IND vs SL: గాలె టెస్టులో అంపైర్ను వణికించిన డీఎస్పీ.. తృటిలో తప్పిన పెను ప్రమాదం.. వీడియో వైరల్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత్, శ్రీలంక మధ్య గాలెలో జరుగుతున్న తొలి టెస్టు మూడో రోజులో ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. టీమిండియా స్టార్ పేసర్, డీఎస్పీ మహ్మద్ సిరాజ్ అంపైర్ను భయపెట్టాడు. సిరాజ్ విసిరిన బుల్లెట్ త్రోకు అంపైర్ అహ్సాన్ రజా వణికిపోయాడు. బౌండరీ సమీపంలో సిరాజ్ బంతిని అందుకుని బలంగా విసరగా.. అది లెగ్ అంపైర్ రజాకు అత్యంత సమీపంగా దూసుకెళ్లింది. పరిస్థితిని గమనించిన అంపైర్ వెంటనే పక్కకు తప్పుకోవడంతో ప్రమాదం తప్పింది.
ఈ ఘటనను మైదానంలో ఉన్న రవీంద్ర జడేజా గమనించాడు. అంపైర్ వెంటనే పక్కకు జరగడంతో.. జడేజా నవ్వులు పూయించాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. మహ్మద్ సిరాజ్ త్రో వేగం, అంపైర్ వెంటనే తప్పుకున్న తీరు, జడేజా రియాక్షన్ నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. గాలెలో రాడ్ టక్కర్ స్థానంలో అహ్సాన్ రజా అంపైర్గా వ్యవహరించారు.
Also Read
- ICC Rankings: ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్.. టాప్లోకి దూసుకెళ్లిన స్మృతి మంధాన..
- Vaibhav Sooryavanshi: వైస్ కెప్టెన్ ఎందుకు చేశారన్నారు.. కెప్టెన్కే సలహాలు ఇస్తున్న వైభవ్.. వీడియో వైరల్!
- KL Rahul-IPL 2027: ట్రేడ్ రూమర్స్కు చెక్.. ఢిల్లీ క్యాపిటల్స్తోనే కేఎల్ రాహుల్!
- Duleep Trophy Final: ఈస్ట్ జోన్ పెద్ద స్కెచ్చే.. 2 రోజులు ఎందుకు బ్యాటింగ్ చేసిందంటే?.. బీసీసీఐ డిక్లరేషన్ రూల్ ఇదే!
మ్యాచ్ విషయానికి వస్తే.. మూడో రోజు భారత బౌలర్లు శ్రీలంక బ్యాటర్లను కట్టడి చేశారు. మానవ్ సుతార్, రవీంద్ర జడేజా కలిసి ఏడు వికెట్లు పడగొట్టడంతో శ్రీలంక తొలి ఇన్నింగ్స్లో 284 పరుగులకే ఆలౌటైంది. దీంతో భారత్కు తొలి ఇన్నింగ్స్లో 178 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. తొలి టెస్టు ఆడుతున్న మానవ్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. తన తొలి బంతికే వికెట్ తీసిన అతడు.. మొత్తంగా 4/76 గణాంకాలతో సత్తా చాటాడు. పిచ్పై లభించిన టర్న్, బౌన్స్ను సద్వినియోగం చేసుకున్న సుతార్.. శ్రీలంక బ్యాటర్లను ఇబ్బంది పెట్టాడు. మరోవైపు సీనియర్ రవీంద్ర జడేజా 3/57తో కీలక పాత్ర పోషించాడు. ఈ క్రమంలో జడేజా టెస్టు క్రికెట్లో 350 వికెట్ల మైలురాయిని కూడా అందుకున్నాడు.
భారత బౌలింగ్ దళంలో కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ ఒక్కో వికెట్ తీశారు. ఒక దశలో శ్రీలంక 90 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోవడంతో భారత్ ఫాలోఆన్ విధించే అవకాశం కనిపించింది. అయితే సోనాల్ దినూష, నిరోషన్ డిక్వెల్లా అద్భుతంగా పోరాడారు. ఇద్దరూ కలిసి ఆరో వికెట్కు ఏకంగా 146 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి శ్రీలంకను ఆడుకున్నారు. సోనాల్ దినూష 168 బంతుల్లో తన తొలి టెస్టు శతకాన్ని నమోదు చేశాడు. మరోవైపు డిక్వెల్లా 115 బంతుల్లో 80 పరుగులు చేసి కీలక ఇన్నింగ్స్ ఆడాడు. అయితే ప్రసిద్ధ్ కృష్ణ అద్భుతమైన బంతితో డిక్వెల్లాను ఔట్ చేయడంతో శ్రీలంక వికెట్ల పతనం ఆగలేదు.
తాజావార్తలు
-
Story Board : పసిడి అమ్మకాన్ని ప్రోత్సహిస్తున్న కంపెనీలు.. సామాన్యుల బలహీనతలే టార్గెటా?
-
Israel: ఇజ్రాయెల్పై యూకే, ఫ్రాన్స్, కెనడా ఆంక్షలు.. ప్రతీకార చర్యలకు దిగిన టెల్ అవీవ్!
-
Vijay Deverakonda : “వాళ్ల జోలికొస్తే నేను ఊరుకోను”.. స్టేజ్ మీదే వార్నింగ్ ఇచ్చిన విజయ్ దేవరకొండ!
-
OTR : కుప్పంలో పాత నేత మళ్ళి కీలక బాధ్యత లోకి రాబోతున్నారా?
-
Sandeep Reddy Vanga: ‘అప్పుడే అర్థమైంది..’ ఆనంద్ గురించి ఆసక్తికర విషయం చెప్పిన సందీప్ రెడ్డి వంగా
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: వైస్ కెప్టెన్ ఎందుకు చేశారన్నారు.. కెప్టెన్కే సలహాలు ఇస్తున్న వైభవ్.. వీడియో వైరల్!
-
Harry Potter అభిమానులకు గుడ్ న్యూస్.. Realme కొత్త స్పెషల్ ఎడిషన్ లాంచ్.!
-
Homemade Pani Puri: పానీపూరి అంటే ఇష్టమా? బయట బండి దగ్గర ఉండే టేస్ట్.. ఇంట్లోనే సులువుగా ఇలా చేసుకోండి ఇలా.!
-
Pigeons Problem: పావురాల బెడదతో విసిగిపోయారా..? ఈ చిట్కాలతో సింపుల్ గా సమస్యకు చెక్ పెట్టండి ఇలా.!
-
200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Huawei Pura X View లాంచ్..!