారతదేశంలో ఉన్న కొద్దిమంది ప్రముఖ నాయకుల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒకరని ప్రశంసించారు. తుంగభద్ర డ్యామ్ గేట్ల పునరుద్ధరణ వల్ల అనంతపురం, కర్నూలు, పాలమూరు ప్రాంతాల్లోని లక్షలాది మంది రైతుల సమస్యలకు పరిష్కారం లభిస్తుందని రేవంత్ రెడ్డి అన్నారు. అనంతపురం, కర్నూలు జిల్లాల సమస్యలతో పాటు పాలమూరు వలసల గురించి తనకు పూర్తి అవగాహన ఉందని చెప్పారు. ఈ ప్రాంతాల రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని నీటి వనరుల నిర్వహణలో సమన్వయం అవసరమని పేర్కొన్నారు.
కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ సమక్షంలో మూడు రాష్ట్రాల నీటి సమస్యలను ప్రస్తావించామని తెలిపారు రేవంత్ రెడ్డి… కేంద్రంలో సీఆర్ పాటిల్ ఉండటం వల్ల ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదాలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. నీటి వాటాల విషయంలో అన్ని రాష్ట్రాల హక్కులను పరిరక్షిస్తూ కేంద్రం సానుకూల నిర్ణయాలు తీసుకుంటుందని విశ్వసిస్తున్నానని చెప్పారు. గద్వాల్, అలంపూర్, పాలమూరు ప్రాంతాలకు సంబంధించిన రాజోలిబండ డైవర్షన్ స్కీంకు 15.9 టీఎంసీల నీటి కేటాయింపు ఉన్నప్పటికీ, ప్రస్తుతం కేవలం ఐదు నుంచి ఆరు టీఎంసీల నీటినే రైతులు వినియోగించుకుంటున్నారని రేవంత్ రెడ్డి వెల్లడించారు. వాస్తవానికి రావాల్సిన నీరు కూడా పూర్తిస్థాయిలో అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
Also Read
- Boy Living in Pond: చెరువే ఇల్లు.. నీటిలోకి దిగితేనే ఉపశమనం! ఐదేళ్లుగా ఇదే జీవితం.. 16 ఏళ్ల బాలుడి జీవితంలో మిస్టరీ ఏంటి?
- IRCTC Sri Lanka Ramayana Yatra 2026: రామాయణ పుణ్యక్షేత్రాలతో శ్రీలంక టూర్.. విమానం, హోటల్, భోజనం అన్నీ ప్యాకేజీలోనే!
- VB-G RAM G Scheme: వీబీ-జీ రామ్ జీ పథకం.. తొలి నెలలోనే 50% తగ్గిన గ్రామీణ ఉపాధి..!
- Maggi Noodles Case: మ్యాగీ లీడ్ వివాదానికి మరో ట్విస్ట్.. కేసులు కొట్టేసిన ఢిల్లీ హైకోర్టు
తుంగభద్రలో నీటి కూడిక, తరలింపు, పంపకాల విషయంలో ఉన్న సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాల్సిన అవసరం ఉందని అన్నారు రేవంత్.. ఈ అంశాలను కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. రాజకీయాలకు అతీతంగా తుంగభద్ర నది ఒడ్డున జరుగుతున్న ఈ చర్చలు భవిష్యత్తులో చారిత్రాత్మక నిర్ణయాలకు దారి తీస్తాయని పేర్కొన్నారు. ఇక, మైసూరు మహారాజు, నిజాం నవాబు దూరదృష్టితో నిర్మించిన తుంగభద్ర డ్యామ్ నేటికీ లక్షలాది మంది ప్రజలకు జీవనాధారంగా నిలుస్తోందని అన్నారు. మూడు రాష్ట్రాల ప్రజల సంక్షేమం కోసం నీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం కనుగొనే దిశగా ఈ సమావేశం కీలక మలుపు అవుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి..
తాజావార్తలు
-
AR Ameen: రెహమాన్ కొడుక్కి తృటిలో తప్పిన ముప్పు!
-
SIR: కొన్ని గంటల్లో ముగియనున్న SIR ఫారమ్ల సమర్పణ.. 60 శాతం నమోదు..
-
AAA Vizag : వైజాగ్ AAA స్క్రీన్ స్పెసిఫికేషన్స్ వేరే లెవెల్ అంతే!
-
Darshan Case: రీల్ హీరో రియల్ విలన్.. దర్శన్ కేసులో దిమ్మతిరిగే నిజాలు! అప్రూవర్ వాంగ్మూలంలో షాకింగ్ విషయాలు..
-
Chandrababu on Mega DSC: డీఎస్సీపై వైసీపీ ఆందోళనలకు చంద్రబాబు కౌంటర్.. కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!