Malegaon blast case: మాలేగావ్ కేసులో మోడీ, యోగిని ఇరికించాలని కాంగ్రెస్ కుట్ర: ప్రజ్ఞా ఠాకూర్
- మాలేగావ్ కేసులో ప్రధానిమోడీ, సీఎం యోగించాలని కాంగ్రెస్ కుట్ర..
- పేర్లు చెప్పాలని హింసించిన ఏటీఎస్..
- నిర్దోషిగా విడుదలైన ప్రజ్ఞా ఠాకూర్ సంచలన కామెంట్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Malegaon blast case: మాలేగావ్ బాంబు పేలుడు కేసులో మాజీ ఎంపీ ప్రజ్ఞా ఠాకూర్ను ఎన్ఐఏ కోర్టు నిర్దోషిగా ప్రకటించింది. అయితే, ఈ కేసులో ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ సమయంలో యాంటీ టెర్రరిస్ట్ స్వ్కాడ్(ATS) తనను తీవ్రంగా హింసించిందని బీజేపీ మాజీ ఎంపీ ఆరోపించింది. 2008 మాలేగావ్ పేలుళ్ల కేసులో ఏడుగురు నిందితులను ఎన్ఐఏ కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. ఆధారాలు లేవని చెప్పింది.
ఈ కేసులో ప్రధాని నరేంద్రమోడీ, ఉత్తర్ ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ పేర్లను చెప్పాలని, ఏటీఎస్ తనను చిత్రహింసలకు గురిచేసి, బలవంతం చేసిందని ఆమె ఆరోపించారు. వీరి పేర్లు చెబితే మిమ్మల్ని కొట్టమని చెప్పేవారని, వారి ప్రధాన లక్ష్యం తనను హింసించడమే అని ఠాకూర్ శనివారం విలేకరులతో అన్నారు. తనను చట్టవిరుద్ధంగా 13 రోజులు ఉంచారని, వారి కస్టడీలో 24 రోజుల పాటు హింసించారని అన్నారు.
Also Read
- Rakhi Sawant: మక్కాలో అల్లాకు రాఖీ ప్రార్థనలు.. జెన్-జీకి ఉద్యోగాలు ఇవ్వాలని వేడుకోలు..
- Nepal Floods: నేపాల్ వరదలు.. కొట్టుకొచ్చిన బంగారం, వెండి, డబ్బులు..
- Konda Surekha: సీఎం రేవంత్ రెడ్డికి రాఖీ కట్టిన మహిళా మంత్రులు.. ‘నన్ను సపరేట్ చేయకండి’ అంటూ కొండా కీలక సురేఖ వ్యాఖ్యలు..!
- Bhatti Vikramarka: ‘హట్టి గోల్డ్ మైన్స్’ సందర్శించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.!
Read Also: PM Modi: “బ్రహ్మోస్ క్షిపణి” శబ్ధం వింటే పాకిస్తాన్కు నిద్రపట్టదు..
ఇది కాంగ్రెస్ కుట్ర, ఇది ఇప్పుడు బహిర్గతమైంది. సత్యం ఎల్లప్పుడూ గెలుస్తుంది. ఈ సారి కూడా అది గెలిచింది. భారతదేశానికి ప్రాథమిక స్తంభాలు అయిన సాధువులు, ఆర్ఎస్ఎస్, సైన్యాన్ని కాంగ్రెస్ లక్ష్యంగా చేసుకుంటుంది’’ అని ఆమె ఆరోపించింది. భవిష్యత్తులో దేశం కోసం చేయగలిగిందంతా చేస్తానని, మొత్తం కేసును కాంగ్రెస్ తప్పుగా బనాయించిందని, ఈ కేసు నిరాధారమైందని, కాంగ్రెస్ ఎల్లప్పుడూ ఉగ్రవాదుల్ని గౌరవంగా చూస్తోందని, కాంగ్రెస్ దేశాన్ని ప్రేమించే పార్టీగా మారదు అని ఠాకూర్ అన్నారు.
ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు 2008 మాలేగావ్ పేలుళ్ల కేసులో ఏడుగురు నిందితులను నిర్దోషులుగా విడుదల చేసింది. ప్రాసిక్యూషన్ ఈ కేసును సహేతుకమైన సందేహాలను నిరూపించడంలో విఫలమైందని పేర్కొంది. ఈ కేసులో ప్రజ్ఞా సింగ్ ఠాకూర్, మేజర్ (రిటైర్డ్) రమేష్ ఉపాధ్యాయ, సుధాకర్ చతుర్వేది, అజయ్ రహిర్కర్, సుధాంకర్ ధర్ ద్వివేది (శంకరాచార్య), సమీర్ కులకర్ణి సహా నిందితులను నిర్దోషులుగా విడుదల చేసినట్లు కోర్టు పేర్కొంది. అంతేకాకుండా, బాధిత కుటుంబాలకు పరిహారం అందించాలని, మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షలు, గాయపడిన వారికి రూ. 50,000 చెల్లించాలని కూడా కోర్టు మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. సెప్టెంబర్ 29, 2008 నాటిది, మాలేగావ్ నగరంలోని భిక్కు చౌక్లోని ఒక మసీదు సమీపంలో మోటార్సైకిల్లో ఉంచిన బాంబు పేలి ఆరుగురు మరణించారు. 95 మంది గాయపడ్డారు.
తాజావార్తలు
-
CM Chandrababu : స్థానిక సంస్థల ఎన్నికలపై సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
-
Rakhi Sawant: మక్కాలో అల్లాకు రాఖీ ప్రార్థనలు.. జెన్-జీకి ఉద్యోగాలు ఇవ్వాలని వేడుకోలు..
-
Veligonda Project : వెలిగొండ నిర్వాసితులకు బిగ్ గుడ్ న్యూస్.. చంద్రబాబు కీలక ఆదేశాలు
-
AP Govt: 18 ఏళ్లు నిండిన యువతకు శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. రూ.2 లక్షల చొప్పున సాయం..
-
Deepika: ఆ “హీరో కంటే నాకే ఎక్కువ అర్హత.. తక్కువ ఇస్తే ఊరుకోను!”.. రెమ్యునరేషన్ పై దీపికా పదుకొనే సంచలనం!
ట్రెండింగ్
-
Fridge Wall Gap : ఫ్రిజ్ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!