PM Bengaluru Roadshows: పీఎం బెంగళూరు రోడ్షోలో మార్పులు.. కారణమిదే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BJP Makes Changes To PM Bengaluru Roadshows Over Medical Entrance Exam: నీట్ పరీక్షలను దృష్టిలో ఉంచుకుని.. కర్ణాటక బీజేపీ బెంగళూరులో ప్రధాని నరేంద్ర మోడీ రెండు రోజుల రోడ్షోలో మార్పులు చేసింది. మే 6న విస్తృతమైన ఈవెంట్ను, మే 7న స్వల్పకాలిక కార్యక్రమాన్ని షెడ్యూల్ చేసింది. కేంద్రమంత్రి శోభా కరంద్లాజే ఈ విషయాన్ని శుక్రవారం ధృవీకరించారు. ‘‘మే 6, 7 తేదీల్లో ప్రధాని మోడీ రోడ్ షో ఉంటుంది. దానికి సన్నాహాలు జరుగుతున్నాయి. మేము పత్రికల ద్వారా ప్రజలకు సంబంధించిన సమాచారాన్ని పంచుకున్నాము. అయితే.. మే 7న మధ్యాహ్నం 2 గంటలకు నీట్ పరీక్షల గురించి మీడియా మాకు తెలియజేసింది. ఆరోజు చేపట్టే 26 కిమీల రోడ్షో.. పరీక్షలకు అసౌకర్యాన్ని కలిగిస్తుంది’’ అని చెప్పారు.
Smriti Irani: కాంగ్రెస్ హిందూ ద్వేషి, బీజేపీ అధికారంలోకి వస్తుంది.. స్పృతి ఇరానీ జోస్యం
Also Read
- Viral Video: ఛీ.. ఛీ.. ఇంత దారుణంగా ఉన్నారేంట్రా బాబు.. భోజనం చేస్తున్న వారి మధ్యే మూత్ర విసర్జన మహిళ..
- Ketan Agarwal Case: కేతన్ హత్యకు ముందు, తర్వాత చాట్స్ డిలీట్.. సియా-చేతన్ ఫోన్లలో కీలక ఆధారాలు
- Ketan Agarwal Case: మద్యం మత్తులో సియా గోయల్.. వీడియో వైరల్
- Congress: కాంగ్రెస్లో భారీ ప్రక్షాళన.. యూపీతో సహా కీలక రాష్ట్రాల ఇన్ఛార్జ్ల మార్పు! కారణం ఇదేనా
ఈ పరీక్ష విషయాన్ని తాము పీఎం మోడీ దృష్టికి తీసుకెళ్లామని, పరీక్ష కేంద్రాలకు వెళ్లే విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా రోడ్షో నిర్వహించాల్సిందిగా ఆయన ఆదేశించారని శోభా తెలిపారు. ఆయన కోరుకున్నట్టుగానే కార్యక్రమంలో కొన్ని మార్పులు చేశామని అన్నారు. మే 6న 10కిలోమీటర్ల రోడ్ షో ఉంటుందని, మే 7న 26కిమీ ఉంటుందని గతంలోనే చెప్పిన శోభా.. ఇప్పుడు మే 6న బెంగళూరులోని సోమేశ్వర్ భవన్ ఆర్బీఐ గ్రౌండ్ నుంచి 26 కిలోమీటర్లలో ఒకదానిని సుదూరం నిర్వహిస్తామని చెప్పారు. మల్లేశ్వరంలోని సాంకీ ట్యాంక్కి దక్షిణం నుంచి ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల మధ్య, కెంపేగౌడ విగ్రహం మధ్య తిప్పసంద్ర నుంచి ట్రినిటీ సర్కిల్ వరకు 10 కిలోమీటర్ల రోడ్ షో నిర్వహించనున్నట్టు తెలియజేశారు.
Jammu Anti-Terror Op: జమ్ముకశ్మీర్లో ఎదురుకాల్పులు.. ఐదుగురు ఆర్మీ జవాన్లు మృతి
ఆదివారం రోడ్షో జరిగే ప్రాంతంలో ఎక్కువ పరీక్షా కేంద్రాలు లేవని, ఆ ప్రాంతం నుండి ఎవరైనా విద్యార్థులు వస్తే, వారి హాల్ టిక్కెట్లు చూపించి, వారిని పరీక్ష కేంద్రాలకు సమయానికి చేరుకునేలా చూడాలని పోలీసు అధికారులను ఆదేశించామని శోభా వెల్లడించారు. అంతకుముందు శనివారం ఒక్కరోజే ఎనిమిది గంటలపాటు జరగాల్సిన రోడ్షోను రెండు భాగాలుగా విభజించారు. శని, ఆదివారాల్లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు ర్యాలీని నిర్వహించనున్నారు. ఒకవేళ ర్యాలీ రోజంతా జరిగితే.. సాధారణ ప్రజలకు అసౌకర్యం కలుగుతుందని, ఇలా రెండు భాగాలుగా విభజించడం జరిగింది.
తాజావార్తలు
-
Samantha : సమంత వర్సెస్ శోభితా-చైతూ.. విడిపోయినా ఆగని సోషల్ మీడియా వార్!
-
Rahul Dev: భార్య మరణంతో కుప్పకూలిపోయా.. కొడుకే నా జీవితాన్ని మార్చేశాడు: రాహుల్ దేవ్
-
Bhagirath Choudhary: మంత్రే లబ్ధిదారుడు.. సొంత మంత్రిత్వ శాఖ పథకం నుంచి రూ.99 లక్షల సబ్సిడీ..
-
Herbal Hair Care: షాంపూలు రాకముందు జుట్టు మెరిసేలా ఉంచిన సహజ చిట్కాలు ఇవే..
-
FIH Pro League: క్రికెట్ మాత్రమే కాదు.. హాకీలోనూ పాకిస్థాన్ను చిత్తుచిత్తుగా ఓడించిన భారత్.!
ట్రెండింగ్
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇంత దారుణంగా ఉన్నారేంట్రా బాబు.. భోజనం చేస్తున్న వారి మధ్యే మూత్ర విసర్జన మహిళ..
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!