LPG BOOKINGS: వంటగ్యాస్ భయాలు.. రోజుకు అదనంగా 25 లక్షల సిలిండర్ల బుకింగ్స్..
- దేశ ప్రజల్లో వంటగ్యాస్ భయాలు..
- ప్రతీ రోజు అదనంగా 25 లక్షల సిలిండర్ల బుకింగ్స్..
- 30 శాతం ఉత్పత్తిని పెంచిన కేంద్రం..
- ఆందోళన అవసరం లేదని ప్రకటన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
LPG BOOKINGS: దేశంలో వంట గ్యాస్ (LPG) డిమాండ్ తీరు మారిందని, ప్రజల్లో ఆందోళన పెరిగిందని, దీంతో ఎక్కువగా ఎల్పీజీని కొనుగోలు చేస్తున్నారని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. అయితే, దేశంలో వంట గ్యాస్ కొరత లేదని, ఎల్పీజీ ఉత్పత్తి 30 శాతం మేర పెరిగిందని తెలిపింది. యుద్ధానికి ముందు సగటున ఒక రోజు 55.7 లక్షల ఎల్పీజీ సిలిండర్ల బుకింగ్స్ ఉంటే, ఇప్పుడు ఇది 75.7 లక్షలకు చేరుకుందని, ఇది ప్రజల్లో ఉన్న ఆందోళనను తెలియజేస్తుందని పెట్రోలియం మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ తెలిపారు.
Read Also: Affair: వదినతో అక్రమ సంబంధం.. తల్లిని హత్య చేసిన చిన్న కొడుకు..
Also Read
- Assam Magic Rice: "మ్యాజిక్ బియ్యం".. మంట అవసరం లేదు.. రైస్ కుక్కర్తో పనిలేదు.. చల్లటి నీళ్లతో క్షణాల్లో అన్నం రెడీ..
- BRICS Summit 2026: అష్టదిగ్బంధనంలో ఢిల్లీ.. మూడు రోజుల పాటు కఠిన ఆంక్షలు
- BRICS Summit 2026 ఎఫెక్ట్.. ఢిల్లీలో రైళ్లకు బ్రేక్! ఈ రైళ్లు రద్దు, మరికొన్ని దారి మళ్లింపు
- BRICS Summit 2026: భారతీయ రుచుల ఘుమఘుమలు.. BRICS దేశాధినేతలకు ప్రత్యేక విందు
ప్రజలు ఎలాంటి పుకార్లను నమ్మవద్దని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆమె చెప్పారు. ఆందోళన చెంది ‘‘పానిక్ బుకింగ్స్’’ చేయవద్దని సూచించారు. రోజుకు అదనంగా 25 లక్షల సిలిండర్లు బుక్ అవుతున్నట్లు తెలిపారు. ఎల్పీజీ వినియోగదారుల ఫిర్యాదుల్ని స్వీకరించేందుకు ప్రభుత్వ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు తమ కాల్ సెంటర్లను బలోపేతం చేసినట్లు కేంద్రం చెప్పింది. కాల్ సెంటర్ల సంఖ్య 400కు పెంచడంతో పాటు టెలిఫోన్ లైన్లు 50 వరకు పెంచినట్లు తెలిపింది. దీంతో వినియోగదారులు తమ సమస్యల్ని ఈజీగా నమోదు చేసుకోవచ్చు.
బ్లాక్ మార్కెటింగ్, అక్రమంగా నిల్వ చేసే వారిపై కఠినంగా వ్యవహరించాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వాలు, జిల్లా అధికారులు ముఖ్యంగా కలెక్టర్లు, ఎస్పీలు ఈ వ్యవహారాల్లో కీలకంగా పనిచేయాలని సూచించింది. మరోవైపు, సమస్యల్ని పరిష్కరించేందుకు పలు రాష్ట్రాలు కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేశాయి. ఇంధన సరఫరాకు సంబంధించి రాష్ట్రాలకు నిరంతర సమన్వయం, సహకారం ఉంటుందని కేంద్రం చెప్పింది.
తాజావార్తలు
-
Soori: భారీగా పెరిగిన కమెడియన్ సూరి రెమ్యూనరేషన్.. రేంజ్ చూస్తే షాకవ్వాల్సిందే!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
Realme 16T 5G: 8000mAh బ్యాటరీతో అదరగొట్టే 5G ఫోన్.. 50MP కెమెరా, 144Hz డిస్ప్లే
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
AP Rain Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ప్రభుత్వం అలర్ట్! జిల్లాల్లో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు..!
ట్రెండింగ్
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?
-
Masala Gutti Vankaya Recipe: బగారా రైస్, పులావ్లోకి అదిరిపోయే “మసాలా గుత్తివంకాయ” చేసేయండి ఇలా..! లొట్టలేసుకుంటూ తినేస్తారంతే.!
-
7.62mm స్లిమ్ డిజైన్, 7,100mAh బ్యాటరీతో రానున్న Nubia NaviX Ultra..!
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!