Giriraj Singh: లవ్ జిహాద్ రూపంలో ఉగ్రవాదం కుట్ర పన్నుతోంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Love Jihad Is New Form Of Terrorism Says Union Minister Giriraj Singh: కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉగ్రవాదం ‘లవ్ జిహాద్’ అనే కొత్తం రూపం దాల్చిందని బాంబ్ పేల్చారు. మాజీ ఎమ్మెల్యే కృష్ణానంద్రాయ్ వర్ధంతి సందర్భంగా మహ్మదాబాద్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. లవ్ జిహాద్ రూపంలో ఉగ్రవాదం ‘సనాతన ధర్మాన్ని’ అంతం చేసేందుకు మురికి కుట్ర పన్నుతోందన్నారు. ఆ కుట్రను భగ్నం చేయాలంటే.. మనమంతా ఏకం అవ్వాలని పిలుపునిచ్చారు. అంతేకాదు.. బిహార్లో మత మార్పిడులు చాలా వేగంగా జరుగుతున్నాయని ఆరోపించారు. మహాగట్ బంధన్ ప్రభుత్వం కేవలం తన ముస్లిం ఓటు బ్యాంకు గురించే ఆందోళన చెందుతోందని, మతమార్పిడి నిరోధక చట్టం తీసుకురావాల్సిన అవసరం ఉందని పునరుద్ధాటించారు. సీమాంచల్ (నేపాల్, పశ్చిమ బెంగాల్ సరిహద్దులు) ప్రాంతంలో అయితే పరిస్థితి మరీ తీవ్రంగా ఉందని.. ఆ జిల్లాల్ని సందర్శిస్తే, బంగ్లాదేశ్లోకి ప్రవేశించామా? అనే సందేహాలు కలుగక మానదని పేర్కొన్నారు. తన సొంత నియోజకవర్గమైన బెగుసరాయ్తో పాటు బిహార్లోని ఇతర జిల్లాల్లో కూడా క్రైస్తవ మిషనరీలు మత మార్పిడులకు పాల్పడుతున్నారని గిరిరాజ్ సింగ్ ఆరోపణలు చేశారు.
ఇదే సమయంలో.. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రపై కూడా గిరిరాజ్ సింగ్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఈ యాత్ర హిందూ ద్వేషులను ఏకం చేయడానికి రాహుల్ ప్రయత్నిస్తున్నారని వ్యాఖ్యానించారు. ఆయన భారత్ను ఏకం చేస్తున్నాడా లేదా హిందువులపై ద్వేషంతో నిండిన ‘తుక్డే-తుక్డే’ ముఠా, క్రైస్తవ మతగురువులను ఏకతాటిపైకి తీసుకువస్తున్నాడా? అని ప్రశ్నించారు. తనను నాశనం చేసేందుకు మోడీ కోట్లు ఖర్చు పెడుతున్నారని రాహుల్ చేసిన వ్యాఖ్యల్ని ఖండిస్తూ.. తన సొంత పార్టీనే నాశనం చేస్తున్న వ్యక్తి, నాశనం చేయడం గురించి ఎలా మాట్లాడగలడు? అని చురకలంటించారు. అలాగే, జనాభా నియంత్రణ చట్టాలను రూపొందించాల్సిన అవసరం ఉందని సింగ్ చెప్పారు. ఇటువంటి విధానాలు దేశ సమగ్ర అభివృద్ధికి తోడ్పడుతాయని పేర్కొన్నారు. చైనాలో నిమిషానికి 10 మంది పిల్లలు పుడుతుంటే, మన దేశంలో నిమిషానికి 31 మంది పిల్లలు పుడుతున్నారని.. దీని కారణంగా ఇప్పటి వరకు అభివృద్ధి వేగంగా జరగలేదని అన్నారు. ముస్లిం సమాజంపై తమ ప్రభుత్వానికి ఎలాంటి ద్వేషం లేదని.. అయితే రాడికల్ కరడుగట్టినవారు సమాజంలో ద్వేషాన్ని వ్యాప్తి చేస్తున్నారని గిరిరాజ్ సింగ్ వెల్లడించారు.
Also Read
- NEET Paper Leak: పేపర్ సెట్ చేసినవారే లీక్ చేశారు.. NEET స్కాంలో మరో టీచర్ అరెస్ట్..
- PM Modi: ప్రపంచం కొత్త సవాళ్లను ఎదుర్కొంటోంది.. భారత్ విశ్వసనీయ వారధి అన్న మోడీ
- Dhurandhar 2: బ్యాన్ చేసిన దేశంలో బ్లాక్బస్టర్.. దాయాది దేశంలో ‘‘ధురంధర్ 2’’ క్రేజ్..
- Karnataka: కేరళం ముగిసింది.. నెక్ట్స్ కర్ణాటకనేనా? ఈసారి ఢీ అంటే ఢీ తప్పదా?
తాజావార్తలు
-
YS Jagan: కూటమి ప్రభుత్వ పనితీరుపై జగన్ ఆసక్తికర ట్వీట్
-
Peddi: పెద్ది ట్రైలర్’పై చిరు రివ్యూ.. డైలాగ్ లీక్
-
NEET Paper Leak: పేపర్ సెట్ చేసినవారే లీక్ చేశారు.. NEET స్కాంలో మరో టీచర్ అరెస్ట్..
-
Bandi Bhagirath : బండి భగీరథ్ కోసం ముమ్మర వేట.. రంగంలోకి నాలుగు ప్రత్యేక బృందాలు..!
-
PM Modi: ప్రపంచం కొత్త సవాళ్లను ఎదుర్కొంటోంది.. భారత్ విశ్వసనీయ వారధి అన్న మోడీ
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..