Mallikarjun Kharge: గంగా నదిలో స్నానాలు చేస్తే పేదరికం పోతుందా.? ఇఫ్తార్ విందుతో బీజేపీ రిప్లై..
- గంగా నదిలో స్నానం చేస్తే పేదరికం పోతుందా..?
- కుంభమేళాలో బీజేపీ నేతల స్నానాలపై ఖర్గే ఫైర్..
- ఇఫ్తార్ విందులకు వెళ్తే పేదరికం పోతుందా..?
- ఖర్గే వ్యాఖ్యలపై బీజేపీ కౌంటర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mallikarjun Kharge: ఉత్తర్ ప్రదేశ్ ప్రయాగ్రాజ్లో జరుగుతున్న ‘‘మహా కుంభమేళా’’పై కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే వివాదాస్పద కామెంట్స్ చేవారు. గంగా నదిలో పుణ్యస్నానాలు చేస్తే పేదరికం పోతుందా..? అని బీజేపీ నేతల్ని ఆయన ప్రశ్నించారు. మధ్యప్రదేశ్ మోవ్లో జరుగుతున్న ‘జై బాపు, జై భీమ్, జై సంవిధాన్’ ర్యాలీలో సోమవారం ఖర్గే ఈ వ్యాఖ్యలు చేశారు. బీజేపీ నాయకులు కెమెరాల కోసం స్నానాలు చేస్తున్నారని ఆరోపించారు.
గంగా నదిలో స్నానాలు చేయడం వల్ల దేశంలో పేదరికం అంతమవుతుందా.? ఆకలితో ఉన్న కడుపులు నిండుతాయా.? అని కాంగ్రెస్ అధ్యక్షుడు ప్రశ్నించారు. ‘‘ నేను ఎవరి విశ్వాసాలను ప్రశ్నించాలనుకోవడం లేదు. ఎవరైతే బాధపడితే, నేను క్షమాపణలు కోరుతున్నాను. ఒక పిల్లవాడు ఆకలితో చనిపోతున్నప్పుడు, పాఠశాలకు వెళ్లలేకపోతున్నప్పుడు, ఈ ప్రజలు వేల రూపాయలు ఖర్చు చేసి గంగానిదిలో స్నానం చేయడానికి పోటీ పడుతున్నారు’’ అని అన్నారు. ఇలాంటి వ్యక్తులతో దేశానికి ప్రయోజనం లేదని, మతం పేరుతో పేదలు దోపిడికి గురవుతున్నారన్నదే తమ సమస్య అని ఖర్గే అన్నారు.
Also Read
- Ketan Agarwal Case: కేతన్ హత్యకు ముందు, తర్వాత చాట్స్ డిలీట్.. సియా-చేతన్ ఫోన్లలో కీలక ఆధారాలు
- Ketan Agarwal Case: మద్యం మత్తులో సియా గోయల్.. వీడియో వైరల్
- Congress: కాంగ్రెస్లో భారీ ప్రక్షాళన.. యూపీతో సహా కీలక రాష్ట్రాల ఇన్ఛార్జ్ల మార్పు! కారణం ఇదేనా
- Monsoon: శాటిలైట్ చిత్రాల్లో షాకింగ్ దృశ్యాలు.. దేశంలో కనిపించని వర్ష మేఘాలు
Read Also: Nadendla Manohar: పేదలకు భూములు ఇచ్చే పేరుతో తెనాలిలో భారీ స్కామ్ జరిగింది..
కేంద్ర హోం మంత్రి కుంభమేళాలో సోమవారం త్రివేణి సంగమంలో స్నానం చేసిన తర్వాత ఖర్గే నుంచి ఈ వ్యాఖ్యలు వచ్చాయి. అయితే, ఈ వ్యాఖ్యలపై బీజేపీ తీవ్రంగానే స్పందించింది. కాంగ్రెస్ ద్వేషంతో కోట్లాది హిందువుల విశ్వాసాలపై దాడి చేస్తూనే ఉందని బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర అన్నారు. మహా కుంభమేళా యుగయుగాల సనాతన విశ్వానికి చిహ్నంగా ఉందని, ప్రపంచం మొత్తం ఈ విశ్వాసాలను గౌరవిస్తుంటే, కాంగ్రెస్ మాత్రం ఈ విశ్వాసాన్ని అపహాస్యం చేస్తుందని ఆయన అన్నారు. హిందూ విశ్వాసాలపై వ్యాఖ్యలు చేసే కాంగ్రెస్ నేతలైన సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఖర్గేలు దమ్ముంటే వేరే మత విశ్వాసాలపై ఇలాంటి వ్యాఖ్యలు చేయగలుగుతారా..? అని ప్రశ్నించారు. ఇఫ్తార్ విందులకు వెళ్తే పేదరికం పోతుందా.? అని ఖర్గేని బీజేపీ ప్రశ్నించింది.
తాజావార్తలు
-
Ireland: ఐర్లాండ్ చేతిలో ఓడిన 8వ దేశంగా భారత్.. ఇక మిగిలింది ఆ మూడే..
-
Off The Record: కందుకూరు టీడీపీలో సిట్టింగ్ వర్సెస్ మాజీ ఎమ్మెల్యే
-
Shreyas Iyer: ఐర్లాండ్ చేతిలో ఓటమికి కారణం ఇదే.. నిజాన్ని అంగీకరించిన శ్రేయాస్ అయ్యర్..
-
Pulse Polio: 28న పల్స్ పోలియోకు తెలంగాణ రెడీ.!
-
India Lose: ప్రపంచ ఛాంపియన్ల పరువు ఐర్లాండ్ వీధుల్లో పారేశారు.. శ్రేయాస్ అయ్యర్పై ఆగ్రహం..
ట్రెండింగ్
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!