Madhya Pradesh: జబల్పూర్ ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం..8 మంది దుర్మరణం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Madhya Pradesh jabalpur Hospital Fire accident: మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. జబల్పూర్ లోని ఓ ఆస్పత్రిలో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది మరణించారు. అగ్ని ప్రమాదం జరిగిన విషయం తెలిసిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు పేషెంట్లను, సిబ్బందిని రెస్క్యూ చేసేందుకు ఆపరేషన్ ప్రారంభించారు. జబల్పూర్ దామోహ్ నాక్ ప్రాంతంలోని న్యూ లైప్ మల్టీ స్పెషాటిటీ ఆస్పత్రిలో ఈ రోజు ( సోమవారం) మధ్యాహ్నం అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఇప్పటి వరకు ఐదుగురు రోగులతో పాటు ముగ్గురు హస్పిటల్ సిబ్బంది మరణించారు. మరో 12 మంది దాకా గాయపడినట్లు తెలుస్తోంది. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
Read Also: Viral News: మోడీజీ.. మీ వల్లే మా అమ్మ నన్ను కొట్టింది. ఒకటో తరగతి చిన్నారి లేఖ వైరల్.
Also Read
ఆస్పత్రిలో షార్ట్ సర్క్యూట్ ద్వారానే అగ్నిప్రమాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ భారీ అగ్ని ప్రమాదం నుంచి ఆస్పత్రిలో చిక్కుకున్న వారందరిని రక్షించినట్లు జబల్పూర్ ఎస్పీ సిద్ధార్థ్ బహగుణ తెలిపారు. ఆస్పత్రిలో అందరిని రెస్క్యూ చేసినట్లు.. ఇంకా ఎవరు లోపల లేరని ఎన్డీఆర్ఎఫ్ అధికారారి సంజీవ్ కుమార్ గుప్తా వెల్లడించారు. మరణించిన వారి కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున పరిహారం అందిస్తామని మధ్య ప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ వెల్లడించారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ప్రమాద ఘటన, సహాయక చర్యలను పర్యవేక్షించాలని జబల్పూర్ కలెక్టర్, ఇతర అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.
తాజావార్తలు
-
TG Bharath vs Byreddy Siddharth Reddy: బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిపై మంత్రి టీజీ భరత్ క్రిమినల్ పరువునష్టం దావా
-
Sunil Narang: ‘ఏకాభిప్రాయం లేదు.. ఒత్తిళ్లు ఎక్కువయ్యాయి’ ఫిలిం ఛాంబర్ అధ్యక్ష పదవికి సునీల్ నారంగ్ గుడ్ బై!
-
Likhitha Reddy: ప్రశాంత్ నీల్ భార్య కూడా ఎన్టీఆర్ ఫ్యానేనా? థియేటర్ లో ఆ రచ్చ చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే!
-
PCOS గురించి ఈ నిజాలు తెలుసా..? వైద్యులు చెబుతున్న కీలక విషయాలు ఇవే.!
-
What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
ట్రెండింగ్
-
Thotakura Masala Vada Recipe: కరకరలాడే తోటకూర మసాలా వడలు.. ఇంట్లోనే స్ట్రీట్ స్టైల్ రుచి.!
-
Tree Trimming Job: చెట్లు కొడితే చాలు.. గంటకు రూ. 49,000.. ఎక్కడంటే.?
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్లో లాంచ్.. ధర ఎంతంటే.?
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!