China: వివాదాస్పద ద్వీపంలో చైనా H-6 బాంబర్లు ల్యాండ్.. దేనికి సంకేతాలు!
- వివాదాస్పద ద్వీపంలో చైనా H-6 బాంబర్లు ల్యాండ్
- విశ్లేషకులు కీలక స్టేట్మెంట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వివాదాస్పద దక్షిణ చైనా సముద్ర ద్వీపంలో అత్యంత అధునాతన బాంబర్లు ప్రత్యక్షమయ్యాయి. 2020 తర్వాత పారాసెల్స్లోని వుడీ ద్వీపంలో హెచ్-6 బాంబర్లు ల్యాండ్ కావడం ఇదే మొదటిసారి. మాక్సర్ చిత్రంలో వై-20 రవాణా విమానాలు, కేజే-500 ముందస్తు హెచ్చరిక విమానాలు కనిపించాయి. ఉపగ్రహ చిత్రాలు బయటకు రావడంతో విశ్లేషకులు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రత్యర్థులకు సైనిక సామర్థ్యాలను చూపించేందుకే చైనా దుశ్చర్యకు పాల్పడినట్లుగా అభిప్రాయపడుతున్నారు.
ఇది కూడా చదవండి: Siddaramaiah: కమల్హాసన్కు ఆ విషయం తెలియదు.. ముఖ్యమంత్రి అసహనం
Also Read
- Denmark: డెన్మార్క్లో అజాన్పై బ్యాన్.. ఇస్లామీకీకరణపై ఆందోళన..
- Middle East Tensions: మిడిల్ ఈస్ట్లో మరో భీకర యుద్ధానికి స్క్రిప్ట్.. ఇజ్రాయెల్ లక్ష్యంగా ఇరాన్ ‘షాడో వార్’!
- Giorgia Meloni: మెలోని ఢిల్లీలో పోటీ చేస్తే లక్షల ఓట్లు గ్యారెంటీ..
- India-Bangladesh: బంగ్లాదేశ్ పౌరులకు గుడ్న్యూస్.. టూరిస్ట్ వీసాల జారీకి భారత్ గ్రీన్ సిగ్నల్
ఫిలిప్పీన్స్, తైవాన్తో చైనాకు ఉద్రిక్తతలు నెలకొన్నాయి. మత్స్య సంపదల విషయంలో ఫిలిప్పీన్స్తో ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. సార్వభౌమాధికారం మరియు ఆర్థిక హక్కులపై రెండు దేశాల మధ్య వివాదాలు నడుస్తున్నాయి. ఆర్థిక కార్యకలాపాలు, మత్స్య పెంపకంపై చైనా జోక్యం చేసుకుంటున్నట్లు ఫిలిప్పీన్స్ ఆరోపిస్తోంది. దక్షిణ చైనా సముద్ర ద్వీపంలో ఫిలిప్పీన్కు చెందిన నౌకలను చైనా అడ్డుకుంటోంది. ఈ వ్యవహారంపై ఫిలిప్పీన్స్ రగిలిపోతుంది. ఇంకోవైపు అమెరికా-ఫిలిప్పీన్స్ మధ్య కీలక ఒప్పందాలు ఉన్నాయి. అయితే ఫిలిప్పీన్స్ నౌకలను చైనా అడ్డుకోవడంతో యూఎస్ జోక్యం చేసుకుంది. ఈ వ్యవహారం చైనాకు రుచించలేదు. ఈ నేపథ్యంలోనే ప్రత్యర్థులను బెదిరించేందుకే చైనా హెచ్-6 బాంబర్లను వుడీ ద్వీపంలో ల్యాండ్ చేసిందని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఇది కూడా చదవండి: CM Chandrababu: టీడీపీలో కోవర్టులు.. చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు..
ఫిలిప్పీన్స్కు అమెరికా మద్దతుగా ఉండడంతోనే పారాసెల్స్లో చైనా బాంబర్లను మోహరింపజేసిందని సింగపూర్లోని ఎస్ రాజరత్నం స్కూల్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్టడీస్లో రక్షణ పండితుడు కాలిన్ కో అన్నారు. వాస్తవానికి పారాసెల్స్లో బాంబర్లు ఉండాల్సిన అవసరం లేదని అభిప్రాయపడ్డారు.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: వైభవ్ క్రేజ్ మాములుగా లేదుగా.. క్షణాల్లో అమ్ముడుపోయిన టికెట్లు..
-
SIP Investment: నెలకు రూ.20 వేల పెట్టుబడితో.. రూ.1 కోటి సంపాదించండి.. ఎలా అంటే..
-
Bullet Trains: హైదరాబాదీలకు గుడ్న్యూస్.. బుల్లెట్ ట్రైన్ కారిడార్లు ప్రకటించిన కేంద్రం
-
New T20 captain Shreyas Iyer: ‘సింహాల్లా ఆడదాం’.. కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్ తొలి సందేశం..
-
Denmark: డెన్మార్క్లో అజాన్పై బ్యాన్.. ఇస్లామీకీకరణపై ఆందోళన..
ట్రెండింగ్
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!