Varanasi : ‘వారణాసి’ కోసం రాజమౌళి కొత్త ప్లాన్.. ఆ సీన్లు మాత్రమే ఐమాక్స్ ఫార్మాట్లో!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గ్లోబల్ స్థాయిలో తెరకెక్కుతున్న చిత్రం ‘వారణాసి’. మహేష్ బాబు ఈ సినిమాలో ‘రుద్ర’ అనే పవర్ఫుల్ పాత్రలో నటిస్తుండగా, విలన్ ‘కుంభ’గా పృథ్వీరాజ్ సుకుమారన్ కనిపించబోతున్నారు. ఇక హీరోయిన్ ప్రియాంక చోప్రా ‘మందానికి’ అనే పాత్రలో నటిస్తుండటం సినిమాపై అంచనాలను రెట్టింపు చేసింది. ప్రకాష్ రాజ్ కీలక పాత్రలో కనిపిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ప్రస్తుతం హైదరాబాద్ పరిసరాల్లో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం, త్వరలోనే అంటార్కిటికా వంటి అరుదైన ప్రదేశాల్లో చిత్రీకరణ జరుపుకోనుంది. అయితే తాజాగా కోసం దర్శకుడు రాజమౌళి ఒక వినూత్నమైన ఫార్ములాను సిద్ధం చేసినటు ఓ వార్త వైరల్ అవుతుంది.
సాధారణంగా భారీ చిత్రాలను ఐమాక్స్ ఫార్మాట్లో విడుదల చేయడం చూస్తుంటాం, కానీ ఈ సినిమా విషయంలో రాజమౌళి ఒక భిన్నమైన నిర్ణయం తీసుకున్నారు. భారత్లో ఐమాక్స్ స్క్రీన్స్ తక్కువగా ఉండటం, మెజారిటీ ప్రేక్షకులు సినిమా స్కోప్ ఫార్మాట్ థియేటర్లలోనే చూస్తుండటంతో.. మూవీ మొత్తం కాకుండా కేవలం కీలక సన్నివేశాలను మాత్రమే ‘ట్రూ ఐమాక్స్’ అనుభూతిని ఇచ్చేలా డిజైన్ చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. అంటే సినిమా మొత్తం వైడ్ స్క్రీన్లో సాగుతూ, కొన్ని హై-వోల్టేజ్ యాక్షన్ సీన్లు వచ్చినప్పుడు మాత్రం స్క్రీన్ సైజ్ పెరిగి ఐమాక్స్ ఫుల్ ఫ్రేమ్ అనుభవాన్ని అందిస్తుంది. హాలీవుడ్ దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ తన సినిమాలకు వాడే ఈ టెక్నిక్ను ఇప్పుడు రాజమౌళి మన దేశ పరిస్థితులకు అనుగుణంగా వాడుతుండటం విశేషం. ప్రజంట్ ఈ వార్త వైరల్ అవుతుంది.
Also Read
- Sajjala Ramakrishna Reddy: రాజధాని పేరుతో ప్రజలపై అప్పుల మోత.. సజ్జల సంచలన వ్యాఖ్యలు.!
- Pakistan: పాకిస్థాన్లో ఘోర ప్రమాదం.. లోయలో పడ్డ బస్సు.. 40 మంది మృతి
- CM Vijay vs DMK: సీఎం విజయ్-త్రిషపై అనుచిత వ్యాఖ్యలు.. మాజీ మంత్రి అరెస్ట్..
- Indian Govt: ఇక నుంచి ఆ యాప్స్ పని చేయవు.. ఈ రెండు యాప్స్పై బ్యాన్ విధించిన కేంద్రం..
తాజావార్తలు
-
Netflix: నెట్ఫ్లిక్స్ బంపర్ ఆఫర్: కొత్త కథా రచయితల కోసం క్రేజీ ఛాన్స్!
-
Sajjala Ramakrishna Reddy: రాజధాని పేరుతో ప్రజలపై అప్పుల మోత.. సజ్జల సంచలన వ్యాఖ్యలు.!
-
July Releases : జూలై బాక్స్ ఆఫీస్ రేసులో అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న ఆరుగురు హీరోలు
-
Pakistan: పాకిస్థాన్లో ఘోర ప్రమాదం.. లోయలో పడ్డ బస్సు.. 40 మంది మృతి
-
IND vs ENG 2nd T20: సంజును తొలగించకుండా, వైభవ్కు అవకాశం ఇవ్వాలంటే.. ఇదొక్కటే మార్గం!
ట్రెండింగ్
-
IND vs ENG 2nd T20: సంజు అవుట్, వైభవ్ ఇన్.. రెండో టీ20కి భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Vaibhav Sooryavanshi: దయచేసి వైభవ్ను ఆడించండి.. బీసీసీఐకి ఎవరన్నా చెప్పండ్రా బాబు.. దిగ్గజాల కామెంట్స్ వైరల్!
-
RCB అభిమానులకు నథింగ్ సర్ప్రైజ్.. జూలై 7న Nothing Phone (4b) RCB Edition విడుదల
-
Samsung Galaxy A27 5G vs OnePlus Nord 6: ఏ స్మార్ట్ఫోన్ బెస్ట్?
-
10100mAh బ్యాటరీతో రెడ్మీ నోట్ 17 ప్రో మాక్స్? Redmi Note 17 సిరీస్లో డిస్ప్లే, బ్యాటరీలో భారీ అప్గ్రేడ్లు.!