Maha Kumbh Mela 2025: కుంభమేళాను సందర్శించిన 10 దేశాల ప్రతినిధులు
- కుంభమేళాను సందర్శించిన 10 దేశాల ప్రతినిధులు
- సంతోషం వ్యక్తం చేసిన ఆయా దేశాల ప్రతినిధులు
ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో మహా కుంభమేళా జరుగుతోంది. ఇప్పటికే దేశ, విదేశాల నుంచి కోట్లాది మంది భక్తులు వచ్చి పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. తాజాగా 10 దేశాలకు చెందిన ప్రతినిధులు పవిత్ర స్నానాలు చేశారు. 10 దేశాలకు చెందిన 21 మంది సభ్యులతో కూడిన బృందం ప్రయాగ్రాజ్లోని త్రివేణి సంగమం దగ్గర పవిత్ర స్నానాలు చేశారు. ఈ బృందంలో ఫిజి, ఫిన్లాండ్, గయానా, మలేషియా, మారిషస్, సింగపూర్, దక్షిణాఫ్రికా, శ్రీలంక, ట్రినిడాడ్, టొబాగో, యూఏఈ ప్రతినిధులు ఉన్నారు.
ఇది కూడా చదవండి: Trump’s Inauguration: ట్రంప్ ప్రమాణస్వీకారానికి ఆహ్వానాలు అందుకున్న వారు వీరే..
Also Read
గయానాకు చెందిన దినేష్ పెర్సాద్ మాట్లాడుతూ.. గంగా నదిలో పవిత్ర స్నానం చేసిన తర్వాత సంతోషాన్ని వ్యక్తం చేశాడు. తన కల నిజమైందన్నారు. ఎప్పటినుంచో గంగా నదిలో పుణ్య సాన్నం చేయాలని కోరిక ఉందని.. ఈరోజు నెరవేరిందని తెలిపారు. అందరూ స్నానం చేయాలని అందరినీ కోరారు. ఇక యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కు చెందిన సాలీ ఎల్ అజాబ్ కూడా కుంభమేళాను అనుభవించడానికి ప్రయాగ్రాజ్కు వెళ్లిన అంతర్జాతీయ యాత్రికులలో ఒకరిగా ఉన్నారు.
ఇది కూడా చదవండి: Tollywood: నెపో కిడ్స్ కోసం కళ్ళు కాయలు కాచేలా టాలీవుడ్ వెయిటింగ్!
45 రోజుల పాటు జరిగే మహా కుంభంలో నాలుగో రోజైన గురువారం ఉదయం వేలాది మంది భక్తులు త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించారు. ప్రపంచంలోని అతి పెద్ద మత సమ్మేళనంలో 6 కోట్ల మంది భక్తులు పాల్గొన్నారు. జనవరి 14న మకర సంక్రాంతి సందర్భంగా 3.5 కోట్లకు పైగా పాల్గొన్నారు. యాత్రికులు భారీగా తరలిరావడంతో ప్రయాగ్రాజ్ అడ్మినిస్ట్రేషన్ ఐఏ ఆధారిత కంప్యూటరైజ్డ్ లాస్ట్ అండ్ ఫౌండ్ సెంటర్ను ఏర్పాటు చేసింది. జనవరి 13న ప్రారంభమైన మహా కుంభమేఠా ఫిబ్రవరి 26 వరకు కొనసాగుతుంది.
ఇది కూడా చదవండి: Tragedy: ప్రకాశం జిల్లా పాకల బీచ్లో ముగ్గురు మృతి.. మంత్రి దిగ్భ్రాంతి
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: నా బలం, శక్తికి కారణం అదే.. అందుకే ఈ దూకుడు.. మనసులో మాట చెప్పిన వైభవ్..
-
MI Vs SRH Playing XI: ఊపు మీదున్న SRHకు ముంబై కళ్లెమేస్తుందా.?
-
Thyroid Health : వారసత్వంగా థైరాయిడ్ సమస్యలు వస్తాయా.? నిపుణులు చెబుతున్న కీలక సూత్రాలు..!
-
Oil Crisis: భారత్కు గుడ్ న్యూస్.. చమురు రూటు మార్చిన యూఏఈ..
-
Mukesh Ambani: స్టాక్ మార్కెట్లో రిలయన్స్ లాభాల జోరు.. 3 రోజుల్లోనే రూ.1.35 లక్షల కోట్ల ప్రాఫిట్! ఎలా వచ్చాయో తెలుసా?
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో