Madhya Pradesh: మైనర్ బాలికపై అత్యాచారం.. నిందితుడి ఇళ్లు కూల్చివేసిన అధికారులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
physical assault on minor girl in madhya pradesh: మధ్యప్రదేశ్ రాష్ట్రంలో 16 ఏళ్ల బాలిపై సామూహిక అత్యాచారం జరిగింది. రాష్ట్రంలో రేవా జిల్లాలో శనివారం 16 ఏళ్ల బాలికను ఆరుగురు వ్యక్తుల అపహరించారు. వీరిలో ఇద్దరు మైనర్ బాలురు కూడా ఉన్నారు. వీరందరిని సోమవారం పోలీసులు అరెస్ట్ చేశారు. బాధితురాలు తనకు కాబోయే భర్తతో కలిసి శనివారం మధ్యాహ్నం ఆలయానికి వెళ్లింది. ఈ సమయంలో దంపతులు ఆలయం సమీపంలో కూర్చొని ఉండగా.. నిందితులంతా కలిసి బాలికను అపహరించారు. సమీపంలోని అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలికి కాబోయే భర్తను నిందితులు కొట్టారు.
Read Also: Rahul Gandhi: రాహుల్ గాంధీ కాంగ్రెస్ అధ్యక్షుడు కావాలి.. 7 రాష్ట్రాల తీర్మానాలు
Also Read
- Air India Incident: గంజాయి సేవించి విమానం నడిపాడు.. డ్రగ్ టెస్టులో పైలెట్ ఫెయిల్.!
- IEA: మహిళలే మోడీని గెలిపించారు.. ఉజ్వల పథకంపై అంతర్జాతీయ ప్రశంసలు..
- PM Modi: ‘‘ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకం’’.. దేశ ప్రజలకు ప్రధాని మోడీ పిలుపు..
- Plastic Notes: ప్లాస్టిక్ నోట్లకు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. ఎప్పటి నుంచి అమల్లోకి వస్తాయంటే..
ఈ ఘటనపై బాధితురాలికి కాబోయే భర్త పోలీసులకు సమాచారం అందించారు. బాలిక ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. బాలికను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బాలికకు మహిళా పోలీసులు కౌన్సిలింగ్ ఇస్తున్నారు. పోలీసులు 22 ఏళ్ల యువకుడితో పాటు ఇద్దరు 17 ఏళ్లు ఉన్న మైనర్లను, ముంబైకి చెందిన 26 ఏళ్ల వ్యక్తిని, ఇతర నిందితులను అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీ తెలిపారు. వీరందరిపై ఐపీసీలోని పలు అత్యాచార సెక్షన్ల కింద, పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేశారు.
నిందితులందరూ కూలీలుగా పనిచేస్తున్నారని.. వారి నేపథ్యాన్ని కూడా పరిశీలిస్తున్నామని పోలీసులు వెల్లడించారు. రేవాలోని నిందితుల్లో ఒకరి ఇంటిని అధికారులు సోమవారం కూల్చేశారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్మించారని ఈ అధికారులు ఇంటిని కూల్చేశారు. ప్రస్తుతం బాలిక పరిస్థితి నిలకడగా ఉందని.. ఆమెను ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేసినట్లు రేవా జిల్లా కలెక్టర్ మోనోజ్ పుస్ప్ తెలిపారు. మిగిలిన నిందితుల ఆస్తులను తనిఖీ చేస్తున్నారు అధికారులు. ఏదైనా అక్రమ నిర్మాణంగా తేలితే వాటిని కూడా కూల్చేయనున్నారు. ఈ కేసులో నిందితులను కఠినంగా శిక్షించాలని ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పోలీసులను ఆదేశించారు.
తాజావార్తలు
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..