Maha Kumbh Mela 2025: కుంభమేళాను సందర్శించిన 10 దేశాల ప్రతినిధులు
- కుంభమేళాను సందర్శించిన 10 దేశాల ప్రతినిధులు
- సంతోషం వ్యక్తం చేసిన ఆయా దేశాల ప్రతినిధులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో మహా కుంభమేళా జరుగుతోంది. ఇప్పటికే దేశ, విదేశాల నుంచి కోట్లాది మంది భక్తులు వచ్చి పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. తాజాగా 10 దేశాలకు చెందిన ప్రతినిధులు పవిత్ర స్నానాలు చేశారు. 10 దేశాలకు చెందిన 21 మంది సభ్యులతో కూడిన బృందం ప్రయాగ్రాజ్లోని త్రివేణి సంగమం దగ్గర పవిత్ర స్నానాలు చేశారు. ఈ బృందంలో ఫిజి, ఫిన్లాండ్, గయానా, మలేషియా, మారిషస్, సింగపూర్, దక్షిణాఫ్రికా, శ్రీలంక, ట్రినిడాడ్, టొబాగో, యూఏఈ ప్రతినిధులు ఉన్నారు.
ఇది కూడా చదవండి: Trump’s Inauguration: ట్రంప్ ప్రమాణస్వీకారానికి ఆహ్వానాలు అందుకున్న వారు వీరే..
Also Read
- Mamitha Baiju: ప్రముఖ హీరోయిన్ మమిత బైజుకు అస్వస్థత.. ఆస్పత్రిలో చికిత్స
- Swara Bhasker: ఇతర మహిళల్ని గౌరవించడం నేర్చుకో.. స్వరా భాస్కర్ వ్యాఖ్యలపై బీజేపీ..
- CM Vijay: సీఎం విజయ్ను కలిసిన టీఎంసీ రెబెల్ ఎంపీ సయానీ ఘోష్
- Yasin Malik: ‘‘నన్ను ఉరితీయక ముందే నిన్ను విముక్తి చేస్తా’’.. భార్యకు యాసిన్ మాలిక్ విడాకులు
గయానాకు చెందిన దినేష్ పెర్సాద్ మాట్లాడుతూ.. గంగా నదిలో పవిత్ర స్నానం చేసిన తర్వాత సంతోషాన్ని వ్యక్తం చేశాడు. తన కల నిజమైందన్నారు. ఎప్పటినుంచో గంగా నదిలో పుణ్య సాన్నం చేయాలని కోరిక ఉందని.. ఈరోజు నెరవేరిందని తెలిపారు. అందరూ స్నానం చేయాలని అందరినీ కోరారు. ఇక యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కు చెందిన సాలీ ఎల్ అజాబ్ కూడా కుంభమేళాను అనుభవించడానికి ప్రయాగ్రాజ్కు వెళ్లిన అంతర్జాతీయ యాత్రికులలో ఒకరిగా ఉన్నారు.
ఇది కూడా చదవండి: Tollywood: నెపో కిడ్స్ కోసం కళ్ళు కాయలు కాచేలా టాలీవుడ్ వెయిటింగ్!
45 రోజుల పాటు జరిగే మహా కుంభంలో నాలుగో రోజైన గురువారం ఉదయం వేలాది మంది భక్తులు త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించారు. ప్రపంచంలోని అతి పెద్ద మత సమ్మేళనంలో 6 కోట్ల మంది భక్తులు పాల్గొన్నారు. జనవరి 14న మకర సంక్రాంతి సందర్భంగా 3.5 కోట్లకు పైగా పాల్గొన్నారు. యాత్రికులు భారీగా తరలిరావడంతో ప్రయాగ్రాజ్ అడ్మినిస్ట్రేషన్ ఐఏ ఆధారిత కంప్యూటరైజ్డ్ లాస్ట్ అండ్ ఫౌండ్ సెంటర్ను ఏర్పాటు చేసింది. జనవరి 13న ప్రారంభమైన మహా కుంభమేఠా ఫిబ్రవరి 26 వరకు కొనసాగుతుంది.
ఇది కూడా చదవండి: Tragedy: ప్రకాశం జిల్లా పాకల బీచ్లో ముగ్గురు మృతి.. మంత్రి దిగ్భ్రాంతి
తాజావార్తలు
-
Mamitha Baiju: ప్రముఖ హీరోయిన్ మమిత బైజుకు అస్వస్థత.. ఆస్పత్రిలో చికిత్స
-
Story Board: తెలంగాణ కాంగ్రెస్ రాజకీయం ఏ మలుపు తిరుగుతుంది..?
-
Swara Bhasker: ఇతర మహిళల్ని గౌరవించడం నేర్చుకో.. స్వరా భాస్కర్ వ్యాఖ్యలపై బీజేపీ..
-
OTR: సొంత జిల్లాలో రామ్మోహన్కు అసంతృప్తి సెగ?
-
CM Vijay: సీఎం విజయ్ను కలిసిన టీఎంసీ రెబెల్ ఎంపీ సయానీ ఘోష్
ట్రెండింగ్
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్ఫోన్ లాంచ్.!