China: వివాదాస్పద ద్వీపంలో చైనా H-6 బాంబర్లు ల్యాండ్.. దేనికి సంకేతాలు!
- వివాదాస్పద ద్వీపంలో చైనా H-6 బాంబర్లు ల్యాండ్
- విశ్లేషకులు కీలక స్టేట్మెంట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వివాదాస్పద దక్షిణ చైనా సముద్ర ద్వీపంలో అత్యంత అధునాతన బాంబర్లు ప్రత్యక్షమయ్యాయి. 2020 తర్వాత పారాసెల్స్లోని వుడీ ద్వీపంలో హెచ్-6 బాంబర్లు ల్యాండ్ కావడం ఇదే మొదటిసారి. మాక్సర్ చిత్రంలో వై-20 రవాణా విమానాలు, కేజే-500 ముందస్తు హెచ్చరిక విమానాలు కనిపించాయి. ఉపగ్రహ చిత్రాలు బయటకు రావడంతో విశ్లేషకులు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రత్యర్థులకు సైనిక సామర్థ్యాలను చూపించేందుకే చైనా దుశ్చర్యకు పాల్పడినట్లుగా అభిప్రాయపడుతున్నారు.
ఇది కూడా చదవండి: Siddaramaiah: కమల్హాసన్కు ఆ విషయం తెలియదు.. ముఖ్యమంత్రి అసహనం
Also Read
- US: పర్యాటకుడిపై అడవి దున్న దాడి.. 8 అడుగుల ఎత్తుకు ఎగిరిపడిన వృద్ధుడు.. వీడియో వైరల్
- Trump: ఇకపై హార్ముజ్ను అమెరికానే సంరక్షిస్తుంది.. ట్రంప్ సంచలన ప్రకటన
- Yemen Airport Attack: యెమెన్లో ల్యాండ్ అవుతుండగా క్షిపణుల వర్షం.. ఇరాన్ ప్రయాణికుల ప్రాణాలు గాల్లో!
- UK-Iran: ఐఆర్జీసీపై బ్రిటన్ సంచలన నిర్ణయం.. ఉగ్ర సంస్థగా ప్రకటన
ఫిలిప్పీన్స్, తైవాన్తో చైనాకు ఉద్రిక్తతలు నెలకొన్నాయి. మత్స్య సంపదల విషయంలో ఫిలిప్పీన్స్తో ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. సార్వభౌమాధికారం మరియు ఆర్థిక హక్కులపై రెండు దేశాల మధ్య వివాదాలు నడుస్తున్నాయి. ఆర్థిక కార్యకలాపాలు, మత్స్య పెంపకంపై చైనా జోక్యం చేసుకుంటున్నట్లు ఫిలిప్పీన్స్ ఆరోపిస్తోంది. దక్షిణ చైనా సముద్ర ద్వీపంలో ఫిలిప్పీన్కు చెందిన నౌకలను చైనా అడ్డుకుంటోంది. ఈ వ్యవహారంపై ఫిలిప్పీన్స్ రగిలిపోతుంది. ఇంకోవైపు అమెరికా-ఫిలిప్పీన్స్ మధ్య కీలక ఒప్పందాలు ఉన్నాయి. అయితే ఫిలిప్పీన్స్ నౌకలను చైనా అడ్డుకోవడంతో యూఎస్ జోక్యం చేసుకుంది. ఈ వ్యవహారం చైనాకు రుచించలేదు. ఈ నేపథ్యంలోనే ప్రత్యర్థులను బెదిరించేందుకే చైనా హెచ్-6 బాంబర్లను వుడీ ద్వీపంలో ల్యాండ్ చేసిందని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఇది కూడా చదవండి: CM Chandrababu: టీడీపీలో కోవర్టులు.. చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు..
ఫిలిప్పీన్స్కు అమెరికా మద్దతుగా ఉండడంతోనే పారాసెల్స్లో చైనా బాంబర్లను మోహరింపజేసిందని సింగపూర్లోని ఎస్ రాజరత్నం స్కూల్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్టడీస్లో రక్షణ పండితుడు కాలిన్ కో అన్నారు. వాస్తవానికి పారాసెల్స్లో బాంబర్లు ఉండాల్సిన అవసరం లేదని అభిప్రాయపడ్డారు.
తాజావార్తలు
-
Fake Shopping Offers : రూ.999 ఆఫర్.. ఖాతా ఖాళీ.! సైబర్ మోసగాళ్ల కొత్త ట్రిక్
-
OTR: కలెక్టర్ vs పోలీస్?.. పెద్దపల్లిలో హాట్ టాపిక్గా మారిన రివ్యూ మీటింగ్
-
OTR: ఎమ్మెల్యే మాధవి వైఖరి మిగతా ఎమ్మెల్యేలకు ఇబ్బందిగా మారిందా?
-
Train: మరీ చీఫ్గా దుప్పట్లు చోరీ.. కోచ్ అటెండెంట్లు గగ్గోలు.. ఎందుకంటే..!
-
ITR Filing: కొత్త ట్యాక్స్ విధానమే బెస్ట్? పాత విధానం ఎవరికి లాభం.. నిపుణులు ఏం చెబుతున్నారంటే?
ట్రెండింగ్
-
IPL 2027-CSK: సీఎస్కేకు క్రికెట్ దిగ్గజం గుడ్బై.. 18 ఏళ్ల బంధానికి ముగింపు!
-
IND vs ENG 1st ODI: ముగ్గురు మొనగాళ్లు వచ్చేశారు.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. ఇక రచ్చరచ్చే!
-
APTRANSCO Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. APTRANSCOలో 200 AEE ఉద్యోగాలు.. రూ.2.08 లక్షల వరకు జీతం.!
-
5G, 4G మోడళ్లతో ఎంట్రీ ఇవ్వనున్న Lava Virat V1 సిరీస్.. ఫీచర్స్ ఇవే.!
-
BSNL ధమాకా.. రూ. 259కే 700GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.. ఉచిత OTT కూడా.!