Mamata Banerjee: మమత రాజీనామా చేయకపోతే ఏం జరుగుతుంది? నెక్ట్స్ పరిణామం ఇదేనా?
- ముఖ్యమంత్రి పదవికి రాజీనామాకు మమత ససేమిరా!
- లోక్భవన్కు వెళ్లబోనని ప్రకటన
- మమత ప్రకటనపై న్యాయ నిపుణుల అంచనాలు ఇవే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. 294 స్థానాలకు గాను 207 స్థానాలు గెలుచుకుని అది పెద్ద శక్తిగా నిలిచింది. తదుపరి ప్రభుత్వం ఏర్పాటుకు మమతా బెనర్జీ సహకరించాలి. కానీ అందుకు భిన్నంగా ఆమె సంచలన ప్రకటన చేశారు. ‘‘ఎన్నికల్లో ఓడిపోలేదని.. రాజీనామా చేసే ప్రసక్తే లేదని.. లోక్భవన్కు కూడా వెళ్లను.’’ అని ప్రకటించారు. మమత చేసిన ఈ వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా సంచలనంగా మారాయి. ప్రస్తుతం మమత వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఈ నేపథ్యంలో మేధావులు, న్యాయ నిపుణుల నుంచి రకరకాలైన విశ్లేషణలు వెలుగులోకి వస్తున్నాయి.
న్యాయ నిపుణుల అభిప్రాయం ప్రకారం… ‘‘మమతా బెనర్జీ ప్రభుత్వ కాలం మే 7తో ముగుస్తోంది. అనంతరం ఆమె పదవిలో కొనసాగడానికి వీలుండదు. రాజీనామా చేయకపోయినా ఆమె ప్రభావం ఉండదు. రాష్ట్ర గవర్నర్కు అసెంబ్లీని రద్దు చేసే అధికారం ఉంటుంది. ఐదేళ్ల పదవీకాలం పూర్తి కాగానే ప్రభుత్వం ఆటోమేటిక్గా ముగిసినట్లే అవుతుంది.’’ అని న్యాయ నిపుణులు భావిస్తున్నారు.
Also Read
- Tamil Nadu Politics: తమిళ రాజకీయాల్లో కీలక పరిణామం.. ఏఐఏడీఎంకేకు షాక్.. విజయ్ పార్టీకి భారీ బూస్ట్..
- Joseph Vijay: టైమ్ టు టైమ్..ఫైల్ తర్వాత ఫైల్.. దళపతి మార్క్ రూలింగ్!
- WhatsApp: మెటాకు కేంద్రం షాక్.. కొత్త ఫీచర్ నిలిపివేయాలని ఆదేశం
- Sanae Takaichi: ఢిల్లీ చేరుకున్న జపాన్ ప్రధాని సనే తకైచి.. 3 రోజులు పర్యటన
మమతా బెనర్జీ రాజీనామా చేయకపోయినా రాజ్యాంగ ప్రక్రియల ప్రకారం కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు మార్గం సుగమమవుతుంది. అయితే ప్రతిఘటన వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని ఒక సీనియర్ న్యాయవాది వ్యాఖ్యానించారు. ఐదేళ్ల కాలపరిమితి ముగిసినందున గవర్నర్ రాష్ట్ర శాసనసభను రద్దు చేస్తారని.. దీంతో ఆటోమేటిక్గా మమత ప్రభుత్వ పదవీకాలం కూడా ముగుస్తుందని పేర్కొన్నారు.
మమత ఏమన్నారంటే..
ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసే ప్రసక్తేలేదని మమతా బెనర్జీ ప్రకటించారు. పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాల తర్వాత మమత మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘నేను ఓడిపోలేదు.. రాజీనామా చేయను. లోక్భవన్కు వెళ్లి గవర్నర్ను కూడా కలవను. తన ఓటమికి ఎన్నికల సంఘమే కారణం. 100 సీట్లను బీజేపీ దొంగిలించింది. కౌంటింగ్ కేంద్రానికి వచ్చినప్పుడు తనపై దాడి కూడా జరిగింది.’’ అని మమత ఆరోపించారు.
తాజావార్తలు
-
IND vs ENG: మ్యాచ్ రద్దు.. భారత్ బ్యాటింగ్లో కనిపించిన కీలక లోపాలు
-
Anil Ravipudi : నేటి నుండి వెంకీ – కళ్యాణ్ రామ్ – అనిల్ ఆట షురూ
-
Vaibhav Sooryavanshi: సంజునే స్వయంగా ఛాన్స్ ఇస్తున్నాడు.. రెండో టీ20లో వైభవ్ అరంగేట్రం!
-
Russian Couple: ప్రేమ కోసం ప్రాణాలనే పణంగా పెట్టిన జంట.. 1,454 అడుగుల ఎత్తులో ప్రపోజ్!
-
Tamil Nadu Politics: తమిళ రాజకీయాల్లో కీలక పరిణామం.. ఏఐఏడీఎంకేకు షాక్.. విజయ్ పార్టీకి భారీ బూస్ట్..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!
-
Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?
-
అందుబాటులోకి Aadhaar App కొత్త వెర్షన్..ఫేస్ ఆథెంటికేషన్, మొబైల్ నంబర్ అప్డేట్లతో పాటు మరిన్ని సేవలు.!