Mamata Banerjee: మమత రాజీనామా చేయకపోతే ఏం జరుగుతుంది? నెక్ట్స్ పరిణామం ఇదేనా?
- ముఖ్యమంత్రి పదవికి రాజీనామాకు మమత ససేమిరా!
- లోక్భవన్కు వెళ్లబోనని ప్రకటన
- మమత ప్రకటనపై న్యాయ నిపుణుల అంచనాలు ఇవే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. 294 స్థానాలకు గాను 207 స్థానాలు గెలుచుకుని అది పెద్ద శక్తిగా నిలిచింది. తదుపరి ప్రభుత్వం ఏర్పాటుకు మమతా బెనర్జీ సహకరించాలి. కానీ అందుకు భిన్నంగా ఆమె సంచలన ప్రకటన చేశారు. ‘‘ఎన్నికల్లో ఓడిపోలేదని.. రాజీనామా చేసే ప్రసక్తే లేదని.. లోక్భవన్కు కూడా వెళ్లను.’’ అని ప్రకటించారు. మమత చేసిన ఈ వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా సంచలనంగా మారాయి. ప్రస్తుతం మమత వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఈ నేపథ్యంలో మేధావులు, న్యాయ నిపుణుల నుంచి రకరకాలైన విశ్లేషణలు వెలుగులోకి వస్తున్నాయి.
న్యాయ నిపుణుల అభిప్రాయం ప్రకారం… ‘‘మమతా బెనర్జీ ప్రభుత్వ కాలం మే 7తో ముగుస్తోంది. అనంతరం ఆమె పదవిలో కొనసాగడానికి వీలుండదు. రాజీనామా చేయకపోయినా ఆమె ప్రభావం ఉండదు. రాష్ట్ర గవర్నర్కు అసెంబ్లీని రద్దు చేసే అధికారం ఉంటుంది. ఐదేళ్ల పదవీకాలం పూర్తి కాగానే ప్రభుత్వం ఆటోమేటిక్గా ముగిసినట్లే అవుతుంది.’’ అని న్యాయ నిపుణులు భావిస్తున్నారు.
Also Read
- Watermelon Case: పుచ్చకాయ తిని నలుగురు మృతి.. ఫోరెన్సిక్ నివేదికలో షాకింగ్ నిజం..
- TVK Vijay: విజయ్కు కొత్త చిక్కులు.. వాట్సాప్ మెసేజ్లపై వామపక్షాలు గుర్రు!
- TVK Vijay: న్యాయ నిపుణులతో విజయ్ మంతనాలు.. ప్రభుత్వ ఏర్పాటుపై సమాలోచనలు.. నెక్ట్స్ ప్లాన్ ఇదేనా?
- West Bengal: మమతా బెనర్జీకి గవర్నర్ షాక్.. టీఎంసీ సర్కార్ బర్తరఫ్..
మమతా బెనర్జీ రాజీనామా చేయకపోయినా రాజ్యాంగ ప్రక్రియల ప్రకారం కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు మార్గం సుగమమవుతుంది. అయితే ప్రతిఘటన వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని ఒక సీనియర్ న్యాయవాది వ్యాఖ్యానించారు. ఐదేళ్ల కాలపరిమితి ముగిసినందున గవర్నర్ రాష్ట్ర శాసనసభను రద్దు చేస్తారని.. దీంతో ఆటోమేటిక్గా మమత ప్రభుత్వ పదవీకాలం కూడా ముగుస్తుందని పేర్కొన్నారు.
మమత ఏమన్నారంటే..
ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసే ప్రసక్తేలేదని మమతా బెనర్జీ ప్రకటించారు. పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాల తర్వాత మమత మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘నేను ఓడిపోలేదు.. రాజీనామా చేయను. లోక్భవన్కు వెళ్లి గవర్నర్ను కూడా కలవను. తన ఓటమికి ఎన్నికల సంఘమే కారణం. 100 సీట్లను బీజేపీ దొంగిలించింది. కౌంటింగ్ కేంద్రానికి వచ్చినప్పుడు తనపై దాడి కూడా జరిగింది.’’ అని మమత ఆరోపించారు.
తాజావార్తలు
-
Watermelon Case: పుచ్చకాయ తిని నలుగురు మృతి.. ఫోరెన్సిక్ నివేదికలో షాకింగ్ నిజం..
-
TVK Vijay: విజయ్కు కొత్త చిక్కులు.. వాట్సాప్ మెసేజ్లపై వామపక్షాలు గుర్రు!
-
CM Chandrababu : బుల్లెట్ బండి.. కాలేజీ జ్ఞాపకాలు.. రాయల్ ఎన్ఫీల్డ్ నడపడంపై చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు
-
US-Iran Talks: హార్ముజ్పై గుడ్న్యూస్.. ఇరాన్-యూఎస్ మధ్య కీలక చర్చలు.. ఏం నిర్ణయం తీసుకున్నారంటే..!
-
Ponnam Prabhakar : రాజకీయాల్లో హుందాతనం ముఖ్యం.. భౌతిక దాడులపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఆగ్రహం