Mallikarjun Kharge: గంగా నదిలో స్నానాలు చేస్తే పేదరికం పోతుందా.? ఇఫ్తార్ విందుతో బీజేపీ రిప్లై..
- గంగా నదిలో స్నానం చేస్తే పేదరికం పోతుందా..?
- కుంభమేళాలో బీజేపీ నేతల స్నానాలపై ఖర్గే ఫైర్..
- ఇఫ్తార్ విందులకు వెళ్తే పేదరికం పోతుందా..?
- ఖర్గే వ్యాఖ్యలపై బీజేపీ కౌంటర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mallikarjun Kharge: ఉత్తర్ ప్రదేశ్ ప్రయాగ్రాజ్లో జరుగుతున్న ‘‘మహా కుంభమేళా’’పై కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే వివాదాస్పద కామెంట్స్ చేవారు. గంగా నదిలో పుణ్యస్నానాలు చేస్తే పేదరికం పోతుందా..? అని బీజేపీ నేతల్ని ఆయన ప్రశ్నించారు. మధ్యప్రదేశ్ మోవ్లో జరుగుతున్న ‘జై బాపు, జై భీమ్, జై సంవిధాన్’ ర్యాలీలో సోమవారం ఖర్గే ఈ వ్యాఖ్యలు చేశారు. బీజేపీ నాయకులు కెమెరాల కోసం స్నానాలు చేస్తున్నారని ఆరోపించారు.
గంగా నదిలో స్నానాలు చేయడం వల్ల దేశంలో పేదరికం అంతమవుతుందా.? ఆకలితో ఉన్న కడుపులు నిండుతాయా.? అని కాంగ్రెస్ అధ్యక్షుడు ప్రశ్నించారు. ‘‘ నేను ఎవరి విశ్వాసాలను ప్రశ్నించాలనుకోవడం లేదు. ఎవరైతే బాధపడితే, నేను క్షమాపణలు కోరుతున్నాను. ఒక పిల్లవాడు ఆకలితో చనిపోతున్నప్పుడు, పాఠశాలకు వెళ్లలేకపోతున్నప్పుడు, ఈ ప్రజలు వేల రూపాయలు ఖర్చు చేసి గంగానిదిలో స్నానం చేయడానికి పోటీ పడుతున్నారు’’ అని అన్నారు. ఇలాంటి వ్యక్తులతో దేశానికి ప్రయోజనం లేదని, మతం పేరుతో పేదలు దోపిడికి గురవుతున్నారన్నదే తమ సమస్య అని ఖర్గే అన్నారు.
Also Read
- Nitin Nabin: విదేశాల నుంచి భారత యువతను ఆడించలేరు.. సీజేపీపై బీజేపీ పరోక్ష విమర్శలు..
- Shashi Tharoor: రాహుల్గాంధీపై అనుచిత వ్యాఖ్యలు.. ‘ఒబామా.. మోడీ సంగతి ఏంటి?’.. రామచంద్ర గుహకు శశిథరూర్ కౌంటర్
- IMD Rain Alert: దక్షిణ, ఈశాన్య రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
- India At UN: పాక్కు భారత్ షాక్.. కాశ్మీర్ రాగం పాడితే ఇదే సమాధానం!
Read Also: Nadendla Manohar: పేదలకు భూములు ఇచ్చే పేరుతో తెనాలిలో భారీ స్కామ్ జరిగింది..
కేంద్ర హోం మంత్రి కుంభమేళాలో సోమవారం త్రివేణి సంగమంలో స్నానం చేసిన తర్వాత ఖర్గే నుంచి ఈ వ్యాఖ్యలు వచ్చాయి. అయితే, ఈ వ్యాఖ్యలపై బీజేపీ తీవ్రంగానే స్పందించింది. కాంగ్రెస్ ద్వేషంతో కోట్లాది హిందువుల విశ్వాసాలపై దాడి చేస్తూనే ఉందని బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర అన్నారు. మహా కుంభమేళా యుగయుగాల సనాతన విశ్వానికి చిహ్నంగా ఉందని, ప్రపంచం మొత్తం ఈ విశ్వాసాలను గౌరవిస్తుంటే, కాంగ్రెస్ మాత్రం ఈ విశ్వాసాన్ని అపహాస్యం చేస్తుందని ఆయన అన్నారు. హిందూ విశ్వాసాలపై వ్యాఖ్యలు చేసే కాంగ్రెస్ నేతలైన సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఖర్గేలు దమ్ముంటే వేరే మత విశ్వాసాలపై ఇలాంటి వ్యాఖ్యలు చేయగలుగుతారా..? అని ప్రశ్నించారు. ఇఫ్తార్ విందులకు వెళ్తే పేదరికం పోతుందా.? అని ఖర్గేని బీజేపీ ప్రశ్నించింది.
తాజావార్తలు
-
HYDRAA : హైడ్రా ప్రజావాణికి మరో బ్రేక్.. జూన్ 22 నుంచే మళ్లీ ప్రారంభం..!
-
Off The Record : కేటీఆర్కు సమాంతరంగా మరో వర్కింగ్ ప్రెసిడెంట్ పై కేసీఆర్ కసరత్తు
-
Nitin Nabin: విదేశాల నుంచి భారత యువతను ఆడించలేరు.. సీజేపీపై బీజేపీ పరోక్ష విమర్శలు..
-
Shashi Tharoor: రాహుల్గాంధీపై అనుచిత వ్యాఖ్యలు.. ‘ఒబామా.. మోడీ సంగతి ఏంటి?’.. రామచంద్ర గుహకు శశిథరూర్ కౌంటర్
-
Vaibhav’s Father: ‘సూర్యవంశీ వారి కాలి దుమ్ముకు కూడా సరిపోడు’.. సంచలన వ్యాఖ్యలు చేసిన వైభవ్ తండ్రి..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!