Maharastra: ఔరంగాజేబు సమాధి మూసివేత… జ్ఞానవాపి విచారణ సమయంలో కీలక నిర్ణయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశవ్యాప్తంగా జ్ఞానవాపి మసీదు వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. వారణాసి కోర్ట్ వీడియో సర్వేకు అనుమతి ఇవ్వడంతో వివాదం మరింతగా ముదిరింది. ఈ నెల 14 నుంచి 16 వరకు మసీదులో కోర్ట్ నియమించిన కమిషనర్లు వీడియోగ్రఫీ సర్వే చేశారు. ఈ సర్వేను ఆపేయాలంటూ జ్ఞానవాపి మసీదు కమిటీ సుప్రీం కోర్ట్ ను ఆశ్రయించింది. సర్వేలో భాగంగా మసీదు ‘ వాజుఖానా’ లోని బావిలో శివలింగం బయటపడినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో సుప్రీం కోర్ట్, శివలింగం బయటపడిన ప్రదేశానికి భద్రత కల్పించాల్సిందిగా వారణాసి జిల్లా కలెక్టర్ కు ఆదేశాలు జారీ చేసింది. ఇదే విధంగా ముస్లింలు ప్రార్థనలు చేసుకోవడానికి అనుమతి ఇస్తూ కీలక ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే.
ఇదిలా ఉంటే ఈ రోజు మరోసారి జ్ఞానవాపి మసీదు సర్వేపై సుప్రీంలో విచారణ జరిగింది. మే 20 వరకు సుప్రీం కోర్ట్ విచారణ జరిపే వరకు వారణాసి కోర్ట్ విచారణను నిలిపివేయాలంటూ గురువారం ఆదేశాలు జరీ చేసింది. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు మళ్లీ సుప్రీం కోర్ట్ విచారణ చేపట్టనుంది. ఇదిలా ఉంటే కోర్ట్ ఆదేశాలు వెల్లడించిన తర్వాత మహారాష్ట్ర సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఐదు రోజుల పాటు ఔరంగజేబు సమాధిని మూసేయాలని నిర్ణయం తీసుకుంది.
Also Read
- New IRCTC Website: శుభవార్త చెప్పిన రైల్వే మంత్రి.. జులై 15 నాటికి అందుబాటులోకి కొత్త ఐఆర్సీటీసీ వెబ్సైట్..
- Ahmedabad Plane Crash: అహ్మదాబాద్ ప్రమాదంపై కొత్త డిమాండ్.. పైలట్ల సంఘాలు నిరసన
- Saayoni Ghosh: గెటప్ మార్చేసిన టీఎంసీ రెబల్ ఎంపీ సయానీ ఘోష్.. వీడియో వైరల్
- Bengal: అసాంఘిక శక్తులకు అడ్డగా బెంగాల్ స్కూల్స్.. భారీగా నగదు, కండోమ్స్ స్వాధీనం
ప్రస్తుతం కోర్ట్ పరిధిలో జ్ఞానవాపి మసీదు వివాదం నడుస్తోంది. ఈ సమయంలో ఎలాంటి శాంతి భద్రతల సమస్య తలెత్తకుండా జౌరంగాబాద్ ఖుల్తాబాద్ లో ఉన్న ఔరంగజేబు సమాధికి తాళం వేశారు. దీంతో పాటు సెక్యురిటీ గార్డులను ఏర్పాటు చేశారు. ఆర్కియాలజిక్ సర్వే ఆఫ్ ఇండియా, మసీదు కమిటీ సమాధికి తాళం వేశాయి. ఇటీవల మహారాష్ట్ర నవ నిర్మాణ్ సేన అధికార ప్రతినిధి గజానన్ కాలే స్మారకాన్ని ధ్వంసం చేయాలని అన్నారు. ఈ నేపథ్యంలోనే ఐదు రోజుల పాటు ఔరంగజేబు సమాధిని మూసేస్తున్నట్లు మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ తెలిపారు. అయితే మొగల్ పాలకుడు ఔరంగజేబ్ పాలనలోనే జ్ఞానవాపి ఆలయాన్ని కూల్చి మసీదుగా మార్చారని చరిత్ర చెబుతోంది.
తాజావార్తలు
-
Story Board: ఆకాశమే హద్దుగా పెరిగిన బంగారం ఎందుకు తగ్గుతుంది.. ప్రధాని పిలుపు పని చేసిందా?
-
APL 2026: ఉత్కంఠ పోరులో అమరావతి అద్భుత విజయం
-
Vaibhav’s Father: ‘నేల తల్లిని తాకట్టు పెట్టి… నెత్తురు పంచుకుపుట్టిన బిడ్డను క్రికెట్ శిఖరాలకు చేర్చిన నాన్న’..
-
Pentagon Lockdown: పెంటగాన్లో హై అలర్ట్.. ప్రమాదకర పదార్థాల హెచ్చరికతో లాక్డౌన్.. తరలింపు
-
Off The Record: బోధన్లో బీఆర్ఎస్కు షాక్! షకీల్ ఎక్కడ?.. క్యాడర్ ఎందుకు అసహనం వ్యక్తం చేస్తోంది?
ట్రెండింగ్
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!