Mamata Banerjee: శ్రీరామ నవమి రోజు బీజేపీ అల్లర్లకు కుట్ర చేస్తోంది..
Mamata Banerjee: తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బీజేపీ టార్గెట్గా తీవ్ర ఆరోపణలు చేశారు. రామ నవమి రోజు బీజేపీ అల్లర్లు చేయాలని చూస్తోందని, ప్రజలను రెచ్చగొట్టాలని భావిస్తోందని బుధవారం ఆరోపించారు. గతేడాది రామనవమి వేడుకలు హింసాత్మకంగా మారాయి, దీంతో బీజేపీ, టీఎంసీల మధ్య భారీ ఘర్షణకు దారి తీసింది. ‘‘ వారు(బీజేపీ) ఈ రోజు అల్లర్లలో పాల్గొంటారు. అల్లర్ల జరిగే అవకాశం ఉంది. ఎన్నికల్లో అల్లర్ల ద్వారా ఓట్లను కొట్టగొట్టాలని చూస్తున్నారు’’ అని ఇటీవల ఎన్నికల ర్యాలీలో ఆమె ఆరోపించారు.
బుధవారం తెల్లవారుజామున, మమతా బెనర్జీ రాష్ట్ర ప్రజలకు అభివాదం చేస్తూ.. వేడుకల సందర్భంగా శాంతిని పరిరక్షించండని సోషల్ మీడియాలో కోరారు. అయితే, ఆమె భారతీయ సంస్కృతిని, సనాతన సంస్కృతిని కించపరుస్తున్నారని బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘‘పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, మమతా బెనర్జీ శాంతిని కాపాడాలని విజ్ఞప్తి చేస్తూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేసారు, ఇది రామనవమి పండుగను కించపరచడం, ఇతర మతపరమైన సందర్భాలలో మీరు (మమతా బెనర్జీ) శాంతి సందేశం ఇచ్చారు, కానీ ఇక్కడ మీరు మాత్రం ‘ శాంతిని కాపాడండి’ అని అడుగుతున్నారు. మంచి సందేశాన్ని ఇవ్వడానికి బదులుగా, మీరు ఇలా చేయడం ద్వారా భారతీయ మరియు సనాతన సంస్కృతిని కించపరచడానికి ప్రయత్నిస్తున్నారు’’ అని రాజ్యసభ ఎంపీ, బీజేపీ అధికార ప్రతినిధి సుధాన్షు త్రివేది అన్నారు.
Also Read
- Suvendu adhikari: 180 గెలుస్తున్నాం.. మమతా బెనర్జీ ఇక రెస్ట్ తీసుకో..
- Bengal exit polls: బీజేపీ వైపు నాలుగు, టీఎంసీ వైపు రెండు.. ఎగ్జిట్ పోల్స్తో ఉత్కంఠ..
- TM Exit Poll: తమిళనాడు సీఎంగా విజయ్.. సంచలనం స్పష్టిస్తున్న సర్వే..
- Measles Outbreak : బంగ్లాదేశ్ లో విజృంభిస్తున్న మీజిల్స్ మహమ్మారి..భారత్ కి ముప్పు తప్పదా ?
Read Also: Teacher: 90స్ టీమ్ నుంచి మరో నవ్వుల జల్లు.. కలర్స్ స్వాతి టైటిల్ రోల్లో ‘టీచర్’
ఇదిలా ఉంటే బెంగాల్ వ్యాప్తంగా టీఎంసీ, బీజేపీలు రామనవమి ఉరేగింపులతు నిర్వహించాయి. కోల్కతాలోని న్యూటౌన్ ప్రాంతంలో జరిగిన రామ నవమి ఊరేగింపులో బీజేపీ నేత, ప్రతిపక్ష నాయకుడు సువేందు అధికారి పాల్గొన్నారు. చిన్నా పెద్దా తేడా లేకుండా జైశ్రీరాం నినాదాలు చేస్తూ వేడుకల్లో పాల్గొన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు, భద్రతా బలగాలు నిఘా ఏర్పాట్లు చేశాయి.
అంతకుముందు మంగళవారం బెంగాల్లో పర్యటించిన ప్రధాని నరేంద్రమోడీ అక్కడి ఎన్నికల ర్యాలీలో మాట్లాడుతూ.. బెంగాల్లో రామ నవమి ఉత్సవాలను నిలిపేందేందుకు తృణమూల్ కుట్ర పన్నిందని ఆరోపించారు. గతేడాది లాగే టీఎంసీ రామనవమి ఉత్సవాలను వ్యతిరేకిస్తోందని, కుట్రలు చేస్తుందని ఆయన అన్నారు.
తాజావార్తలు
-
Suvendu adhikari: 180 గెలుస్తున్నాం.. మమతా బెనర్జీ ఇక రెస్ట్ తీసుకో..
-
Weight Loss Mistakes: బాబోయ్ బరువు తగ్గడానికి ఈ పని మాత్రం చస్తే చేయకండి..!
-
MI vs SRH: సెంచరీతో రఫ్ఫాడించిన ‘ర్యాన్ రికెల్టన్’.. SRH ముందు భారీ టార్గెట్.!
-
TRS: టీఆర్ఎస్ పార్టీలోకి 50 మంది చేరిక.. ఎక్కడంటే..
-
Hyderabad Metro : తెలంగాణ ప్రభుత్వం ఆధీనంలోకి హైదరాబాద్ మెట్రో
ట్రెండింగ్
-
Raw Mango Tomato Roti Pachadi: వేడివేడి అన్నానికి సూపర్ కాంబో “మామిడికాయ టమాటా రోటి పచ్చడి”.!
-
Open AI Financial Crisis : ఆర్థిక సంక్షోభంలో చాట్ జీపీటీ.?
-
Viral Wedding: పెళ్లి పీటలపై ఊహించని ట్విస్ట్.. వధువు ముందు వింత షరతు పెట్టిన పెళ్లి కొడుకు.. షాక్లో బంధువులు!
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?