Mahua Moitra: దుబాయ్ నుంచి 47 సార్లు లాగిన్.. మహువా మోయిత్రా కేసులో కీలక విషయాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mahua Moitra: ‘‘ క్యాష్ ఫర్ క్వేరీ ’’ కేసులో మహువా మోయిత్రాపై తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి. ప్రధాని నరేంద్రమోడీని విమర్శించేందుకు అదానీ వ్యవహారాన్ని అస్త్రంగా ఉపయోగించుకున్నారని, పార్లమెంట్లో అదానీపై ప్రశ్నలు అడిగేందుకు వ్యాపారవేత్త దర్శన్ హీరానందానీ నుంచి డబ్బులు తీసుకుందని బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే ఆరోపించారు. అయితే ఈ కేసులో పార్లమెంట్ ఎథిక్స్ కమిటీకి ఇప్పటికే హీరానందానీ అఫిడవిట్ సమర్పించారు. మహువా తన దగ్గర నుంచి గిఫ్టులు తీసుకున్నారని తెలిపారు.
Read Also: Manchu Manoj: అంబానీతో మంచు మనోజ్ దంపతులు.. పిక్ వైరల్
Also Read
- Dharmendra Pradhan: నీట్పై చర్చకు సిద్ధం.. విద్యార్థుల పేరుతో రాజకీయాలు వద్దు రాహుల్..
- Indus Waters Treaty: సింధు జలాల ఒప్పందంపై పాకిస్తాన్కు కెనడా షాక్..
- Congress: బంగ్లాదేశ్ ఉదాహరణతో కాంగ్రెస్కు కేంద్రం స్ట్రాంగ్ వార్నింగ్.. ప్రధాని నివాసం ముందు నిరసనపై ఫైర్
- Rahul Gandhi: రాహుల్గాంధీని ఈడ్చుకెళ్లిన పోలీసులు.. ముక్కుకు గాయం?
ఇదిలా ఉంటే ఈ కేసులో రేపు పార్లమెంట్ ఎథిక్స్ కమిటీ ముందు మహువా మోయిత్రా హాజరుకాబోతున్నారు. తన పార్లమెంట్ లాగిన్ వివరాలను మోయిత్రా ఇతరులకు అందించిందని, దాంతో దుబాయ్ నుంచి వేరే వ్యక్తులు ప్రశ్నలు అడిగినట్లు నిషికాంత్ దూబే ఆరోపించిన నేపథ్యంలో ఎథిక్స్ కమిటీ ఇప్పటికే మహువాకు సంబంధించిన విదేశీ వ్యవహారాలు, కేంద్ర హోం, ఐటీ మంత్రిత్వ శాఖల నుంచి నివేదికలు అందుకున్నట్లు సమచారం. విశ్వసనీయ వర్గాలు తెలిపిన దాని ప్రకారం ఆమె తన పార్లమెంట్ అకౌంట్ దుబాయ్ నుంచి 47 సార్లు వినియోగించినట్లు తెలుస్తోంది. ఎథిక్స్ కమిటీకి హాజరయ్యే ముందు రోజే ఈ వివరాలు వెల్లడయ్యాయి.
మోయిత్రా తను పార్లమెంట్ అకౌంట్ ద్వారా దర్శన్ హీరానందానీ కొరకు ప్రశ్నలు అడిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తన లాగిన్ వివరాలను స్నేహితుడైన హీరానందానీతో పంచుకున్నట్లు ఇప్పటికే మోయిత్రా ఒప్పుకున్నారు, అయితే తాను డబ్బులు తీసుకున్నారనే విషయాన్ని కొట్టిపారేశారు. ఇదిలా ఉంటే బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే, మోయిత్రాపై ఆరోపణలు పెంచారు. హీరానందానీ స్థలం నుంచే 47 సార్లు లాగిన్ అయినట్లు ఆరోపించారు. ఈ వార్తలు నిజమైతే దేశంలోని ఎంపీలంతా మహువా అవినీతికి వ్యతిరేకంగా నిలబడాలని, ఆమె హీరానందానీ కొరకు ప్రశ్నలు అడిగారని, పెట్టుబడిదారుల స్వార్థ ప్రయోజనాల కోసం ప్రోత్సహించారని ఎక్స్(ట్విట్టర్)లో మండిపడ్డారు.
తాజావార్తలు
-
Dharmendra Pradhan: నీట్పై చర్చకు సిద్ధం.. విద్యార్థుల పేరుతో రాజకీయాలు వద్దు రాహుల్..
-
CKYC: బ్యాంకు కస్టమర్స్ కు అలర్ట్.. మీ CKYC నంబర్ తెలుసా?.. ఇలా తెలుసుకోండి
-
Jana Nayagan : విజయ్ ముందు భారీ టార్గెట్స్.. ఫస్ట్ డే వసూళ్లలో రజనీకాంత్ డామినేట్
-
Astrology: జూలై 22 బుధవారం దినఫలాలు.. ఈ రాశివారికి అనుకోని శుభవార్త..!
-
Shamshabad : ఇండిగో ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ అత్యాచారయత్నం..!
ట్రెండింగ్
-
Cleaning Hacks : తుప్పు పట్టిన ఇనుప అల్మారా కొత్తదానిలా మెరవాలా? ఈ 4 చిట్కాలు చాలు.!
-
Remote Cleaning : వర్షాల్లో టీవీ రిమోట్ పనిచేయడం లేదా? ఈ 4 ట్రిక్స్తో కొత్తదానిలా మారుతుంది.!
-
Food Storage Tips : వంట నూనె ఇలా నిల్వ చేస్తే విషమే.! ఈ 5 సంకేతాలు కనిపిస్తే వెంటనే పారేయండి
-
Kitchen Tips : పుట్టగొడుగులు 2 రోజుల్లో పాడవుతున్నాయా? ఈ సీక్రెట్ ట్రిక్తో వారాల పాటు ఫ్రెష్.!
-
Sanju Samson: రోహిత్ భాయ్ సారీ.. నిన్ను నేను నమ్మలేదు.. సంజు ఆసక్తికర వ్యాఖ్యలు!