Iran War: ఇరాన్ యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా ‘‘ఇంధన సంక్షోభం’’ ఏర్పడుతోంది. ముఖ్యంగా, ఇజ్రాయిల్ అమెరికా దాడుల కారణంగా ఇరాన్ ఇంధన రవాణాకు చాలా కీలకమైన ‘‘హార్ముజ్ జలసంధి’’ని మూసేసింది. దీంతో ఇప్పుడు బ్యారెల్ క్రూడాయిల్ ధర 112 డాలర్లకు చేరుకుంది. అమెరికాలో గ్యాస్ ధర గ్యాలన్కు 5 డాలర్లు దాటాయి. దీంతో ట్రాన్స్పోర్ట్ ఖర్చులు తీవ్రంగా పెరుగుతున్నాయి. ఇదే కాకుండా, ఇంధన సంక్షోభం కారణంగా విమాన సర్వీసులు కూడా తగ్గుతున్నాయి. దీంతో ప్రమాణ ఖర్చులు మరింత…
LPG BOOKINGS: దేశంలో వంట గ్యాస్ (LPG) డిమాండ్ తీరు మారిందని, ప్రజల్లో ఆందోళన పెరిగిందని, దీంతో ఎక్కువగా ఎల్పీజీని కొనుగోలు చేస్తున్నారని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. అయితే, దేశంలో వంట గ్యాస్ కొరత లేదని, ఎల్పీజీ ఉత్పత్తి 30 శాతం మేర పెరిగిందని తెలిపింది.
LPG crisis: మిడిల్ ఈస్ట్ యుద్ధం భారతదేశంపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. ముఖ్యంగా భారతదేశ వంటిళ్లు, రెస్టారెంట్-హోటళ్లలో ‘‘ఎల్పీజీ మంటలు’’ చెలరేగుతున్నాయి. దేశవ్యాప్తంగా ఎల్పీజీ గ్యాస్ సమస్య ఏర్పడుతోంది. ముఖ్యంగా, గృహ వినియోగదారులపై ఎలాంటి ప్రభావం పడకుండా ఉండేలా కేంద్రం చర్యలు చేపడుతోంది. మరోవైపు, కమర్షియల్ వినియోగదారులు తీవ్రంగా ఇబ్బందిపడుతున్నారు.
ఇరాన్తో అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధం చమురు, గ్యాస్ సరఫరాలను ప్రభావితం చేస్తోంది. గ్యాస్ సరఫరాలో అంతరాయం దేశవ్యాప్తంగా LPG కొరతకు కారణమవుతోంది. గ్యాస్ సిలిండర్ల బుకింగ్, డెలివరీకి సంబంధించిన నిబంధనలను ప్రభుత్వం సవరించింది. గ్యాస్ సిలిండర్లను పొందడానికి గ్యాస్ ఏజెన్సీల వద్ద పొడవైన క్యూలు దర్శనమిచ్చాయి. ఉజ్వల యోజన లబ్ధిదారులు కూడా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. గ్యాస్ కొరత కారణంగా వారికి సబ్సిడీలు అందతాయో లేదో అని ఆందోళనకు గురవుతున్నారు. Also Read:Arshdeep Singh and Daryl Mitchell Controversy:…
ఇదివరకు గ్యాస్ ధరలు పెరుగుతాయోమోనన్న భయం ఉండేది. ఇప్పుడు అసలు గ్యాసే దొరకదేమో అన్న భయం వెంటాడుతోంది. దీనికి కారణం మిడిల్ ఈస్ టెన్షన్స్. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల కారణంగా, LPG గ్యాస్ గురించి ఆందోళనలు పెరుగుతున్నాయి. తత్ఫలితంగా, ప్రభుత్వం గ్యాస్ బుకింగ్ నియమాలను సవరించింది. అయితే గ్యాస్ కు ప్రత్యామ్నాయంగా ఎలక్ట్రిక్ కుక్కర్లు, ఇండక్షన్ స్టవ్స్ అందుబాటులో ఉన్నాయి. గ్యాస్ లేకుండా ఉపయోగించగల ఆన్లైన్లో అందుబాటులో ఉన్న ఉత్తమ స్మార్ట్ కుక్కర్ల…
LPG Crisis: మధ్యప్రాచ్యంలో ఇరాన్ యుద్ధం ప్రపంచ వ్యాప్తంగా ‘‘చమురు మంటలు’’ రేపుతున్నాయి. చాలా దేశాల్లో చమురు, గ్యాస్ సంక్షోభం నెలకొంది. భారత్లో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. అయితే, కేంద్రం మాత్రం ఎలాంటి భయాలు పెట్టుకోవద్దని, సరిపడా నిల్వలు ఉన్నట్లు చెప్పింది. 10 శాతం ఎల్పీజీ ప్రొడక్షన్ పెంచినట్లు కేంద్రం చెప్పింది. Read Also: కిడ్నీలు జీవితాంతం ఆరోగ్యంగా ఉండాలంటే.. ఇవి తినండి చాలు.! ఈ ఆందోళనలు, భయాల మధ్య ఉత్తర్ ప్రదేశ్లో కొందరు దొంగలు LPG)…
LPG production: ఇరాన్ యుద్ధం దేశ ఇంధర రంగంపై ప్రభావం చూపుతోంది. మధ్యప్రాచ్యం నుంచి చమురు రవాణాకు అత్యంత కీలకంగా ఉన్న ‘‘హార్ముజ్ జలసంధి’’ని ఇరాన్ మూసేయడంతో భారత్తో సహా ఆసియా, ఇతర దేశాలు సంక్షోభం వైపు పయణిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు, ఇరాన్ గల్ఫ్ దేశాలైన కువైట్, బహ్రైయిన్, సౌదీ అరేబియా, ఖతార్, యూఏఈలలోని చమురు, గ్యాస్ క్షేత్రాలపై దాడులు చేస్తోంది. ఈ నేపథ్యంలో ఆయా దేశాలు ప్రొడక్షన్ నిలిపేశాయి. దీంతో, దేశంలో ఇంధన భయాలు…
LPG Crisis: ఇరాన్, ఇజ్రాయిల్ మధ్య యుద్ధం ప్రపంచాన్ని ఇంధన సంక్షోభంలోకి నెట్టింది. ముఖ్యంగా భారత్లో LPG కొరత ఏర్పడుతోంది. ఇప్పటికే బెంగళూర్, చెన్నై, ముంబై, హైదరాబాద్ వంటి నగరాల్లో గ్యాస్ కొరత కారణంగా హోటల్, రెస్టారెంట్లు మూతపడుతున్నాయి. ఈ నేపథ్యంలో సమస్య పరిష్కారానికి ప్రధాని నరేంద్రమోడీతో ఈ రోజు(మంగళవారం) పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పూరి, విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ఉన్నతస్థాయి చర్చలు జరిపారు.
Vizag Hotels Face Closure Threat as Commercial LPG Shortage: పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ వాతావరణం ప్రపంచవ్యాప్తంగా అనేక రంగాలపై ప్రభావం చూపుతోంది. ముఖ్యంగా ముడి చమురు, గ్యాస్ సరఫరాలో తీవ్ర అంతరాయం ఏర్పడడంతో అనిశ్చితి పరిస్థితులు నెలకొన్నాయి. ఈ పరిణామాల ప్రభావం భారత్లో కూడా కనిపిస్తోంది. ముఖ్యంగా ఎల్పీజీ గ్యాస్ సరఫరాలో సమస్యలు తలెత్తడంతో పలు రంగాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. యుద్ధ ప్రభావం ఇప్పుడు పర్యాటక నగరం విశాఖపట్నంలోని హోటల్ రంగానికీ తాకింది. వాణిజ్య…