JD Vance: ‘‘ ప్రధాని మోడీని చూస్తే నాకు అసూయ’’.. యూఎస్ ఉపాధ్యక్షుడి సంచలన వ్యాఖ్యలు..
- ‘‘ప్రధాని మోడీని చూస్తే నాకు అసూయ’’..
- ఆయన అప్రూవల్ రేటింగ్ కారణం..
- అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ కీలక వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
JD Vance: అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ భారత పర్యటనలో ఉన్నారు. ఆయన సతీమణి భారత సంతతికి చెందిన ఉషా వాన్స్, పిల్లలతో కలిసి భారత్ వచ్చారు. అమెరికా ఉపాధ్యక్షుడు, భారత సంతతికి చెందిన సెకండ్ లేడీ ఉషా చిలుకూరి, వారి ముగ్గురు పిల్లలు – కుమారులు ఇవాన్, వివేక్ మరియు కుమార్తె మిరాబెల్ నాలుగు రోజుల భారతదేశ పర్యటన కోసం సోమవారం ఉదయం ఢిల్లీకి చేరుకున్నారు.
ఇదిలా ఉంటే, ఈ పర్యటనలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ నాయకత్వంపై ఆయన ప్రశంసలు కురిపించారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ.. ఆయనను ‘‘ప్రత్యేక వ్యక్తి’’గా అభివర్ణించారు. ప్రధాని మోడీకి ఉన్న ‘‘అప్రూవల్ రేటింగ్’’ తనను అసూయపడేలా చేస్తుందని జేడీ వాన్స్ అన్నారు.
Also Read
Read Also: Priyadarshi : రివ్యూలు రాయొద్దని చెప్పడం కరెక్ట్ కాదు.. స్పందించిన ప్రియదర్శి
జైపూర్లో జరిగిన ఒక కార్యక్రమంలో జేడీ వాన్స్ పాల్గొన్నారు. భారతదేశం-అమెరికా ఇంధన సంబంధాల గురించి మాట్లాడుతూ, ప్రధాన మంత్రి భారతదేశం కోసం పోరాడే ‘‘కఠినమైన చర్చించే వ్యక్తి’’, ‘‘కఠినమైన సంధానకర్త’’ అని అన్నారు. ప్రధాని మోడీ అమెరికన్ వైస్ ప్రెసిడెంట్ కోసం సోమవారం విందు ఏర్పాటు చేశారు. ‘‘ నేను నిన్న రాత్రి ప్రధాని మోడీతో, మీ ప్రజామోదం నాకు అసూయను కలిగిస్తుంది అని చెప్పాను’’ అని వెల్లడించారు. తన కుమారుడు ఇవాన్ విందులోని ఆహారాన్ని ఎంతో ఇష్టపడ్డాడని, భారతదేశంలో నివసించాలని అనుకుంటున్నాడని జేడీ వాన్స్ చెప్పారు.
అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ‘‘పరస్పర సుంకాల’’ విధింపు నేపథ్యంలో భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందంపై చర్చలు జరుగుతున్నాయి. సరిగ్గా ఈ సమయంలోనే ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ భారత్ పర్యటనకు రావడం గమనార్హం.
తాజావార్తలు
-
CM Vijay: రాజీవ్గాంధీ హంతకుడికి సీఎం విజయ్ నివాళి.. రాజకీయ దుమారం రేపుతోన్న వ్యవహారం
-
Dragon : 4 నిమిషాల రన్ టైంతో ఎన్టీఆర్ ‘డ్రాగన్’ గ్లింప్స్.. ప్రశాంత్ నీల్ మాస్టర్ ప్లాన్ ఇదే!
-
Telangana Cabinet : ఈనెల 21న తెలంగాణ కేబినెట్ సమావేశం
-
Siddipet: బీరు తాగబోతే షాక్.. బాటిల్లో కండోమ్ ప్యాకెట్ ప్రత్యక్షం..
-
Peddi: షేక్ చేస్తున్న పెద్ది ట్రైలర్
ట్రెండింగ్
-
Tree Trimming Job: చెట్లు కొడితే చాలు.. గంటకు రూ. 49,000.. ఎక్కడంటే.?
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్లో లాంచ్.. ధర ఎంతంటే.?
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!