Malegaon blast case: మాలేగావ్ కేసులో మోడీ, యోగిని ఇరికించాలని కాంగ్రెస్ కుట్ర: ప్రజ్ఞా ఠాకూర్
- మాలేగావ్ కేసులో ప్రధానిమోడీ, సీఎం యోగించాలని కాంగ్రెస్ కుట్ర..
- పేర్లు చెప్పాలని హింసించిన ఏటీఎస్..
- నిర్దోషిగా విడుదలైన ప్రజ్ఞా ఠాకూర్ సంచలన కామెంట్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Malegaon blast case: మాలేగావ్ బాంబు పేలుడు కేసులో మాజీ ఎంపీ ప్రజ్ఞా ఠాకూర్ను ఎన్ఐఏ కోర్టు నిర్దోషిగా ప్రకటించింది. అయితే, ఈ కేసులో ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ సమయంలో యాంటీ టెర్రరిస్ట్ స్వ్కాడ్(ATS) తనను తీవ్రంగా హింసించిందని బీజేపీ మాజీ ఎంపీ ఆరోపించింది. 2008 మాలేగావ్ పేలుళ్ల కేసులో ఏడుగురు నిందితులను ఎన్ఐఏ కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. ఆధారాలు లేవని చెప్పింది.
ఈ కేసులో ప్రధాని నరేంద్రమోడీ, ఉత్తర్ ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ పేర్లను చెప్పాలని, ఏటీఎస్ తనను చిత్రహింసలకు గురిచేసి, బలవంతం చేసిందని ఆమె ఆరోపించారు. వీరి పేర్లు చెబితే మిమ్మల్ని కొట్టమని చెప్పేవారని, వారి ప్రధాన లక్ష్యం తనను హింసించడమే అని ఠాకూర్ శనివారం విలేకరులతో అన్నారు. తనను చట్టవిరుద్ధంగా 13 రోజులు ఉంచారని, వారి కస్టడీలో 24 రోజుల పాటు హింసించారని అన్నారు.
Also Read
- Supreme Court: సీజేపీకి సుప్రీంకోర్టులో ఎదురు దెబ్బ.. ఉద్యమంపై ప్రధాన న్యాయమూర్తి సంచలన వాఖ్యలు..
- CJP Protest: ఉద్యమం ఆగదు.. 4 ప్రధాన డిమాండ్లను ప్రకటించిన సీజేపీ!
- Maruti Suzuki: బిగ్ అలర్ట్.. కారు కొనాలనుకుంటే ఇప్పుడే కొనేయండి.. భారీగా పెరగనున్న ధరలు..
- Preity Zinta Support Student Protests: విద్యార్థుల ఉద్యమానికి మద్దతు.. ప్రీతి జింటా చేసిన వ్యాఖ్యలు వైరల్
Read Also: PM Modi: “బ్రహ్మోస్ క్షిపణి” శబ్ధం వింటే పాకిస్తాన్కు నిద్రపట్టదు..
ఇది కాంగ్రెస్ కుట్ర, ఇది ఇప్పుడు బహిర్గతమైంది. సత్యం ఎల్లప్పుడూ గెలుస్తుంది. ఈ సారి కూడా అది గెలిచింది. భారతదేశానికి ప్రాథమిక స్తంభాలు అయిన సాధువులు, ఆర్ఎస్ఎస్, సైన్యాన్ని కాంగ్రెస్ లక్ష్యంగా చేసుకుంటుంది’’ అని ఆమె ఆరోపించింది. భవిష్యత్తులో దేశం కోసం చేయగలిగిందంతా చేస్తానని, మొత్తం కేసును కాంగ్రెస్ తప్పుగా బనాయించిందని, ఈ కేసు నిరాధారమైందని, కాంగ్రెస్ ఎల్లప్పుడూ ఉగ్రవాదుల్ని గౌరవంగా చూస్తోందని, కాంగ్రెస్ దేశాన్ని ప్రేమించే పార్టీగా మారదు అని ఠాకూర్ అన్నారు.
ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు 2008 మాలేగావ్ పేలుళ్ల కేసులో ఏడుగురు నిందితులను నిర్దోషులుగా విడుదల చేసింది. ప్రాసిక్యూషన్ ఈ కేసును సహేతుకమైన సందేహాలను నిరూపించడంలో విఫలమైందని పేర్కొంది. ఈ కేసులో ప్రజ్ఞా సింగ్ ఠాకూర్, మేజర్ (రిటైర్డ్) రమేష్ ఉపాధ్యాయ, సుధాకర్ చతుర్వేది, అజయ్ రహిర్కర్, సుధాంకర్ ధర్ ద్వివేది (శంకరాచార్య), సమీర్ కులకర్ణి సహా నిందితులను నిర్దోషులుగా విడుదల చేసినట్లు కోర్టు పేర్కొంది. అంతేకాకుండా, బాధిత కుటుంబాలకు పరిహారం అందించాలని, మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షలు, గాయపడిన వారికి రూ. 50,000 చెల్లించాలని కూడా కోర్టు మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. సెప్టెంబర్ 29, 2008 నాటిది, మాలేగావ్ నగరంలోని భిక్కు చౌక్లోని ఒక మసీదు సమీపంలో మోటార్సైకిల్లో ఉంచిన బాంబు పేలి ఆరుగురు మరణించారు. 95 మంది గాయపడ్డారు.
తాజావార్తలు
-
Supreme Court: సీజేపీకి సుప్రీంకోర్టులో ఎదురు దెబ్బ.. ఉద్యమంపై ప్రధాన న్యాయమూర్తి సంచలన వాఖ్యలు..
-
Hyderabad: ACBకి చిక్కిన మరో అవినీతి అధికారి.. భారీ మొత్తంలో ఆస్తులు గుర్తింపు.!
-
David Warner: డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికిన స్టార్ క్రికెటర్.. నేరం అంగీకారం.. శిక్షపై ఉత్కంఠ..!
-
CJP Protest: ఉద్యమం ఆగదు.. 4 ప్రధాన డిమాండ్లను ప్రకటించిన సీజేపీ!
-
Karimnagar: అర్ధరాత్రి దొంగల బీభత్సం.. కత్తులు, తుపాకులతో బెదిరించి.. రూ. 50 లక్షలు అపహరణ.!
ట్రెండింగ్
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Light Flip 5G Phone: సోషల్ మీడియా లేని 5G ఫోన్.. 50MP కెమెరాతో Light Flip కొత్త కాన్సెప్ట్.!
-
10 రోజుల బ్యాటరీ, 80+ స్పోర్ట్స్ మోడ్లు.! స్క్రీన్ లేకుండానే హెల్త్ ట్రాకింగ్.. Garmin CIRQA స్మార్ట్ బ్యాండ్ లాంచ్.!
-
OLED డిస్ప్లే, RTX 5090 GPUతో పవర్ఫుల్ పనితీరుతో Dell కొత్త Alienware గేమింగ్ ల్యాప్టాప్లు లాంచ్..! ఫీచర్స్, ధరలు ఇలా..!
-
Best Camera Phones: DSLRకు పోటీగా ఫొటోగ్రఫీ అనుభవం..! బెస్ట్ కెమెరా ఫోన్ల లిస్ట్ ఇదిగో..!