Congress: ఇండియా కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ‘రామ మందిరాన్ని’’ శుద్ధి చేస్తాం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Congress: ఇండియా కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అయోధ్యలో రామ మందిరాన్ని శుద్ధి చేస్తామని మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నానా పటోలే చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. అధికారంలోకి రాగానే నలుగురు శంకరాచార్యులచే రామమందిరాన్ని శుద్ధి చేస్తామని చెప్పారు. ఆలయ నిర్మాణంలో ప్రధాని నరేంద్రమోడీ ప్రోటోకాల్కి విరుద్ధంగా వ్యవహరించారని, ఇండియా కూటమి ప్రభుత్వం వాటిని సరిదిద్దుతుందని నానా పటోలే అన్నారు. ఆలయ నిర్మాణం పూర్తికాలేదని, జనవరి 22న జరిగిన రామ మందిర ప్రతిష్టాపన కార్యక్రమానికి కాంగ్రెస్ హాజరుకాలేదు.
Read Also: PM Modi: పాక్తో యుద్ధం తర్వాత 93 వేల సైనికులు సరెండర్ అయ్యారు
Also Read
- PM Modi: భారత్-నార్వే ప్రపంచ శాంతిని కోరుకుంటున్నాయి.. ఉగ్రవాదం విషయంలో రాజీపడబోమన్న మోడీ
- CM Vijay: రాజీవ్గాంధీ హంతకుడికి సీఎం విజయ్ నివాళి.. రాజకీయ దుమారం రేపుతోన్న వ్యవహారం
- Putin: మరోసారి భారత్ టూర్కు పుతిన్.. ఎప్పుడంటే..!
- PM Modi: ఐస్లాండ్ ప్రధాని క్రిస్ట్రాన్ మ్జోల్తో మోడీ భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై చర్చ
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అయోధ్య ఆలయంలో రామ్ దర్బార్ ఏర్పాటు చేస్తామని నానాపటోలే అన్నారు. ‘‘అక్కడ ఉంది రాముడి విగ్రహం కాదు, రామ్ లల్లా విగ్రహం. నరేంద్రమోడీ ఆలయ నిర్మాణంలో ప్రోటోకాల్కి విరుద్ధంగా వ్యవహరించారు. మేము దీనిని సరిదిద్దుతాం.’’ అని అన్నారు. నలుగురు శంకరాచార్యులు సరైన ఆచారాలు పాటించలేదని చెప్పారని అన్నారు. సనాతన ధర్మంలో ఎవరి కుటుంబంలో చావు సంభవిస్తే క్షౌరం చేయించుకుంటాము, కానీ ప్రధాని మోడీ అలా చేయలేదని అన్నారు.
నానా పటోలే వ్యాఖ్యలపై బీజేపీ నేతలు ధ్వజమెత్తుతున్నారు. హిందువుల ప్రయోజనాలను దెబ్బతీసేందుకు కాంగ్రెస్ పనిచేస్తోందని ఆరోపించారు. ‘‘సుప్రీంకోర్టులో అఫిడవిట్ ఇవ్వడం ద్వారా రాముడి ఉనికిని కాంగ్రెస్ పార్టీ సవాల్ చేసింది. రామసేతును సవాల్ చేశారు. రాముడు నిజమా కాదా.? అని ప్రశ్నలు అడిగేవారు’’ అని మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రామ మందిర అంశాన్ని కాంగ్రెస్ కావాలనే దారి మళ్లించిందని, అయితే సుప్రీంకోర్టు తీర్పు తర్వాతే బీజేపీ ప్రభుత్వం ఆలయ నిర్మాణాన్ని చేపట్టిందని అన్నారు.
తాజావార్తలు
-
PM Modi: భారత్-నార్వే ప్రపంచ శాంతిని కోరుకుంటున్నాయి.. ఉగ్రవాదం విషయంలో రాజీపడబోమన్న మోడీ
-
RR vs LSG: ప్లేఆఫ్ స్థానం కోసం రాజస్థాన్.. పరువు కోసం లఖ్నవూ సూపర్ జెయింట్స్.. గెలిచేదెవరో.?
-
Donald Trump : ‘మేక్ అమెరికా క్రిస్టియన్’.. అమెరికా రాజకీయాల్లో కొత్త ట్రెండ్.?
-
Airtel: ఎయిర్టెల్ వినియోగదారులకు అదిరే న్యూస్.. కేవలం రూ.449లకే మరో కొత్త సర్వీస్ అందుబాటులోకి..
-
CM Vijay: రాజీవ్గాంధీ హంతకుడికి సీఎం విజయ్ నివాళి.. రాజకీయ దుమారం రేపుతోన్న వ్యవహారం
ట్రెండింగ్
-
Tree Trimming Job: చెట్లు కొడితే చాలు.. గంటకు రూ. 49,000.. ఎక్కడంటే.?
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్లో లాంచ్.. ధర ఎంతంటే.?
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!