Mamata Banerjee: బెంగాల్ ఎన్నికల వేళ మమత కొత్త ఎత్తుగడ.. ఒక వర్గం ఓట్ల కోసం మాస్టర్ ప్లాన్!
- సమీపిస్తున్న బెంగాల్ ఎన్నికల సమయం
- ఎన్నికల వేళ మమత మాస్టర్ ప్లాన్!
- ఒక వర్గం ఓట్ల కోసం కొత్త ప్రణాళిక
- Follow Us :
-
-
Add as a preferred
source on google
త్వరలోనే పశ్చిమ బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకోసం ఎన్నికల సంఘం కసరత్తు ప్రారంభించింది. ఇక ఎన్నికల కోసం ప్రధాన పార్టీలు కూడా సన్నద్ధమవుతున్నాయి. ఇప్పటికే తృణమూల్ కాంగ్రెస్-బీజేపీ నువ్వానేనా? అన్నట్టుగా ఢీకొంటున్నాయి. ఒకరేమో అధికారాన్ని నిలబెట్టుకునేందుకు తాపత్రాయం పడుతుంటే.. ఇంకొకరేమో అధికారం చేజిక్కించుకోవాలని ఆరాటపడుతోంది.
ఇది కూడా చదవండి: PM Modi: భారత్-ఈయూ మధ్య చారిత్రాత్మక ఒప్పందం.. ప్రకటించిన ప్రధాని మోడీ
Also Read
- Jharkhand: దిగొచ్చిన హేమంత్ సర్కార్.. విద్యార్థుల డిమాండ్లకు అంగీకారం!
- Vishnu Deo Sai: రైతుగా మారిన ముఖ్యమంత్రి.. పొలం దున్నిన విష్ణు దేవ్
- Jio Prime Membership: గుడ్న్యూస్.. Jio Prime రీలాంచ్.. ఏడాది పాటు రీఛార్జ్ ధర టెన్షన్ ఉండదు..!
- Twisha Sharma: సీబీఐ ఛార్జ్షీట్లో ట్విషా శర్మ చివరి మాటలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వ్యాఖ్యలు
ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఒక వర్గం ఓటు బ్యాంక్ కోసం మాస్టర్ ప్లానే వేసినట్లుగా తెలుస్తోంది. ముస్లిం నేతృత్వంలోని ఒక ఫ్రంట్ను ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. 2011 నుంచి తృణమూల్ కాంగ్రెస్ మైనారిటీ ఓట్లను పొందుతోంది. అయితే ఈ మధ్య టీఎంసీ ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ముర్షిదాబాద్లోని బెల్దంగాలో జాతీయ రహదారి 12 వెంబడి బాబ్రీ మసీదు ప్రతిరూపాన్ని నిర్మించడం వెనుక ఉన్న ఎమ్మెల్యే హుమాయున్ కబీర్ను సస్పెండ్ చేసింది. అతడు జనతా ఉన్నయన్ పార్టీ (JUP) పేరుతో కొత్త పార్టీని స్థాపించాడు. అప్పటి నుంచి ముస్లింలంతా అధికార పార్టీ నుంచి వైదొలగాలని బహిరంగంగా పిలుపునిస్తున్నారు.
ఇది కూడా చదవండి: JanaNayagan : విజయ్ ‘జననాయగన్’ కు మరో షాక్ ఇచ్చిన కోర్టు
అయితే పశ్చిమ బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగడానికి కొన్ని వారాలే మిగిలి ఉండగా వారి ఓటు బ్యాంక్ను పోగొట్టుకోకూడదని మమత భావిస్తున్నారు. ఇలాంటి తరుణంలో ముస్లింల నేతృత్వంలోని రాజకీయ సంస్థల మధ్య ఒక మైనారిటీ ఫ్రంట్ను ఏర్పాటు చేసి ప్రయోజనం పొందాలని చూస్తున్నారు. ఈ ఫ్రంట్ ఏర్పాటు వల్ల మమతా బెనర్జీ తిరిగి ముస్లింల ఓటు బ్యాంక్ నిలబెట్టుకోవచ్చు. అంతేకాకుండా అధికారాన్ని కాపాడుకోవచ్చు. తిరిగి నాలుగోసారి అధికారంలోకి రావడానికి అవకాశం ఉంటుంది. అందుకోసం ముస్లింల ఓటు బ్యాంక్ కోసం మమత తీవ్ర కసరత్తు చేస్తున్నారు.
2011 జనాభా లెక్కల ప్రకారం.. పశ్చిమ బెంగాల్ జనాభాలో ముస్లింలు దాదాపు 27 శాతం ఉన్నారు. ముర్షిదాబాద్, మాల్డా, ఉత్తర దినాజ్పూర్, బిర్భూమ్, నార్త్ 24 పరగణాలు, సౌత్ 24 పరగణాలు వంటి జిల్లాల్లో మైనారిటీ ఓటర్లు ఫలితాలను నిర్ణయాత్మకంగా మార్చగల డజన్ల కొద్దీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ నియోజకవర్గాలే టీఎంసీకి అఖండ విజయాలను అందించాయి. మాల్డాలో ఆ పార్టీ ఓట్ల శాతం 2021లో 53 శాతానికి పెరిగింది. ముర్షిదాబాద్లో అదే కాలంలో ఆ పార్టీ ఓట్ల వాటా 6 శాతం నుంచి 54 శాతానికి పెరిగింది. రెండు జిల్లాల్లోని 34 అసెంబ్లీ సీట్లలో టీఎంసీ ప్రస్తుతం 28 సీట్లను కలిగి ఉంది. ఉత్తర దినాజ్పూర్లో ఆరు సీట్లలో నాలుగు సీట్లను ఆ పార్టీ నియంత్రిస్తోంది.
బెంగాల్లో మొత్తం 294 అసెంబ్లీ స్థానాలు ఉంటే అందులో 100 సీట్లలో ముస్లింలు ప్రభావితం చేయనున్నారు. ఈ నేపథ్యంలో ముస్లింలందరినీ ఒక్కతాటిపైకి తెచ్చేందుకు మమత ప్రయత్నిస్తున్నారు. దూరమైన ముస్లింలను దగ్గరకు తీసుకుని.. తిరిగి అధికారాన్ని నిలబెట్టుకోవాలని ప్రయత్నిస్తున్నారు. ఏం జరుగుతుందో మరికొన్ని రోజుల్లో తేలిపోనుంది.
తాజావార్తలు
-
Beetroot Halwa: బీట్రూట్ తినడం ఇష్టం లేదా.. అయితే “బీట్రూట్ హల్వా” ఇలా చేసేయండి.. లొట్టలేసుకుంటూ తినేస్తారు.!
-
IND vs SL: గాలె టెస్టులో అంపైర్ను వణికించిన డీఎస్పీ.. తృటిలో తప్పిన పెను ప్రమాదం.. వీడియో వైరల్!
-
Mega 158 : చిరు – బాబీ సినిమాకు దాదాపు ఆ టైటిల్ ఫిక్స్ ?
-
Psychology Facts: రేపటి దుఃఖాన్ని ఈరోజే ఎందుకు అనుభవిస్తున్నాం? సైకాలజీ ఏం చెబుతోంది?
-
Jana Nayagan OTT Release: ఓటీటీలోకి దళపతి విజయ్ ‘జన నాయగన్’.. ఎప్పటి నుంచి చూడొచ్చంటే?
ట్రెండింగ్
-
Sanjay Manjrekar: లైవ్లో మాజీ క్రికెటర్ల మధ్య వార్.. అద్దంలో చూసుకో అంటూ ఒకరిపై మరొకరు సెటైర్లు!
-
Jeep Compass 85th Anniversary Edition లాంచ్.. ధర రూ.26.70 లక్షలు, కేవలం 85 యూనిట్లే!
-
Flower Plants: వర్షాలు పడుతున్నాయా.? అయితే ఆలస్యం ఎందుకు.. ఎక్కువ కష్టపడకుండానే ఇంట్లోనే పూల తోట పెంచేయండి ఇలా..!
-
రూ.8,499కే ఇంట్లోనే థియేటర్.! 200 అంగుళాల స్క్రీన్, స్మార్ట్ ఫీచర్లతో XElectron Techno Plus ప్రొజెక్టర్ లాంచ్.!
-
Jio Prime Membership: గుడ్న్యూస్.. Jio Prime రీలాంచ్.. ఏడాది పాటు రీఛార్జ్ ధర టెన్షన్ ఉండదు..!