Black Magic: చనిపోయిన భర్త లేచొస్తాడు.. మంత్రగాడి మాయ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టెక్నాలజీ ఎంతగా పెరిగినా ఇంకా మూఢనమ్మకాల ఛట్రంనుంచి జనం బయటపడలేకపోతున్నారు. మంత్రాలకు చింతకాయలు రాలవని అందరికీ తెలుసు… అలాగే చనిపోయిన మనిషి మంత్రాలకు లేచొస్తాడా?.ఈ తరహా ఘరానా మోసం ఎన్టీఆర్ జిల్లా తోటచర్ల లో చోటు చేసుకుంది….చనిపోయిన భర్త లేచి వస్తాడు అనటంతో ఓ మంత్రాల మోసగాడికి 50 వేలు ఇచ్చి ఒప్పందం కుదుర్చుకుందో మహిళ. ఎన్టీఆర్ జిల్లా పెనుగ్రంచిపోలు మండలం తోటచర్ల గ్రామానికి చెందిన వెంకట్రావమ్మ భర్త సుధాకర్ నాలుగు నెలల క్రితం అనారోగ్యంతో చనిపోయాడు.
Minister Roja : ఆ మంత్రికి కారు ఎక్కడినుంచి వచ్చింది.? అందుకే సైలెంట్ అయ్యారా.?
Also Read
- Uday Krishna Reddy: అనాథగా పెరిగి ఐపీఎస్ దాకా.. ముఖ్యమంత్రిచే ప్రశంసలు.. ఉదయ్ కృష్ణారెడ్డి బ్యాగ్రౌండ్ తెలిస్తే కన్నీళ్లు ఆగవు!
- CM Chandrababu: ఢిల్లీలో సీఎం చంద్రబాబు మార్క్ రాజకీయం.. భోగాపురం ఎయిర్పోర్ట్, విశాఖ మెట్రోపై స్పీడ్..
- Schools Closed: విద్యార్థులకు బిగ్ అలర్ట్.. ఎల్లుండి స్కూల్స్, కాలేజీలు బంద్..
- AP Govt: రైతులకు, భూ యజమానులకు బిగ్ రిలీఫ్.. మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ఏపీ ప్రభుత్వం..
కటిక పేదరికంలో ఉన్న ఆమె, భర్త లేకున్నా చిన్నా చితక పనులు చేసుకుంటూ ఒంటరిగా జీవనం సాగిస్తోంది…ఈ క్రమంలో కొద్ది రోజుల క్రితం గుంటూరు జిల్లా పెద్దకూరపాడుకు చెందిన గోపి అనే మంత్రగాడు ఆమెకు మాయమాటలతో చనిపోయిన ఆమె భర్తను బ్రతికిస్తాను అని నమ్మబలికాడు. మంత్ర తంత్రాలతో చేసే ప్రత్యేక పూజతో చనిపోయిన సుధాకర్ లేచొస్తాడని…. గతంలో ఇలా ఎంతో మందిని బ్రతికించానని సుధాకర్ ను కూడా మళ్లీ బ్రతికించగలనని ఆమెను మెల్లగా ఉచ్చులోకి లాగాడు….శ్రావణ మాసం వచ్చేలోపు నుదుట బొట్టు పెట్టుకోవచ్చని,మళ్ళీ భర్తతో సంతోషమైన జీవితం గడపొచ్చని ఆమెకు ఆశలు పుట్టించాడు…ఆమెను ఎలాగైనా ఒప్పించి చనిపోయిన సుధాకర్ నాలుగు రోజుల్లో ఇంటికి వస్తాడని ఆమెతో ఒప్పందం కుదుర్చుకున్నాడా మాయగాడు.
మంత్రగాడు చెప్పిన మాయమాటలు నమ్మిన ఆమె భర్త తిరిగొస్తాడనే ఆశతో అతనితో బేరం కుదుర్చుకుంది..మంత్రాలు ,పూజలు చెయ్యటానికి మొత్తం 70 వేల రూపాయలు ఖర్చవుతుందన్నాడు. అంత మొత్తం చెల్లించలేనని….తన భర్తను ఎలాగైనా బ్రతికించి తీసుకుని రావాలని 50 వేల రూపాయలు ఇవ్వగలనని ఒప్పందం కుదుర్చుకుంది…దాంతో సరే అన్న మంత్రగాడు గోపి ఆమె ఇంట్లో తాంత్రిక పూజలు చేసినట్లు బిల్డప్ ఇచ్చి మంత్రాలు చదువుతూ.. ఏవేవో కట్టి 20 వేలు తీసుకుని నాలుగు రోజుల్లో నీ భర్త తిరిగి వస్తాడని వెళ్ళిపోయాడు….అలా వెళ్లిన అతను కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం మిగిన బ్యాలెన్స్ డబ్బుల 30వేల కోసం ఎలాగైనా వసూలు చేసుకుని రమ్మని రెడ్డయ్య అనే మరో మంత్రికుడిని పంపాడు….డబ్బులు వసూలు చెయ్యటానికి తోటచర్ల వచ్చిన ఆ మోసగాడు అడ్రస్ తెలియక అడ్డంగా బుక్ అయిపోయాడు.
ఆమె ఇంటి కోసం ఆ చుట్టుపక్కల పదే పదే తిరుగుతూ ఉండటంతో అనుమానం వచ్చిన గ్రామస్తులు అతన్ని పట్టుకుని గట్టిగా నిలదీశారు. దీంతో అసలు వ్యవహారం చెప్పేసాడు. దాంతో కంగుతిన్న గ్రామస్థులు అతన్ని పట్టుకుని నాలుగు తన్ని పోలీసులకు అప్పగించారు. ఈ వ్యవహారం అంతా తెలుసుకున్న అసలు మాయగాడు తీసుకున్న 20 వేల రూపాయలు ఫోన్ పే ద్వారా వెనక్కి వేసి మాయమైపోయాడు. భర్త వెనక్కి రాకపోవటంతో మోసపోయానని అర్ధం చేసుకున్న భార్య లబోదిబోమంటోంది. ఈ రోజుల్లో కూడా మంత్రాలకు చచ్చిన వ్యక్తి తిరిగి వస్తాడని నమ్మడం తెలివితక్కువ తనమే. ఇలాంటివి నమ్మకండి.. మీ విలువైన డబ్బులు వృధా చేసుకోవద్దు. డబ్బులు ఎవరికీ ఊరికే రావు.
తాజావార్తలు
-
Director Ravi: 10 ఏళ్ల కష్టానికి ఇదే సమాధానం.. స్టేజ్పై కన్నీళ్లు పెట్టుకున్న ‘చెన్నై లవ్ స్టోరీ’ దర్శకుడు!
-
Shreyas Iyer: రేపటి మ్యాచ్కు మా స్ట్రాటజీ ఇదే.. మమ్మల్ని ఎవరూ ఆపలేరు: శ్రేయస్ అయ్యర్
-
Rahul Gandhi: ‘ప్రభుత్వాన్ని తొలగించండి’ అని పోలీసులు నా చెవిలో చెప్పారు: రాహుల్ గాంధీ
-
Story Board : దేశ ప్రజల స్వరం మారుతోంది..కేంద్రంపై అసంతృప్తి ,ఆవేశం మరింత రాజుకుంటే…
-
Criminal Lawyer: కోర్టులో లాయర్.. బయట గంజాయి స్మగ్లర్! పుష్ప స్టైల్లో స్మగ్లింగ్..
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!