NTV Telugu Site icon

Mumbai: ప్రేమ పెళ్లి చేసుకున్న జంట.. విడాకులు తీసుకున్న మహిళ.. యాసిడ్ పోసిన భర్త..!

Mumbai

Mumbai

Mumbai: ముంబైలో దారుణం చోటు చేసుకుంది. మాల్వాని ప్రాంతంలో నివాసం ఉంటున్న ఓ మహిళ ముఖంపై భర్త యాసిడ్ పోసి దాడి చేశాడు. ఈ ఘటనలో బాధితురాలిని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే.. 2019 లో ప్రేమ వివాహం చేసుకున్నారు ఓ జంట. పెళ్లైన తర్వాత భర్తకు ఉద్యోగం లేకపోవడంతో పాటు డ్రగ్స్‌కు బానిసగా మారి.. మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నట్లు భార్య గుర్తించింది.

Read Also: Gold Rate Today: పసిడి ప్రియులకు భారీ షాక్.. ఆల్‌టైమ్ గరిష్టాలను దాటేసిన గోల్డ్ రేట్లు!

ఈ విషయంపై గట్టిగా అతడ్ని ప్రశ్నించగా పలుమార్లు ఇరువురు మధ్య గొడవ జరిగింది. కానీ, సదరు భార్య భర్తతో నాలుగు నెలల క్రితం విడాకులు తీసుకుని తన తల్లితో కలిసి మలాడ్‌లో జీవనం కొనసాగిస్తుంది. అయితే, బుధవారం (సెప్టెంబర్ 25) ఉదయం ఆమె భర్త బలవంతంగా ఇంట్లో్కి వచ్చి.. ఆమెపై యాసిడ్ పోశాడు.. దీంతో తీవ్ర గాయాలు కావడంతో కూపర్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆమె ప్రస్తుతం తీవ్రమైన కాలిన గాయాలకు చికిత్స పొందుతుంది.

Read Also: MLA Pulivarthi Nani: వైఎస్‌ జగన్‌ తిరుమల పర్యటన.. ఎమ్మెల్యే పులివర్తి నాని హాట్‌ కామెంట్స్‌

ఈ సంఘటనపై బాధితురాలి తల్లి పోలీసులకు కంప్లైంట్ చేసింది. ఈ ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు నిందితుడిపై 124(2), 311, 333, 352 సహా భారతీయ నయ సంహితలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అలాగే, నిందితుడిని అరెస్ట్ చేసేందుకు గాలిస్తున్నారు.