Mallikarjun Kharge: గంగా నదిలో స్నానాలు చేస్తే పేదరికం పోతుందా.? ఇఫ్తార్ విందుతో బీజేపీ రిప్లై..
- గంగా నదిలో స్నానం చేస్తే పేదరికం పోతుందా..?
- కుంభమేళాలో బీజేపీ నేతల స్నానాలపై ఖర్గే ఫైర్..
- ఇఫ్తార్ విందులకు వెళ్తే పేదరికం పోతుందా..?
- ఖర్గే వ్యాఖ్యలపై బీజేపీ కౌంటర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mallikarjun Kharge: ఉత్తర్ ప్రదేశ్ ప్రయాగ్రాజ్లో జరుగుతున్న ‘‘మహా కుంభమేళా’’పై కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే వివాదాస్పద కామెంట్స్ చేవారు. గంగా నదిలో పుణ్యస్నానాలు చేస్తే పేదరికం పోతుందా..? అని బీజేపీ నేతల్ని ఆయన ప్రశ్నించారు. మధ్యప్రదేశ్ మోవ్లో జరుగుతున్న ‘జై బాపు, జై భీమ్, జై సంవిధాన్’ ర్యాలీలో సోమవారం ఖర్గే ఈ వ్యాఖ్యలు చేశారు. బీజేపీ నాయకులు కెమెరాల కోసం స్నానాలు చేస్తున్నారని ఆరోపించారు.
గంగా నదిలో స్నానాలు చేయడం వల్ల దేశంలో పేదరికం అంతమవుతుందా.? ఆకలితో ఉన్న కడుపులు నిండుతాయా.? అని కాంగ్రెస్ అధ్యక్షుడు ప్రశ్నించారు. ‘‘ నేను ఎవరి విశ్వాసాలను ప్రశ్నించాలనుకోవడం లేదు. ఎవరైతే బాధపడితే, నేను క్షమాపణలు కోరుతున్నాను. ఒక పిల్లవాడు ఆకలితో చనిపోతున్నప్పుడు, పాఠశాలకు వెళ్లలేకపోతున్నప్పుడు, ఈ ప్రజలు వేల రూపాయలు ఖర్చు చేసి గంగానిదిలో స్నానం చేయడానికి పోటీ పడుతున్నారు’’ అని అన్నారు. ఇలాంటి వ్యక్తులతో దేశానికి ప్రయోజనం లేదని, మతం పేరుతో పేదలు దోపిడికి గురవుతున్నారన్నదే తమ సమస్య అని ఖర్గే అన్నారు.
Also Read
- Sonam Wangchuk Hunger Strike: 20వ రోజుకు సోనమ్ వాంగ్చుక్ నిరాహార దీక్ష.. అవయవ వైఫల్యం ముప్పు.. దీక్ష విరమణకు ససేమిరా..
- NEET UG Result 2026: నీట్ యూజీ ఫలితాలు వచ్చేశాయ్.. స్కోర్కార్డ్ను ఇలా డౌన్లోడ్ చేసుకోండి
- Kejriwal: సోనం వాంగ్చుక్కు కేజ్రీవాల్ మద్దతు.. యువత డిమాండ్లు నెరవేర్చాలని డిమాండ్
- Parliament Monsoon Session: 'వందే మాతరం'ను అవమానిస్తే జైలుకే.. కేంద్రం కీలక బిల్లు సిద్ధం
Read Also: Nadendla Manohar: పేదలకు భూములు ఇచ్చే పేరుతో తెనాలిలో భారీ స్కామ్ జరిగింది..
కేంద్ర హోం మంత్రి కుంభమేళాలో సోమవారం త్రివేణి సంగమంలో స్నానం చేసిన తర్వాత ఖర్గే నుంచి ఈ వ్యాఖ్యలు వచ్చాయి. అయితే, ఈ వ్యాఖ్యలపై బీజేపీ తీవ్రంగానే స్పందించింది. కాంగ్రెస్ ద్వేషంతో కోట్లాది హిందువుల విశ్వాసాలపై దాడి చేస్తూనే ఉందని బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర అన్నారు. మహా కుంభమేళా యుగయుగాల సనాతన విశ్వానికి చిహ్నంగా ఉందని, ప్రపంచం మొత్తం ఈ విశ్వాసాలను గౌరవిస్తుంటే, కాంగ్రెస్ మాత్రం ఈ విశ్వాసాన్ని అపహాస్యం చేస్తుందని ఆయన అన్నారు. హిందూ విశ్వాసాలపై వ్యాఖ్యలు చేసే కాంగ్రెస్ నేతలైన సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఖర్గేలు దమ్ముంటే వేరే మత విశ్వాసాలపై ఇలాంటి వ్యాఖ్యలు చేయగలుగుతారా..? అని ప్రశ్నించారు. ఇఫ్తార్ విందులకు వెళ్తే పేదరికం పోతుందా.? అని ఖర్గేని బీజేపీ ప్రశ్నించింది.
తాజావార్తలు
-
Sonam Wangchuk Hunger Strike: 20వ రోజుకు సోనమ్ వాంగ్చుక్ నిరాహార దీక్ష.. అవయవ వైఫల్యం ముప్పు.. దీక్ష విరమణకు ససేమిరా..
-
Hyderabad: ప్రేమిస్తున్న యువకుడు మాట్లాడటం లేదని మనస్తాపం.. మైనర్ బాలిక ఆత్మహత్య.!
-
School Van Hit by Train: ఘోర ప్రమాదం… స్కూల్ వ్యాన్ ను ఢీకొట్టిన రైలు.. ఇద్దరు చిన్నారులతో సహా ముగ్గురు మృతి
-
Weight Loss Side Effects: బరువు తగ్గాలని ప్రయత్నిస్తున్నారా..?.. ఈ 7 తప్పులను మాత్రం చేయొద్దు
-
Aamir Khan: సోనమ్ వాంగ్చుక్ జీవితం ఆధారంగా ‘3 ఇడియట్స్’ సినిమా.. క్లారిటీ ఇచ్చిన ఆమిర్ ఖాన్
ట్రెండింగ్
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!