Sharad Pawar: శరద్ పవార్ని చంపేస్తా.. బెదిరించింది బీజేపీ కార్యకర్త
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sharad Pawar: నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) అధినేత శరద్ పవార్ ను చంపేస్తామంటూ ఇటీవల సోషల్ మీడియాలో బెదిరింపులు వచ్చాయి. శుక్రవారం తన తండ్రి శరద్ పవార్ వాట్సాప్ లో బెదిరింపు సందేశాలు వచ్చినట్లు కుమార్తె సుప్రియా సూలే చెప్పారు. శరద్ పవార్ భద్రత బాధ్యత హోం శాఖపై ఉందని, అమిత్ షా జోక్యం చేసుకోవాలని ఆమె కోరారు. మహారాష్ట్ర హోంమంత్రి, కేంద్ర హోంమంత్రి ఈ విషయంలో కలుగజేసుకోవాలని ఆమె కోరారు. ఇలాంటి దిగజారుడు రాజకీయాలను ఆపేయాలంటూ విమర్శించారు.
అయితే ఈ బెదిరింపులకు పాల్పడిన వ్యక్తి బీజేపీ కార్యకర్త అని పోలీసులు అనుమానిస్తున్నారు. ఎన్సీపీ కీలక నేత, శరద్ పవార్ సోదరుడి కొడుకైన అజిత్ పవార్ కూడా.. ఈ బెదిరింపులకు పాల్పడింది బీజేపీ కార్యకర్త సౌరభ్ పింపాల్కర్ అని ఆరోపించారు. నరేంద్ర దభోల్కర్ కు పట్టిన గతే శరద్ పవార్ కు పడుతుందని పింపాల్కర్ సోషల్ మీడియాలో బెదిరించారని.. అతని సోషల్ మీడియా ఖాతా బయోడెటాలో సౌరభ్ పింపాల్కర్ తనను తాను బీజేపీ కార్యకర్తగా పేర్కొన్నాడని, వెంటనే పోలీసులు అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఇలాంటి బాధ్యతరహిత ప్రవర్తన తీవ్రంగా ఖండిస్తున్నట్లు అజిత్ పవార్ అన్నారు.
Also Read
- New Railway Station: మరో కొత్త రైల్వే స్టేషన్ అందుబాటులోకి.. జులై 17న ప్రారంభం..
- Gas Cylinder: గ్యాస్ వినియోగదారులకు భారీ శుభవార్త.. ఇక నిమిషాల్లోనే సిలిండర్ డెలివరీ..
- Dharmasthala Case: ధర్మస్థల కేసులో కీలక పరిణామం.. కోర్టుకు 7000 పేజీల నివేదిక..
- Ketan Agarwal: కేతన్ హత్య కేసులో బిగ్ ట్విస్ట్.. చేతులెత్తేసిన పోలీసులు!
Read Also: Lord Hanuman: “హనుమంతుడు ఆదివాసీ”.. కాంగ్రెస్ ఎమ్మెల్యే వ్యాఖ్యలు..
మూఢవిశ్వాసాలకు వ్యతిరేకంగా పోరాడిన నరేంద్ర దభోల్కర్ అనే వ్యక్తనిన ఆగస్టు 20, 2013లో పూణేలో మార్నింగ్ వాక్ చేస్తున్న సమయంలో ఇద్దరు దుండగులు కాల్చి చంపారు. ఈ బెదిరింపులపై శరద్ పవార్ శుక్రవారం స్పందించారు. బెదిరింపుల ద్వారా ఒకరి గొంతును నొక్కేయడం చేయొచ్చని అనుకుంటే పొరపాటని ఆయన అన్నారు. మహారాష్ట్ర పోలీసులపై తనకు పూర్తి విశ్వాసం ఉందని అన్నారు. దేశంలో ప్రతీ పౌరుడికి తన అభిప్రాయాలను వెల్లడించే స్వేచ్ఛ ఉందని ఆయన అన్నారు.
ఈ బెదిరింపులను షిండే-బీజేపీ ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. శరద్ పవార్ భద్రతకు సీఎం ఏక్ నాథ్ షిండే హామీ ఇచ్చారు. పూణేలోని శివాజీ నగర్ ప్రాంతంలోని శరద్ పవార్ ఇంటి వద్ద భద్రతను పెంచారు. కాగా ఈ విషయం రాజకీయపరంగా తీవ్ర చర్చనీయాంశంగా మారిన తర్వాత.. నిందితుడు పింపాల్కర్ పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. అతని ఫోన్ కూడా స్విచ్ఛాప్ లో ఉంది. అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు. అమరావతి లా యూనివర్సిటీ పేపర్ లీక్ కేసులో సౌరభ్ సహ నిందితుడిగా ఉన్నాడు.
తాజావార్తలు
-
Deputy CM Pawan Kalyan: సీఎం రేవంత్ రెడ్డికి పవన్ కల్యాణ్ లేఖ.. షాబాద్ ఘటన ప్రస్తావన..
-
Trump: వచ్చే వారం ఇంకా దారుణంగా ఉంటుంది.. ఇరాన్పై కొత్త ప్రయోగానికి ట్రంప్ ప్రణాళిక!
-
New Railway Station: మరో కొత్త రైల్వే స్టేషన్ అందుబాటులోకి.. జులై 17న ప్రారంభం..
-
Grand Comeback: హ్యాట్రిక్ ప్లాన్తో వస్తున్న హీరో.. గ్రాండ్ కంబ్యాక్కు మాస్టర్ స్ట్రాటజీ!
-
PoK Protest: పాక్ ఆక్రమిత కాశ్మీర్లో హింసాకాండ.. 12 మంది మృతి, రేంజర్ల మోహరింపు..
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!