Rahul Gandhi: ఒకవైపు మహాత్మా గాంధీ, మరో వైపు గాడ్సే..ఎంపీ ప్రచారంలో రాహుల్ గాంధీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rahul Gandhi: మధ్యప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీకి మరికొన్ని రోజుల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. గత దశాబ్ధకాలం నుంచి ఆ రాష్ట్రంలో బీజేపీనే అధికారంలో ఉంటోంది. అయితే ఈసారి కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి శాయశక్తుల ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. కాంగ్రెస్, బీజేపీ మధ్య పోరును మహాత్మా గాంధీ, గాడ్సేల మధ్య పోరుగా అభివర్ణించారు.
రాహుల్ గాంధీ బీజేపీ పార్టీని మహత్మా గాంధీ హంతకుడు నాథురామ్ గాడ్సేతో పోల్చారు. ఎంపీలోని షాజాపూర్ లో జరిగిన ‘జన్ ఆక్రోశ్’ ర్యాలీలో ఆయన మాట్లాడారు. ఇది రెండు సిద్ధాంతాల మధ్య పోరాటమని, ఓ వైపు కాంగ్రెస్ పార్టీ ఉంలటే మరోవైపు బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఉన్నాయని, ఒక వైపు మహాత్మా గాంధీ ఉంటే మరో వైపు గాడ్సే ఉన్నారని ఆయన అన్నారు.
Also Read
- Explainer: రెస్టారెంట్ కిచెన్లో బొద్దింకల కాపురం..ఈగల సంసారం.. మీరు తింటున్నది ఇదే!
- Jharkhand Student Protest: జార్ఖండ్లో ఉద్రిక్తంగా మారిన నిరుద్యోగుల పోరు.. అర్ధరాత్రి పోలీసులు ఎందుకు వచ్చారు?
- Air India Incident: గంజాయి సేవించి విమానం నడిపాడు.. డ్రగ్ టెస్టులో పైలెట్ ఫెయిల్.!
- IEA: మహిళలే మోడీని గెలిపించారు.. ఉజ్వల పథకంపై అంతర్జాతీయ ప్రశంసలు..
Read Also: Rk Roja: సీఎం జగన్ ను విమర్శిస్తే.. మర్యాద దక్కదు బ్రాహ్మణి..?
కాంగ్రెస్ సోదరభావం పెంచితే, బీజేపీ ద్వేషాన్ని వ్యాప్తి చేస్తోందని ఆయన ఆరోపించారు. బీజేపీ ఎక్కడికెళ్లినా ద్వేషాన్ని వ్యాప్తి చేస్తుందని, మధ్యప్రదేశ్ యువత, రైతులు వారిని బీజేపీని అసహ్యించుకుంటున్నారని, ప్రజలకు వారు ఏం చేశారు, ప్రజల నుంచి వారు అదే పొందుతారు అని రాహుల్ గాంధీ అన్నారు. భారత్ జోడో యాత్ర చేస్తున్న సమయంలో మధ్యప్రదేశ్ కి చెందిన రైతులు తనను కలిశారని, వారు నాతో చాలా చెప్పారని, ఈ రాష్ట్రంలో బీజేపీ చేసిన అవినీతి దేశంలో ఎక్కడా జరగలేదని రాహుల్ ఆరోపించారు. రైతులు పండించిన పంటకు సరైన ధర లభించట్లేదని, ఛత్తీస్గఢ్ లో బియ్యానికి కాంగ్రెస్ ప్రభుత్వం రూ. 2500 ఇస్తోందని ఆయన అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కులగణన నిర్వహిస్తామని అన్నారు.
ఈ ఏడాది చివరలో మధ్యప్రదేశ్, తెలంగాణ, చత్తీస్గఢ్, రాజస్థాన్, మిజోరాం రాష్ట్రాల ఎన్నికలు జరగబోతున్నాయి. అయితే 2024 లోక్సభ ఎన్నికల ముందు వస్తున్న ఈ అసెంబ్లీ ఎన్నికలు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు కీలకం కానున్నాయి. దీంతో ఆయా రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చేందుకు ఇరు పార్టీలు తీవ్రంగా కృషి చేస్తున్నాయి.
తాజావార్తలు
-
Tirupati Crime: వారంలో ప్రియుడు వివాహం..! ప్రియురాలు ఆత్మహత్య
-
Srinu Vaitla : జార్జ్క్రిష్తో కంబ్యాక్ ఇచ్చేందుకు శ్రీనువైట్ల భారీ స్కెచ్
-
Mallika Sherawat: ‘టామ్ క్రూజ్కు నాపై క్రష్’.. వీడియో కూడా ఉంది.. 49 ఏళ్ల మల్లికా కామెంట్స్ వైరల్
-
Bhadradri Kothagudem: తీవ్ర విషాదం.. వేటగాళ్ల విద్యుత్ ఉచ్చుకు ఫారెస్ట్ ఆఫీసర్ బలి!
-
Mecca Pact Explained: పాకిస్థాన్ పాచికలు చెల్లవు.. మక్కా ఒప్పందం వెనుక ఉన్న అసలు రహస్యం ఇదే!
ట్రెండింగ్
-
4K 180Hz డిస్ప్లేతో 55, 65, 75 అంగుళాల్లో Hisense UR8S MiniLED TVలు లాంచ్..!
-
9,070mAh బ్యాటరీ, IP69 రేటింగ్, AMOLED డిస్ప్లేతో REDMI K100 Pro Max లాంచ్..!
-
200MP ట్రిపుల్ కెమెరా సెటప్, 8,580mAh బ్యాటరీ, 185Hz డిస్ప్లేతో REDMI K100 Pro లాంచ్.. ధర ఎంతంటే?
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!