Black Magic: చనిపోయిన భర్త లేచొస్తాడు.. మంత్రగాడి మాయ
టెక్నాలజీ ఎంతగా పెరిగినా ఇంకా మూఢనమ్మకాల ఛట్రంనుంచి జనం బయటపడలేకపోతున్నారు. మంత్రాలకు చింతకాయలు రాలవని అందరికీ తెలుసు… అలాగే చనిపోయిన మనిషి మంత్రాలకు లేచొస్తాడా?.ఈ తరహా ఘరానా మోసం ఎన్టీఆర్ జిల్లా తోటచర్ల లో చోటు చేసుకుంది….చనిపోయిన భర్త లేచి వస్తాడు అనటంతో ఓ మంత్రాల మోసగాడికి 50 వేలు ఇచ్చి ఒప్పందం కుదుర్చుకుందో మహిళ. ఎన్టీఆర్ జిల్లా పెనుగ్రంచిపోలు మండలం తోటచర్ల గ్రామానికి చెందిన వెంకట్రావమ్మ భర్త సుధాకర్ నాలుగు నెలల క్రితం అనారోగ్యంతో చనిపోయాడు.
Minister Roja : ఆ మంత్రికి కారు ఎక్కడినుంచి వచ్చింది.? అందుకే సైలెంట్ అయ్యారా.?
Also Read
- AP Cabinet Meeting: రేపు ఏపీ కేబినెట్ కీలక భేటీ.. సమావేశంలో అభివృద్ధి ప్రాజెక్టులకు ఆమోదాలు.!
- AP Liquor Scam Case: లిక్కర్ కేసులో నిందితులకు హైకోర్టులో ఊరట..
- Chandrababu warning: పార్టీ నేతలకు చంద్రబాబు క్లాస్.. తప్పులు చేస్తే హెడ్లైన్స్లోకి వెళ్తారు అంటూ హెచ్చరిక
- Chandrababu: తెలుగు జాతి ఉన్నంత వరకు టీడీపీ ఉంటుంది.. కార్యకర్తలు ఎప్పుడూ మీసం మెలేస్తారు.. ఎవ్వరికీ తలవంచరు..
కటిక పేదరికంలో ఉన్న ఆమె, భర్త లేకున్నా చిన్నా చితక పనులు చేసుకుంటూ ఒంటరిగా జీవనం సాగిస్తోంది…ఈ క్రమంలో కొద్ది రోజుల క్రితం గుంటూరు జిల్లా పెద్దకూరపాడుకు చెందిన గోపి అనే మంత్రగాడు ఆమెకు మాయమాటలతో చనిపోయిన ఆమె భర్తను బ్రతికిస్తాను అని నమ్మబలికాడు. మంత్ర తంత్రాలతో చేసే ప్రత్యేక పూజతో చనిపోయిన సుధాకర్ లేచొస్తాడని…. గతంలో ఇలా ఎంతో మందిని బ్రతికించానని సుధాకర్ ను కూడా మళ్లీ బ్రతికించగలనని ఆమెను మెల్లగా ఉచ్చులోకి లాగాడు….శ్రావణ మాసం వచ్చేలోపు నుదుట బొట్టు పెట్టుకోవచ్చని,మళ్ళీ భర్తతో సంతోషమైన జీవితం గడపొచ్చని ఆమెకు ఆశలు పుట్టించాడు…ఆమెను ఎలాగైనా ఒప్పించి చనిపోయిన సుధాకర్ నాలుగు రోజుల్లో ఇంటికి వస్తాడని ఆమెతో ఒప్పందం కుదుర్చుకున్నాడా మాయగాడు.
మంత్రగాడు చెప్పిన మాయమాటలు నమ్మిన ఆమె భర్త తిరిగొస్తాడనే ఆశతో అతనితో బేరం కుదుర్చుకుంది..మంత్రాలు ,పూజలు చెయ్యటానికి మొత్తం 70 వేల రూపాయలు ఖర్చవుతుందన్నాడు. అంత మొత్తం చెల్లించలేనని….తన భర్తను ఎలాగైనా బ్రతికించి తీసుకుని రావాలని 50 వేల రూపాయలు ఇవ్వగలనని ఒప్పందం కుదుర్చుకుంది…దాంతో సరే అన్న మంత్రగాడు గోపి ఆమె ఇంట్లో తాంత్రిక పూజలు చేసినట్లు బిల్డప్ ఇచ్చి మంత్రాలు చదువుతూ.. ఏవేవో కట్టి 20 వేలు తీసుకుని నాలుగు రోజుల్లో నీ భర్త తిరిగి వస్తాడని వెళ్ళిపోయాడు….అలా వెళ్లిన అతను కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం మిగిన బ్యాలెన్స్ డబ్బుల 30వేల కోసం ఎలాగైనా వసూలు చేసుకుని రమ్మని రెడ్డయ్య అనే మరో మంత్రికుడిని పంపాడు….డబ్బులు వసూలు చెయ్యటానికి తోటచర్ల వచ్చిన ఆ మోసగాడు అడ్రస్ తెలియక అడ్డంగా బుక్ అయిపోయాడు.
ఆమె ఇంటి కోసం ఆ చుట్టుపక్కల పదే పదే తిరుగుతూ ఉండటంతో అనుమానం వచ్చిన గ్రామస్తులు అతన్ని పట్టుకుని గట్టిగా నిలదీశారు. దీంతో అసలు వ్యవహారం చెప్పేసాడు. దాంతో కంగుతిన్న గ్రామస్థులు అతన్ని పట్టుకుని నాలుగు తన్ని పోలీసులకు అప్పగించారు. ఈ వ్యవహారం అంతా తెలుసుకున్న అసలు మాయగాడు తీసుకున్న 20 వేల రూపాయలు ఫోన్ పే ద్వారా వెనక్కి వేసి మాయమైపోయాడు. భర్త వెనక్కి రాకపోవటంతో మోసపోయానని అర్ధం చేసుకున్న భార్య లబోదిబోమంటోంది. ఈ రోజుల్లో కూడా మంత్రాలకు చచ్చిన వ్యక్తి తిరిగి వస్తాడని నమ్మడం తెలివితక్కువ తనమే. ఇలాంటివి నమ్మకండి.. మీ విలువైన డబ్బులు వృధా చేసుకోవద్దు. డబ్బులు ఎవరికీ ఊరికే రావు.
తాజావార్తలు
-
LRS Fee : తెలంగాణ ప్రజలకు భారీ ఊరట.. LRS ఫీజుపై ప్రభుత్వం నిర్ణయం..!
-
Story Board : ఇరాన్ యుద్ధం.. గల్ఫ్ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదా?
-
Suvendu adhikari: 180 గెలుస్తున్నాం.. మమతా బెనర్జీ ఇక రెస్ట్ తీసుకో..
-
Weight Loss Mistakes: బాబోయ్ బరువు తగ్గడానికి ఈ పని మాత్రం చస్తే చేయకండి..!
-
MI vs SRH: సెంచరీతో రఫ్ఫాడించిన ‘ర్యాన్ రికెల్టన్’.. SRH ముందు భారీ టార్గెట్.!
ట్రెండింగ్
-
Raw Mango Tomato Roti Pachadi: వేడివేడి అన్నానికి సూపర్ కాంబో “మామిడికాయ టమాటా రోటి పచ్చడి”.!
-
Open AI Financial Crisis : ఆర్థిక సంక్షోభంలో చాట్ జీపీటీ.?
-
Viral Wedding: పెళ్లి పీటలపై ఊహించని ట్విస్ట్.. వధువు ముందు వింత షరతు పెట్టిన పెళ్లి కొడుకు.. షాక్లో బంధువులు!
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?