Rajasthan: చితిపై తగలబడుతుండగా స్పృహ.. ఒక్కసారిగా లేచిన యువకుడు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..!
- రాజస్థాన్లో ఘోర అమానుష ఘటన
- చితిపై తగలబడుతుండగా స్పృహ
- ఒక్కసారిగా లేచిన యువకుడు
- ముగ్గురు వైద్యులను సస్పెండ్ చేసిన కలెక్టర్
రాజస్థాన్లో ఘోర అమానుష ఘటన చోటుచేసుకుంది. వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ఓ నిండు ప్రాణం బలైపోయేది. పోలీసుల అప్రమత్తతతో యువకుడి ప్రాణాలు నిలబడ్డాయి. ఈ ఘటన జుంజును జిల్లాలో చోటుచేసుకుంది.
ఇది కూడా చదవండి: BJP: మహారాష్ట్ర ఎన్నికల్లో ‘‘ఓటుకు నోటు’’.. కాంగ్రెస్ నేతలకు లీగల్ నోటీసులు..
Also Read
- India Defense Budget: సాహో భారత్.. పాకిస్థాన్ను గజగజలాడిస్తున్న ఇండియా రక్షణ బడ్జెట్.. చైనా సాయం ఉన్నా దాయాదికి వణుకు పుట్టాల్సిందే!
- SAD: బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ తిని.. ఒకే కటుంబానికి చెందిన 4 గురు మృతి..
- Producing States in India: భారత్లో 'పెట్రోల్' బావులు ఏయే రాష్ట్రాల్లో ఉన్నాయో తెలుసా?
- Amrit Bharat Express: రైల్వే ప్రయాణికులు శుభవార్త.. పట్టాలపైకి మరో రెండు అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు..
రాజస్థాన్లోని జుంజును జిల్లాలో 25 ఏళ్ల చెవిటి, మూగ యువకుడు రోహితాష్ కుమార్ అనాథగా ఉంటున్నాడు. కుటుంబం లేకపోవడంతో ఒక షెల్టర్ హోమ్లో నివాసం ఉంటున్నాడు. అతడి ఆరోగ్యం బాగోలేకపోతే స్థానిక జిల్లా ఆస్పత్రికి తరలించారు. అక్కడ అతడి పరిస్థితి విషమించడంతో ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో చేర్చి చికిత్స అందించారు. అయితే గురువారం మధ్యాహ్నం 2 గంటలకు రోహితాష్ కుమార్ చనిపోయినట్లుగా వైద్యులు నిర్థారించారు. దీంతో షెల్టర్ హోం నిర్వాహకులు అంత్యక్రియలకు ఏర్పాటు చేసి.. చితిపై రోహితాష్ కుమార్ మృతదేహాంగా పెడుతున్న సమయంలో అతడు శ్వాస తీసుకోవడాన్ని గమనించారు. దీంతో వెంటనే అంబులెన్స్ లో రోహితాష్ ను ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స చేయిస్తున్నారు. అయితే.. ప్రస్తుతం యువకుడి ఆరోగ్యం నిలకడగా ఉందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై రెవెన్యూ అధికారి మహేంద్ర ముండ్, సామాజిక న్యాయ శాఖ డిప్యూటీ డైరెక్టర్ పవన్ పూనియా కూడా ఆస్పత్రికి చేరుకుని వివరాలు సేకరించారు.
ఇది కూడా చదవండి: AP Assembly: పీఏసీ కొత్త చైర్మన్గా పులపర్తి రామాంజనేయులు.. సభ్యులు ఎవరెవరంటే..?
అయితే ఈ ఘటనపై జుంజును జిల్లా కలెక్టర్ రమనతార్ మీనా ఆగ్రహం వ్యక్తం చేశారు. వైద్యుల తీరును తీవ్రంగా ఖండించారు. చనిపోయినట్లు నిర్ధారించిన డాక్టర్ యోగేష్ జాఖర్, డాక్టర్ నవనీత్ మీల్, డాక్టర్ సందీప్ పచార్లను గురువారం రాత్రి సస్పెండ్ చేశారు. అలాగే ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు. ఒక కమిటీని కూడా ఏర్పాటు చేశారు. మరోవైపు ఈ ఘటనపై వైద్య శాఖ కార్యదర్శికి సమాచారం అందించినట్లు కలెక్టర్ మీనా తెలిపారు.
ఇది కూడా చదవండి: TPCC Mahesh Goud : మోడీ వల్లే అదానీ దురాగతాలు పెరిగిపోతున్నాయి
తాజావార్తలు
-
Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
-
Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్లో వలస నేతల డామినేషన్
-
Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
-
RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
-
India Defense Budget: సాహో భారత్.. పాకిస్థాన్ను గజగజలాడిస్తున్న ఇండియా రక్షణ బడ్జెట్.. చైనా సాయం ఉన్నా దాయాదికి వణుకు పుట్టాల్సిందే!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!