Maharashtra: దారుణం.. భార్యను చంపి భర్త ఆత్మహత్య.. సూసైడ్ నోట్లో ఏం రాశాడంటే..!
- మహారాష్ట్రలో దారుణం
- భార్యను చంపి భర్త ఆత్మహత్య
- విముక్తి అంటూ సూసైడ్ నోట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహారాష్ట్రలో దారుణంగా జరిగింది. ఒక రిటైర్డ్ స్కూల్ ప్రిన్సిపాల్ మురళీధర్ రామచంద్ర జోషి(80) తీవ్ర నిర్ణయం తీసుకున్నాడు. అనారోగ్యంతో బాధపడుతున్న భార్య లత (76)ను చంపి.. అనంతరం జోషి ఆత్మహత్య చేసుకున్నాడు. తన భార్యకు ఉపశమనం లభించిందంటూ ఒక సూసైడ్ నోట్ను రాసి పెట్టాడు. ఈ విషాద సంఘటన గురువారం జరిగిందని పోలీసులు తెలిపారు.
మహారాష్ట్రలోని నాసిక్లో జోషి(80), భార్య లత (76) నివాసం ఉంటున్నారు. వీరికి ఇద్దరు కుమారులు. ముంబైలో స్థిరపడ్డారు. ఇక వృద్ధులను చూసుకోవడానికి కేర్ టేకర్ సీమా రాథోడ్ ఉంది. అయితే బుధవారం ఉదయం, మధ్యాహ్నం పని ముగించుకుని సీమా రాథోడ్ వెళ్లిపోయింది. తిరిగి సాయంత్రం 7 గంటలకు వచ్చింది. వచ్చి చూసేటప్పటికీ ఇద్దరు చనిపోవడం చూసి షాక్ అయింది. సమాచారాన్ని పోలీసులకు తెలియజేసింది.
Also Read
- Honour killing: హిందూ యువకుడితో ప్రేమ.. కుమార్తెను ముక్కలుగా నరికి చంపిన తండ్రి..
- Snowfall: దేశమంతా ఎండలు భగభగలు.. లడఖ్లో మాత్రం భారీ హిమపాతం.. వీడియోలు వైరల్
- Pulwama Attack: అజ్ఞాత వ్యక్తుల సంచలనం.. పాక్లో పుల్వామా సూత్రధారి హతం..
- Cockroach Janata Party: కాక్రోచ్ జనతా పార్టీకి బిగ్ షాక్.. "ఎక్స్" అకౌంట్ నిలిపివేత..
ఇది కూడా చదవండి: Nagar Kurnool: నేటి నుంచి సలేశ్వరం జాతర ప్రారంభం..
మృతదేహాలను పరిశీలించిన పోలీస్ అధికారులు సూసైడ్ నోట్ను స్వాధీనం చేసుకున్నారు. దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతున్న భార్యకు విముక్తి కలిగించి.. తాను కూడా విముక్తి పొందుతున్నట్లు లేఖలో జోషి పేర్కొన్నాడు. ‘‘నా భార్య లతను నేను చాలా ప్రేమిస్తున్నాను. ఆమె అనారోగ్యంతో విసిగిపోయి మంచం పట్టింది. నేను ఆమెను అనారోగ్యం నుంచి విడిపించాలనుకుంటున్నాను. నన్ను కూడా విడిపించుకుంటున్నాను.’’ అని నోట్లో ఉంది. అంతేకాకుండా గత నాలుగేళ్లుగా కేర్ టేకర్ రాథోడ్ ఎంతో సహాయం చేసిందని.. ఆమె సేవను ప్రశంసిస్తూ రూ.50 వేలు అందజేయాలని రాసి పెట్టి ఉంది. అలాగే భార్య లతకు అంత్యక్రియలు నిర్వహించేటప్పుడు కొత్త చీర, మంగళసూత్రం, ఇతర ఆభరణాలతో అలంకరించాలని నోట్లో జోషి పేర్కొన్నారు. అంతేకాకుండా అంత్యక్రియలకు అవసరమైన డబ్బును కూడా ఉంచినట్లు తెలిపాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు అప్నగర్ పోలీస్ స్టేషన్ అధికారి ఒకరు తెలిపారు.
ఇది కూడా చదవండి: Vontimitta Kalyanam 2025: ఒంటిమిట్టలో సీతారాముల కల్యాణోత్సవం.. కడప మీదుగా వెళ్లే వాహనాలు దారి మళ్లింపు!
తాజావార్తలు
-
RBI: రూపాయికి కొంత ఉపశమనం.. ఆర్బీఐ చర్యలతో భారీ ఊరట..
-
Honour killing: హిందూ యువకుడితో ప్రేమ.. కుమార్తెను ముక్కలుగా నరికి చంపిన తండ్రి..
-
Snowfall: దేశమంతా ఎండలు భగభగలు.. లడఖ్లో మాత్రం భారీ హిమపాతం.. వీడియోలు వైరల్
-
SIR Phase-3 : దేశవ్యాప్తంగా ‘SIR ఫేజ్-3’ షెడ్యూల్ విడుదల, అక్టోబర్ 1న తుది జాబితా..!
-
AP: ఏపీ ఫిల్మ్, టెలివిజన్ అండ్ థియేటర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నూతన కమిటీ నియామకం..
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!