MP High Court: ” వేరే వ్యక్తితో శారీరక సంబంధం పెట్టుకున్న వివాహిత”.. హైకోర్టు కీలక తీర్పు..
- వ్యక్తితో శారీరక సంబంధం పెట్టుకున్న వివాహిత..
- తప్పుడు వివాహ హామీతో సంబంధం పెట్టుకున్నన్న మహిళ..
- వివాహిత స్త్రీ ‘‘తప్పుడు హామీ’’తో అంగీకరించానని చెప్పడం సరైంది కాదన్న కోర్టు..
- నిందితుడిపై దాఖలైన అత్యాచారం కేసుని కొట్టేసిన న్యాయస్థానం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MP High Court: ఒక వ్యక్తితో శారీరక సంబంధం పెట్టుకున్న వివాహిత మహిళ దాఖలు చేసిన అత్యాచారం కేసుని మధ్యప్రదేశ్ హైకోర్టు కొట్టివేసింది. పెళ్లి చేసుకుంటాననే హామీపై వివాహిత స్త్రీ మరొక పురుషుడితో శారీరక సంబంధానికి సమ్మతించానని చెప్పుకోవడానికి వీలులేదని జస్టిస్ మణీందర్ ఎస్ భట్టీ తన తీర్పులో వెల్లడించారు. తప్పుడు వివాహ హమీ సాకుతో శారీరక సంబంధానికి అంగీకరించానని వివాహిత స్త్రీ చెప్పడం సరైనది కాదని హైకోర్టు పేర్కొంది.
వివాహిత తనతో శారీరక సంబంధం పెట్టుకున్నట్లు ఫిర్యాదు చేయడంతో ఒక వ్యక్తిపై అత్యాచారం కేసు నమోదైంది. ఈ కేసు ఫిబ్రవరి 10న హైకోర్టులో విచారణకు వచ్చింది. సదరు వ్యక్తిపై ఉన్న అత్యాచారం కేసుని న్యాయమూర్తి కొట్టివేశారు. సదరు పురుషుడు తన భార్యకు విడాకులు ఇచ్చి, తనను పెళ్లి చేసుకుంటాననే హామీ ఇచ్చినట్లు, దీని ఆధారంగానే అతడితో లైంగిక సంబంధం ఏర్పరచుకున్నట్లు వివాహిత పేర్కొంది.
Also Read
- UP: ఏం త్యాగం.. ఐదుగురు పిల్లల తల్లిని ప్రియుడికిచ్చి పెళ్లి చేసిన భర్త.. ఏం జరిగిందంటే..!
- Rahul Gandhi vs BJP: విద్యార్థులతో రాజకీయాలెందుకు? రాహుల్గాంధీని ప్రశ్నించిన బీజేపీ
- Sheikh Hasina: విద్యార్థి ఉద్యమం కాదు, రెజిమ్ ఛేంజ్ కుట్ర.. 2 ఏళ్ల తర్వాత మౌనం వీడిన షేక్ హసీనా..
- Air India: ఎయిరిండియా కొత్త సీఈవో, ఎండీగా గెబ్రెమారియం నియామకం
Read Also: Vishvambhara : విశ్వంభర సినిమాలో ఆ పాటకు థియేటర్లలో బాక్స్ లు బద్దలు కావడం ఖాయం
ఫిర్యాదుదారు వివాహిత అయినప్పుడు, తప్పుడు వాగ్దానం సాకుతో శారీరక సంబంధానికి సమ్మతి ఇవ్వడం, ‘‘వాస్తవానికి దురాభిప్రాయంగా’’ పరిగణించలేమని న్యాయమూర్తి పేర్కొన్నారు. శారీరక సంబంధం పెట్టుకున్న వివాహిత మహిళ, సదరు వ్యక్తి తనపై అత్యాచారం చేశాడని ఆరోపించింది. దీంతో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి హైకోర్టుని ఆశ్రయించాడు. అప్పటికే మహిళకి వేరే వ్యక్తితో పెళ్లయి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.
మహిళ ఫిర్యాదు ప్రకారం.. నిందితుడు, మహిళ ఒకే ఏరియాలో నివసించే వారు. మూడు నెలల స్నేహం తర్వాత వీరిద్దరి మధ్య శారీరక సంబంధం ఏర్పడింది. తన భార్యకు విడాకులు ఇచ్చి, పెళ్లి చేసుకుంటానని నిందితుడు మొదట హామీ ఇచ్చాడు. ఆ తర్వాత భార్యకు విడాకులు ఇచ్చే పరిస్థితి లేదని వెనక్కి తగ్గాడని ఆరోపించింది. నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి, ఫిర్యాదు చేసిన వివాహిత స్త్రీని బలవంతంగా ఒత్తిడి చేసి లైంగిక సంబంధంలోకి ప్రవేశించేలా చేసినట్లు ఎఫ్ఐఆర్లో ఎలాంటి వివరాలు లేవని కోర్టు గుర్తించింది. ఫిర్యాదు స్వయంగా నేరం జరిగిందని సూచించలేదు కాబట్టి, ఇలాంటి ఎఫ్ఐఆర్లను తొలి లోనే తుంచేయాలని జస్టిస్ భట్టి అన్నారు.
తాజావార్తలు
-
Trump: ఇరాన్ సుంకాలు విధిస్తే మేమూ విధిస్తాం.. హార్ముజ్పై ట్రంప్ వార్నింగ్
-
Ather Konark: ఏథర్ నుంచి చౌక స్కూటర్ ‘‘కోనార్క్’’.. ఆగస్టు 29న గ్రాండ్ లాంచ్..
-
Fauzi Shooting Update: ‘ఫౌజీ’ కోసం డార్లింగ్ స్పీడ్ చూసి ఫ్యాన్స్ ఫిదా! ఒకేసారి రెండు యూనిట్స్..
-
iTel Ace 3 Heera: రూ.949కే బెస్ట్ ఫీచర్ ఫోన్.. వాయిస్ అసిస్టెంట్, 13 రోజుల బ్యాటరీ.. ఇంకా..
-
US Military: అమెరికా ఆయుధ బలం తగ్గిందా? ఇరాన్ యుద్ధం తర్వాత బయటపడిన షాకింగ్ నిజాలు ఇవే!
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!