Mallikarjun Kharge: గంగా నదిలో స్నానాలు చేస్తే పేదరికం పోతుందా.? ఇఫ్తార్ విందుతో బీజేపీ రిప్లై..
- గంగా నదిలో స్నానం చేస్తే పేదరికం పోతుందా..?
- కుంభమేళాలో బీజేపీ నేతల స్నానాలపై ఖర్గే ఫైర్..
- ఇఫ్తార్ విందులకు వెళ్తే పేదరికం పోతుందా..?
- ఖర్గే వ్యాఖ్యలపై బీజేపీ కౌంటర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mallikarjun Kharge: ఉత్తర్ ప్రదేశ్ ప్రయాగ్రాజ్లో జరుగుతున్న ‘‘మహా కుంభమేళా’’పై కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే వివాదాస్పద కామెంట్స్ చేవారు. గంగా నదిలో పుణ్యస్నానాలు చేస్తే పేదరికం పోతుందా..? అని బీజేపీ నేతల్ని ఆయన ప్రశ్నించారు. మధ్యప్రదేశ్ మోవ్లో జరుగుతున్న ‘జై బాపు, జై భీమ్, జై సంవిధాన్’ ర్యాలీలో సోమవారం ఖర్గే ఈ వ్యాఖ్యలు చేశారు. బీజేపీ నాయకులు కెమెరాల కోసం స్నానాలు చేస్తున్నారని ఆరోపించారు.
గంగా నదిలో స్నానాలు చేయడం వల్ల దేశంలో పేదరికం అంతమవుతుందా.? ఆకలితో ఉన్న కడుపులు నిండుతాయా.? అని కాంగ్రెస్ అధ్యక్షుడు ప్రశ్నించారు. ‘‘ నేను ఎవరి విశ్వాసాలను ప్రశ్నించాలనుకోవడం లేదు. ఎవరైతే బాధపడితే, నేను క్షమాపణలు కోరుతున్నాను. ఒక పిల్లవాడు ఆకలితో చనిపోతున్నప్పుడు, పాఠశాలకు వెళ్లలేకపోతున్నప్పుడు, ఈ ప్రజలు వేల రూపాయలు ఖర్చు చేసి గంగానిదిలో స్నానం చేయడానికి పోటీ పడుతున్నారు’’ అని అన్నారు. ఇలాంటి వ్యక్తులతో దేశానికి ప్రయోజనం లేదని, మతం పేరుతో పేదలు దోపిడికి గురవుతున్నారన్నదే తమ సమస్య అని ఖర్గే అన్నారు.
Also Read
- PM Narendra Modi: ప్రధాని మోదీకి స్వీడన్ అత్యున్నత గౌరవం.. ‘రాయల్ ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్’ పురస్కారం
- Rahul Gandhi: ప్రధాని మౌనం ఎందుకు? విద్యామంత్రిని తొలగించండి..
- Actor Vishal: ‘‘ఆయనకు ఏం తెలుసని మంత్రి పదవి ఇచ్చారు..?’’ సీఎం విజయ్పై విశాల్ ఘాటు వ్యాఖ్యలు..
- Chickens Die: ఘోర ఘటన.. 3 గంటల్లో 5,300 కోళ్లు మృతి.. కారణం ఏంటంటే..
Read Also: Nadendla Manohar: పేదలకు భూములు ఇచ్చే పేరుతో తెనాలిలో భారీ స్కామ్ జరిగింది..
కేంద్ర హోం మంత్రి కుంభమేళాలో సోమవారం త్రివేణి సంగమంలో స్నానం చేసిన తర్వాత ఖర్గే నుంచి ఈ వ్యాఖ్యలు వచ్చాయి. అయితే, ఈ వ్యాఖ్యలపై బీజేపీ తీవ్రంగానే స్పందించింది. కాంగ్రెస్ ద్వేషంతో కోట్లాది హిందువుల విశ్వాసాలపై దాడి చేస్తూనే ఉందని బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర అన్నారు. మహా కుంభమేళా యుగయుగాల సనాతన విశ్వానికి చిహ్నంగా ఉందని, ప్రపంచం మొత్తం ఈ విశ్వాసాలను గౌరవిస్తుంటే, కాంగ్రెస్ మాత్రం ఈ విశ్వాసాన్ని అపహాస్యం చేస్తుందని ఆయన అన్నారు. హిందూ విశ్వాసాలపై వ్యాఖ్యలు చేసే కాంగ్రెస్ నేతలైన సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఖర్గేలు దమ్ముంటే వేరే మత విశ్వాసాలపై ఇలాంటి వ్యాఖ్యలు చేయగలుగుతారా..? అని ప్రశ్నించారు. ఇఫ్తార్ విందులకు వెళ్తే పేదరికం పోతుందా.? అని ఖర్గేని బీజేపీ ప్రశ్నించింది.
తాజావార్తలు
-
PM Narendra Modi: ప్రధాని మోదీకి స్వీడన్ అత్యున్నత గౌరవం.. ‘రాయల్ ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్’ పురస్కారం
-
Ragi Mixture: సాయంత్రం స్నాక్స్లోకి క్రిస్పీ ‘రాగి మిక్సర్’.. సింపుల్గా హెల్తీగా ఇంట్లోనే ఇలా చేసుకోండి!
-
Rahul Gandhi: ప్రధాని మౌనం ఎందుకు? విద్యామంత్రిని తొలగించండి..
-
Donald Trump: అమెరికా అధ్యక్షుడికి షాక్.. రూల్స్ బ్రేక్ చేశారంటూ ట్రంప్కు ఫైన్ వేసిన అధికారులు! అసలేం జరిగిందంటే..
-
Shreyas Iyer: మా ఓటమికి కారణం ఆ ఇద్దరే.. అస్సలు ఊహించలేదంటూ ఆవేదన వ్యక్తం చేసిన శ్రేయస్..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..