Uddhav Thackeray: ‘‘ఆపరేషన్ లోటస్’’.. మోడీని కలవనున్న ఉద్ధవ్ ఎంపీలు..
- ఉద్ధవ్ ఠాక్రేకి భారీ షాక్ తప్పదా..?
- ప్రధాని మోడీతో ఠాక్రే వర్గం ఎంపీల భేటీ..
- శరద్ పవార్ ఎంపీలు కూడా టచ్లో ఉన్నట్లు వార్తలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Uddhav Thackeray: మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ కూటమి ‘‘మహాయుతి’’ ఘన విజయం సాధించి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. మొత్తం 288 అసెంబ్లీ స్థానాలకు గానూ కూటమి 233 స్థానాలను కైవసం చేసుకుంది. బీజేపీ 132 సీట్లతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలిచింది. విపక్ష కూటమి ‘‘మహా వికాస్ అఘాడీ(ఎంవీఏ)’’ దారుణ పరాజయం పాలైంది. ఈ కూటమి కేవలం 46 సీట్లకు మాత్రమే పరిమితమైంది. ఉద్ధవ్ శివసేన 20, ఎన్సీపీ శరద్ పవార్ 10, కాంగ్రెస్ 16 సీట్లను గెలుచుకుంది.
అయితే, ఈ పరాజయం తర్వాత విపక్ష కూటమి ఎంపీలు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి వైపు చూస్తున్నారు. బీజేపీ ‘‘ఆపరేషన్ లోటస్’’ ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఉద్ధవ్ ఠాక్రేకి చెందిన శివసేన (యూబీటీ) ఎంపీలు ప్రధాని నరేంద్రమోడీని కలవనున్నారు. పార్లమెంట్లోని ప్రధాని కార్యాలయంలో ఈ సమావేశం జరిగే అవకాశం ఉంది. డిసెంబర్ 16న ప్రధాని మోడీని వీరంతా కలవనున్నారు.
Also Read
- West Bengal: మమతకు భారీ షాక్.. 80 మందిలో 20 మంది ఎమ్మెల్యేలే హాజరు!
- Abhishek Banerjee:అభిషేక్ దాడి వెనుక బీజేపీనా? టీఎంసీనా? బెంగాల్లో కొత్త రాజకీయ తుఫాన్
- West Bengal: దోచుకున్న డబ్బు తిరిగి ఇచ్చేస్తాం.. "కట్మనీ"పై టీఎంసీలో భయం..
- Brahmos: చైనాకు బిగ్ షాక్.. వియత్నాం తర్వాత ఇండోనేషియా చేతుల్లోకి బ్రహ్మోస్..
Read Also: Pawan Kalyan: ఐక్యమత్యం పై పవన్ కళ్యాణ్ ట్వీట్.. అల్లు అర్జున్ అరెస్ట్ గురించేనా?
గత వారం, ఠాక్రే వర్గం ఎంపీలు ప్రధాని మోడీ అపాయింట్మెంట్ కోరగా, మంజూరు కాలేదు. గురువారం కూడా వారి అభ్యర్థన తిరస్కరించబడింది. అయితే, డిసెంబర్ 16 సోమవారం రోజు ప్రధానితో వీరి భేటీ షెడ్యూల్ అయింది. అయితే, ఈ సమావేశం ఖచ్చిత ఉద్దేశ్యం తెలియకున్నా.. ఏదో పెద్దగా జరగబోతుందని తెలుస్తోంది. మహారాష్ట్ర ఎన్నికల ఓటమి తర్వాత వీరంతా మోడీని కలవనుండటం సర్వత్రా ఆసక్తి నెలకొంది.
ఇప్పుడున్న పరిస్థితుల్లో కేంద్రంలోని , ఇటూ మహారాష్ట్రలోనూ బీజేపీనే అధికారంలో ఉండటం, ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఉద్ధవ్ ఠాక్రే వర్గం ప్రభావం చూపించపోవడాన్ని పరిశీలిస్తే, వీరంతా బీజేపీ సర్కార్కి కేంద్రంలో మద్దతు తెలిపే అవకాశం ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు శరద్ పవార్ ఎన్సీపీ ఎంపీలు కూడా బీజేపీతో టచ్లో ఉన్నారనే వార్తుల వినిపిస్తున్నాయి.
తాజావార్తలు
-
RCB vs GT Final: గుజరాత్ బ్యాటింగ్.. బెంగళూరు బౌలింగ్.. గుజరాత్ టీంలో కీలక మార్పులు..
-
Kodak QLED SE 80 cm: తక్కువ ధరలో QLED అనుభవం.. Kodak స్మార్ట్ టీవీపై రూ. 10 వేల డిస్కౌంట్
-
West Bengal: మమతకు భారీ షాక్.. 80 మందిలో 20 మంది ఎమ్మెల్యేలే హాజరు!
-
Online Cybersecurity Course: ఫ్రాడ్గాళ్లకు చెక్.. ఈ 150నిమిషాల ఫ్రీ కోర్సు నేర్చుకుంటే మీ జేబు చాలా సేఫ్!
-
IPL 2026 Prize Money: ఛాంపియన్కు రూ.20 కోట్లు.. మరి SRH, రాజస్థాన్ జట్లకు దక్కిన ప్రైజ్ మనీ ఎంతంటే?
ట్రెండింగ్
-
Wash Basin Blocked : వాష్ బేసిన్ బ్లాక్ అయిందా.? ప్లంబర్ అవసరం లేకుండా ఈ చిట్కాలతో నిమిషాల్లో క్లియర్ చేయండి.!
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!