China: వివాదాస్పద ద్వీపంలో చైనా H-6 బాంబర్లు ల్యాండ్.. దేనికి సంకేతాలు!
- వివాదాస్పద ద్వీపంలో చైనా H-6 బాంబర్లు ల్యాండ్
- విశ్లేషకులు కీలక స్టేట్మెంట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వివాదాస్పద దక్షిణ చైనా సముద్ర ద్వీపంలో అత్యంత అధునాతన బాంబర్లు ప్రత్యక్షమయ్యాయి. 2020 తర్వాత పారాసెల్స్లోని వుడీ ద్వీపంలో హెచ్-6 బాంబర్లు ల్యాండ్ కావడం ఇదే మొదటిసారి. మాక్సర్ చిత్రంలో వై-20 రవాణా విమానాలు, కేజే-500 ముందస్తు హెచ్చరిక విమానాలు కనిపించాయి. ఉపగ్రహ చిత్రాలు బయటకు రావడంతో విశ్లేషకులు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రత్యర్థులకు సైనిక సామర్థ్యాలను చూపించేందుకే చైనా దుశ్చర్యకు పాల్పడినట్లుగా అభిప్రాయపడుతున్నారు.
ఇది కూడా చదవండి: Siddaramaiah: కమల్హాసన్కు ఆ విషయం తెలియదు.. ముఖ్యమంత్రి అసహనం
Also Read
- Pakistan: పిల్లలపై అత్యాచారం, ట్రాఫికింగ్ నిందితుడు.. PoK ఎన్నికల్లో గెలుపు..
- Forbes Best Under a Billion 2026: చైనాకు ఒక్క అడుగు దూరంలో భారత్.. ఫోర్బ్స్ జాబితాలో టాప్-200లో 27 సంస్థలు
- Modi-Netanyahu: మోడీకి నెతన్యాహు ఫోన్.. ఉద్రిక్తతల వేళ కీలక సంభాషణ
- UK: ఆర్మీ కాలేజీలో మహిళలపై అత్యాచారాలు.. యూకేను కుదిపేస్తున్న ఘటన..
ఫిలిప్పీన్స్, తైవాన్తో చైనాకు ఉద్రిక్తతలు నెలకొన్నాయి. మత్స్య సంపదల విషయంలో ఫిలిప్పీన్స్తో ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. సార్వభౌమాధికారం మరియు ఆర్థిక హక్కులపై రెండు దేశాల మధ్య వివాదాలు నడుస్తున్నాయి. ఆర్థిక కార్యకలాపాలు, మత్స్య పెంపకంపై చైనా జోక్యం చేసుకుంటున్నట్లు ఫిలిప్పీన్స్ ఆరోపిస్తోంది. దక్షిణ చైనా సముద్ర ద్వీపంలో ఫిలిప్పీన్కు చెందిన నౌకలను చైనా అడ్డుకుంటోంది. ఈ వ్యవహారంపై ఫిలిప్పీన్స్ రగిలిపోతుంది. ఇంకోవైపు అమెరికా-ఫిలిప్పీన్స్ మధ్య కీలక ఒప్పందాలు ఉన్నాయి. అయితే ఫిలిప్పీన్స్ నౌకలను చైనా అడ్డుకోవడంతో యూఎస్ జోక్యం చేసుకుంది. ఈ వ్యవహారం చైనాకు రుచించలేదు. ఈ నేపథ్యంలోనే ప్రత్యర్థులను బెదిరించేందుకే చైనా హెచ్-6 బాంబర్లను వుడీ ద్వీపంలో ల్యాండ్ చేసిందని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఇది కూడా చదవండి: CM Chandrababu: టీడీపీలో కోవర్టులు.. చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు..
ఫిలిప్పీన్స్కు అమెరికా మద్దతుగా ఉండడంతోనే పారాసెల్స్లో చైనా బాంబర్లను మోహరింపజేసిందని సింగపూర్లోని ఎస్ రాజరత్నం స్కూల్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్టడీస్లో రక్షణ పండితుడు కాలిన్ కో అన్నారు. వాస్తవానికి పారాసెల్స్లో బాంబర్లు ఉండాల్సిన అవసరం లేదని అభిప్రాయపడ్డారు.
తాజావార్తలు
-
Story Board: తమిళనాడులో ప్రతీకారమే రాజకీయమా..? కరుణ, జయ దగ్గర నుంచి విజయ్ దాకా అదే తీరా..?
-
Krishna River Management Board: శ్రీశైలం, సాగర్ నీటిపై ఏపీ కీలక ప్రతిపాదన.. కేఆర్ఎంబీకి లేఖ
-
PM Modi: ప్రధాని మోడీ మరో ఇన్స్టాగ్రామ్ వీడియో.. ఈసారి ఏమన్నారంటే..
-
Off The Record: ఆసిఫాబాద్ కాంగ్రెస్లో అసంతృప్తి అగ్గి.. డీసీసీ అధ్యక్షురాలిపై తిరుగుబాటు?
-
Tour Of South Africa: సౌతాఫ్రికా షెడ్యూల్లో కీలక మార్పులు.. టీ20లు కూడా అక్కడే..
ట్రెండింగ్
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!