PM Modi: భారత్-ఈయూ మధ్య చారిత్రాత్మక ఒప్పందం.. ప్రకటించిన ప్రధాని మోడీ
- భారత్-ఈయూ మధ్య చారిత్రాత్మక ఒప్పందం
- అధికారికంగా ప్రకటించిన ప్రధాని మోడీ
- మదర్ ఆఫ్ ఆల్ డీల్గా ప్రధాని అభివర్ణన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత్-ఐరోపా మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం జరిగినట్లుగా ప్రధాని మోడీ వెల్లడించారు. మంగళవారం గోవాలో జరుగుతున్న ఇండియా ఎనర్జీ వీక్- 2026ను మోడీ వర్చువల్గా ప్రారంభించి ట్రేడ్ డీల్ గురించి మాట్లాడారు. సోమవారం భారత్-ఈయూ మధ్య ప్రధాన ఒప్పందంపై సంతకాలు జరిగాయని.. దీన్ని ప్రపంచ వ్యాప్తంగా ‘మదర్ ఆఫ్ ఆల్ డీల్స్’గా చర్చించుకుంటున్నారని పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: US-Europe: అమెరికా లేకుంటే ఐరోపాకు భద్రతా ఎక్కడది? నాటో చీఫ్ సంచలన వ్యాఖ్యలు
Also Read
దాదాపు రెండు దశాబ్దాల చర్చల తర్వాత జనవరి 27న భారత్-ఈయూ సమ్మిట్లో భారతదేశం-యూరోపియన్ యూనియన్ చారిత్రాత్మక వాణిజ్య ఒప్పందాన్ని ప్రకటించాయి. సమ్మిట్కు యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు ఆంటోనియో లూయిస్ శాంటోస్ డా కోస్టా, యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లేయన్ సహ అధ్యక్షత వహించారు.
ఇది కూడా చదవండి: US: భారత్-ఈయూ ఒప్పందం వేళ అమెరికా షాక్.. డీల్పై హాట్ కామెంట్స్
ఈ భారీ ఒప్పందం రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల మధ్య తయారీ రంగాన్ని.. సేవలను పెంచుతుందని ప్రధాని మోడీ అన్నారు. రెండు వైపులా వ్యాపారాలు.. ప్రజలకు ప్రధాన అవకాశాలను సృష్టిస్తుందని మోడీ పేర్కొన్నారు. ఈ ఒప్పందం భారతదేశంలోని 1.4 బిలియన్ల ప్రజలకు-యూరోపియన్ దేశాలలోని మిలియన్ల మంది ప్రజలకు అద్భుతమైన అవకాశాలను తెస్తుందని చెప్పారు. ప్రపంచంలోని రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల మధ్య సహకారానికి ఈ ఒప్పందం ఒక అద్భుతమైన ఉదాహరణ అని చెప్పారు. ఈ ఒప్పందం ప్రపంచ జీడీపీలో దాదాపు 25 శాతం, ప్రపంచ వాణిజ్యంలో దాదాపు మూడింట ఒక వంతు ప్రాతినిధ్యం వహిస్తుందని వెల్లడించారు. ఇది వాణిజ్యం పట్ల మాత్రమే కాకుండా ప్రజాస్వామ్యం, చట్ట పాలన పట్ల కూడా ఉమ్మడి నిబద్ధతను బలపరుస్తుందని తెలిపారు.
తాజావార్తలు
-
SRH: విధ్వంసం స్పష్టించిన కాటేరమ్మ కొడుకులు.. టాప్ లోకి దూసుకెళ్లిన హైదరాబాద్.. పలు రికార్టులు బద్దలు..
-
Srithej : శ్రీతేజ్ కుటుంబానికి అల్లు ఫ్యామిలీ భరోసా: చదువు బాధ్యత నాదేనన్న అల్లు అరవింద్!
-
Iran-US: ఇస్లామాబాద్లో మళ్లీ చర్చలు జరగబోతున్నాయా? తాజా బ్రేకింగ్ న్యూస్ ఇదే!
-
Ricky Ponting: క్యాచ్ వదిలేసిన శశాంక్ సింగ్.. పంజాబ్ కోచ్ రికీ పాంటింగ్ సంచలన వ్యాఖ్యలు..
-
DMK: కాంగ్రెస్ను నమ్మి భారీ మూల్యం చెల్లించుకున్నాము..
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!