PM Bengaluru Roadshows: పీఎం బెంగళూరు రోడ్షోలో మార్పులు.. కారణమిదే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BJP Makes Changes To PM Bengaluru Roadshows Over Medical Entrance Exam: నీట్ పరీక్షలను దృష్టిలో ఉంచుకుని.. కర్ణాటక బీజేపీ బెంగళూరులో ప్రధాని నరేంద్ర మోడీ రెండు రోజుల రోడ్షోలో మార్పులు చేసింది. మే 6న విస్తృతమైన ఈవెంట్ను, మే 7న స్వల్పకాలిక కార్యక్రమాన్ని షెడ్యూల్ చేసింది. కేంద్రమంత్రి శోభా కరంద్లాజే ఈ విషయాన్ని శుక్రవారం ధృవీకరించారు. ‘‘మే 6, 7 తేదీల్లో ప్రధాని మోడీ రోడ్ షో ఉంటుంది. దానికి సన్నాహాలు జరుగుతున్నాయి. మేము పత్రికల ద్వారా ప్రజలకు సంబంధించిన సమాచారాన్ని పంచుకున్నాము. అయితే.. మే 7న మధ్యాహ్నం 2 గంటలకు నీట్ పరీక్షల గురించి మీడియా మాకు తెలియజేసింది. ఆరోజు చేపట్టే 26 కిమీల రోడ్షో.. పరీక్షలకు అసౌకర్యాన్ని కలిగిస్తుంది’’ అని చెప్పారు.
Smriti Irani: కాంగ్రెస్ హిందూ ద్వేషి, బీజేపీ అధికారంలోకి వస్తుంది.. స్పృతి ఇరానీ జోస్యం
Also Read
- IMD Weather Alert: రేపు దేశవ్యాప్తంగా దంచికొట్టనున్న వానలు.. ఈ రాష్ట్రాలకు ఐఎండీ అలర్ట్
- Shocking Incident: రూ. 60 లక్షల ప్యాకేజ్ అల్లుడు.. చిన్న గొడవకే చంపేసిన అత్తింటివారు..
- PM Modi: బీజేపీ కొత్త టీమ్తో మోడీ భేటీ.. జెన్-జీపై ప్రత్యేక ఫోకస్
- Abhijeet Dipke: స్కూల్లోకి ఎంట్రీ.. టీచర్లకు బెదిరింపు! అభిజీత్ దీప్కేపై కేసు
ఈ పరీక్ష విషయాన్ని తాము పీఎం మోడీ దృష్టికి తీసుకెళ్లామని, పరీక్ష కేంద్రాలకు వెళ్లే విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా రోడ్షో నిర్వహించాల్సిందిగా ఆయన ఆదేశించారని శోభా తెలిపారు. ఆయన కోరుకున్నట్టుగానే కార్యక్రమంలో కొన్ని మార్పులు చేశామని అన్నారు. మే 6న 10కిలోమీటర్ల రోడ్ షో ఉంటుందని, మే 7న 26కిమీ ఉంటుందని గతంలోనే చెప్పిన శోభా.. ఇప్పుడు మే 6న బెంగళూరులోని సోమేశ్వర్ భవన్ ఆర్బీఐ గ్రౌండ్ నుంచి 26 కిలోమీటర్లలో ఒకదానిని సుదూరం నిర్వహిస్తామని చెప్పారు. మల్లేశ్వరంలోని సాంకీ ట్యాంక్కి దక్షిణం నుంచి ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల మధ్య, కెంపేగౌడ విగ్రహం మధ్య తిప్పసంద్ర నుంచి ట్రినిటీ సర్కిల్ వరకు 10 కిలోమీటర్ల రోడ్ షో నిర్వహించనున్నట్టు తెలియజేశారు.
Jammu Anti-Terror Op: జమ్ముకశ్మీర్లో ఎదురుకాల్పులు.. ఐదుగురు ఆర్మీ జవాన్లు మృతి
ఆదివారం రోడ్షో జరిగే ప్రాంతంలో ఎక్కువ పరీక్షా కేంద్రాలు లేవని, ఆ ప్రాంతం నుండి ఎవరైనా విద్యార్థులు వస్తే, వారి హాల్ టిక్కెట్లు చూపించి, వారిని పరీక్ష కేంద్రాలకు సమయానికి చేరుకునేలా చూడాలని పోలీసు అధికారులను ఆదేశించామని శోభా వెల్లడించారు. అంతకుముందు శనివారం ఒక్కరోజే ఎనిమిది గంటలపాటు జరగాల్సిన రోడ్షోను రెండు భాగాలుగా విభజించారు. శని, ఆదివారాల్లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు ర్యాలీని నిర్వహించనున్నారు. ఒకవేళ ర్యాలీ రోజంతా జరిగితే.. సాధారణ ప్రజలకు అసౌకర్యం కలుగుతుందని, ఇలా రెండు భాగాలుగా విభజించడం జరిగింది.
తాజావార్తలు
-
KVN : ‘టాక్సిక్’ మీ పల్స్ రేట్ను కూడా మారుస్తుంది!
-
Yash: తెలుగు ప్రేక్షకులు నాకు ఇచ్చిన బలం, సపోర్ట్కు నేను రెండింతలు తిరిగి ఇస్తాను
-
Hockey World Cup 2026: భారత్కు షాక్.. చివరి 15 నిమిషాల్లో కథ మారింది.. నెదర్లాండ్స్ చేతిలో ఓటమి
-
Huma Qureshi: ‘టాక్సిక్’ తర్వాత టాలీవుడ్లోకి హ్యూమా.. దిల్ రాజు ముందే మాట ఇచ్చేసిందా?
-
Rukmini Vasanth: యశ్తో పనిచేయడం బకెట్ లిస్ట్ మూమెంట్.. ‘టాక్సిక్’ హీరోయిన్ కామెంట్స్ వైరల్!
ట్రెండింగ్
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!
-
7 సీటర్కు బదులు 6 సీటర్.. క్యాప్టెన్ సీట్లతో Mahindra XEV 9S కొత్త వేరియంట్..!