Maharashtra Political Crisis: నేడు స్పీకర్ ఎన్నిక.. రేపు షిండే బలనిరూపణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం దాదాపుగా ముగిసినట్లే కనిపిస్తోంది. శివసేన రెబెల్ నేత ఏక్ నాథ్ షిండే, బీజేపీ మద్దతుతో సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. మాజీ ముఖ్యమంత్రి బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ ఉప ముఖ్యమంత్రిగా ప్రభుత్వంలో చేరారు. అయితే నేడు( ఆదివారం) మహారాష్ట్ర స్పీకర్ ఎన్నికలు జరగబోతున్నాయి. జూలై 3, 4 తేదీల్లో మహారాష్ట్ర అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. స్పీకర్ ఎన్నికతో పాటు జూలై 4న షిండే ప్రభుత్వం బలనిరూపణ పరీక్షను ఎదుర్కోబోతోంది.
గత ఏడాది కాలంగా మహారాష్ట్ర స్పీకర్ పోస్ట్ ఖాళీగా ఉంది. మహావికాస్ అఘాడీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ నేత నానా పటోలే స్పీకర్ గా ఎన్నికయ్యారు. అయితే ఆయన మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్ష పదవి చేపట్టడంతో ఆ పదవికి రాజీనామా చేశారు. తాజాగా బలపరీక్ష ముందు ఈ రోజు స్పీకర్ ను ఎన్నుకోనుంది మహారాష్ట్ర అసెంబ్లీ. ఇప్పటికే స్పీకర్ పదవి కోసం షిండే, బీజేపీ ప్రభుత్వం ఎమ్మెల్యే రాహుల్ నర్వేకర్ పేరును ప్రతిపాదించింది. నర్వేకర్ శుక్రవారం తన నామినేషన్ దాఖలు చేశాడు. ఇక శివసేన ఉద్ధవ్ వర్గం నుంచి ఎమ్మెల్యే రాజన్ సాల్వీ శనివారం నామినేషన్ దాఖలు చేశారు.
Also Read
- Rajya Sabha 2026: రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదల.. ఆంధ్రప్రదేశ్ లో నాలుగు స్థానాలు
- Tamil Nadu Govt: విజయ్ సర్కార్ మరో సంచలన నిర్ణయం.. 8,000 కొత్త ఆస్పత్రులకు గ్రీన్ సిగ్నల్..!
- Cockroach Janta Party: ఎంతకీ వదలని కాక్రోజ్.. ఎక్స్ అకౌంట్ బ్లాక్ చేసిన వెంటనే కొత్త అకౌంట్ ప్రత్యక్షం!
- Cabinet Meeting: ప్రధాని మోడీ నేతృత్వంలో 4.5 గంటల కేబినెట్ భేటీ.. ఏం చర్చించారంటే..?
ఇదిలా ఉంటే మహారాష్ట్రలో అధికారం చేపట్టిన ఏక్ నాథ్ షిండే ప్రభుత్వం సోమవారం బలనిరూపణ పరీక్షను ఎదుర్కోనుంది. శివసేనకు చెందిన 55 మంది ఎమ్మెల్యేలలో 39 మంది ఎమ్మెల్యేలతో పాటు ఏడుగురు స్వతంత్ర ఎమ్మెల్యేల మద్దతుతో పాటు బీజేపీ, ఇతర స్వతంత్ర ఎమ్మెల్యేలతో 160కి పైగా మెజారిటీ తమకు ఉందని షిండే అన్నారు. దీంతో షిండే ప్రభుత్వం సులభంగానే బలనిరూపణలో నెగ్గే అవకాశం ఉంది.
నిన్న రాత్రి గోవాలో ఉన్న తన వర్గం ఎమ్మెల్యేలతో ముంబై చేరుకున్నారు సీఎం ఏక్ నాథ్ షిండే. సీఎంగా ఎన్నికైన తర్వాత తన వర్గాన్ని గోవాలో కలిసి మంతనాలు సాగించారు ఏక్ నాథ్ షిండే. తాజాగా వీరంతా ముంబై చేరుకున్న తరువాత శనివారం అర్థరాత్రి సీఎం ఏక్ నాథ్ షిండే, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహాల గురించి చర్చించనట్లు తెలిసింది.
తాజావార్తలు
-
Harish Rao: బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఫ్యూచర్ సిటీ రద్దు చేస్తాం.. హరీష్రావు కీలక వ్యాఖ్యలు..
-
KTR: రైతుల కష్టాలపై కేటీఆర్ ఫైర్.. ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు
-
Natural Home Cooling Tips: కూలర్, ఏసీ లేకుండానే కూల్ కూల్గా ఇల్లు.. ! మన తాతముత్తాతలు ఉపయోగించిన చిట్కాలు ఇవే..!
-
Peddi : చరణ్ ‘పెద్ది’ కోసం రంగంలోకి బాలయ్య..!
-
Xiaomi 17 Max: 8000mAh బ్యాటరీ, 200MP లైకా కెమెరాతో.. షియోమీ 17 మ్యాక్స్ విడుదల
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!