Lok Sabha Passed Delhi Services Bill : ఢిల్లీ ఆర్డినెన్సు బిల్లుకు లోకసభ ఆమోదం… బిల్కి నిరసనగా ప్రతిపక్షాలు వాకౌట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Lok Sabha Passed Delhi Services Bill: ఢిల్లీ ఆర్డినెన్సు బిల్లుకు లోక్సభ ఆమోదించింది. బిల్లును వ్యతిరేకిస్తూ ప్రతిపక్షాల వాకౌట్ చేశాయి. విపక్షాల వాకౌట్, నిరసనల మధ్య కేంద్రం ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లును ఆమోదించింది. ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లును.. ఢిల్లీ సేవల బిల్లు, అధికారికంగా ది గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ (సవరణ) బిల్లు- 2023 అని పిలుస్తారు. ఈ బిల్లు గురువారం లోక్సభలో ఆమోదించబడింది. బిల్లును వ్యతిరేకిస్తూ ప్రతిపక్ష ఎంపీలు నిరసనగా వాకౌట్ చేశారు. ఢిల్లీ సర్వీసెస్ బిల్లు చాలా సేవలపై ఢిల్లీ ప్రభుత్వానికి నియంత్రణను ఇస్తూ సుప్రీం కోర్టు ఆదేశాలను భర్తీ చేసే ప్రస్తుత ఆర్డినెన్స్.
Read also: Space : అంతరిక్షంలో మనుషులు చనిపోతే.. మృతదేహాలను ఏం చేస్తారో తెలుసా?
Also Read
- Tamil Nadu: సీఎం విజయ్ కీలక నిర్ణయం.. ఇకపై ఏసీ ప్రభుత్వ బస్సులే ఉంటాయని ప్రకటన
- Mumbai: ముంబైలో ఘోరం.. స్కూల్ వ్యాన్పై కూలిన భారీ వృక్షం.. 11 ఏళ్ల విద్యార్థి మృతి
- Monsoon Shock: 125 ఏళ్ల తర్వాత ముఖం చాటేసిన వరుణుడు.. ఐదో అత్యంత పొడి జూన్గా రికార్డ్
- SC ST Atrocities Act: బాంబే హైకోర్టు సంచలన తీర్పు.. ఇస్లాంలోకి మారితే SC/ST ఎట్రాసిటీ యాక్ట్ వర్తించదు!
లోక్సభలో బిల్లు ఆమోదం పొందడంపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్పందిస్తూ.. ఢిల్లీకి ‘పూర్తి రాష్ట్ర హోదా’ ఇస్తామని బీజేపీ గతంలోనే హామీ ఇచ్చిందని అన్నారు. బదిలీ పోస్టింగ్లపై రాష్ట్ర నియంత్రణను తీసివేసే బిల్లుపై నిరాశను వ్యక్తం చేసిన కేజ్రీవాల్, “ఈ రోజు, ఈ వ్యక్తులు (బిజెపి) ఢిల్లీ ప్రజలను వెన్నుపోటు పొడిచారు” అని అన్నారు. ‘ఢిల్లీకి పూర్తి రాష్ట్ర హోదా కల్పిస్తామని బీజేపీ పదే పదే హామీ ఇచ్చింది. 2014లో మోదీ స్వయంగా ప్రధాని అయ్యాక ఢిల్లీకి పూర్తి రాష్ట్ర హోదా కల్పిస్తామని చెప్పారు. కానీ ఈరోజు ఢిల్లీ ప్రజల వెన్నుపోటు పొడిచారు. ఇక నుంచి మోదీ జీని నమ్మొద్దు’’ అని అరవింద్ కేజ్రీవాల్ ఎక్స్ (గతంలో ట్విటర్గా పిలిచేవారు)లో పేర్కొన్నారు.
Read also: SIIMA 2022: బెస్ట్ డైరెక్టర్ కేటగిరీలో జక్కన్నతో పోటీలో ఆ నలుగురు కుర్ర దర్శకులు
ఢిల్లీ ఆర్డినెన్సు బిల్లుపై లోక్సభలో జరిగిన చర్చలు అన్ని పక్షాలు పాల్గొన్నాయి. ఢిల్లీ ఆర్డినెన్సు బిల్పై చర్చ సందర్భంగా ఆప్ ఎంపి సుశీల్ కుమార్ రింక్ వెల్లోకి దూసుకెళ్లి బిల్ పేపర్లను చింపి స్పీకర్ టేబుల్పైకి విసిరి తమ నిరసనను వ్యక్తం చేశారు. స్పీకర్ టేబుల్ పై కాగితాలు విసిరేసి, సభాగౌరవానికి భంగం కలిగించినందుకు ఆప్ ఎంపీ సుశీల్ కుమార్ రింక్ను స్పీకర్ సస్పెండ్ చేశారు. ఈ వర్షాకాల సమావేశాలు పూర్తయ్యేంత వరకు సభ కార్యక్రమాలకు హాజరుకాకుండా రింకు ను సస్పెండ్ చేస్తూ స్పీకర్ ఆదేశాలు జారీ చేశారు. చర్చ అనంతరం కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా సభకు సమాధానం ఇచ్చారు. దేశ రాజధానిలో బ్యూరోక్రాట్లను ఎవరు నియంత్రిస్తారనే దానిపై సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను అధిగమించేందుకు ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లును హోంమంత్రి అమిత్ షా సమర్థించారు.”ఈ ఆర్డినెన్స్ జాతీయ రాజధాని ఢిల్లీకి సంబంధించిన ఏదైనా అంశంపై చట్టాలను రూపొందించే హక్కు పార్లమెంటుకు ఉందని సుప్రీం కోర్టు ఆదేశాన్ని సూచిస్తుంది. ఢిల్లీ కోసం చట్టాలు చేయడానికి కేంద్రాన్ని అనుమతించే నిబంధనలు రాజ్యాంగంలో ఉన్నాయి” అని ఢిల్లీ గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ (సవరణ) బిల్లు- 2023ని ప్రస్తావిస్తూ అమిత్ షా అన్నారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy : రైతు భరోసా నిధులు విడుదల చేసిన సీఎం రేవంత్
-
Bread Pakoda Recipe: కరకరలాడే స్ట్రీట్ స్టైల్ ‘బ్రెడ్ పకోడా’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IND vs ENG: సిక్సర్ల వేటలో జోస్ బట్లర్కు సవాల్ విసురుతున్న అభిషేక్ శర్మ.. టాప్-5 బ్యాటర్ల లిస్ట్ ఇదే!
-
Tamil Nadu: సీఎం విజయ్ కీలక నిర్ణయం.. ఇకపై ఏసీ ప్రభుత్వ బస్సులే ఉంటాయని ప్రకటన
-
Alpha Movie Remunerations: హీరోల రేంజ్లో ఆలియా రెమ్యూనరేషన్.. అక్షరాల ఎన్ని కోట్లో తెలుసా?
ట్రెండింగ్
-
Kitchen Tips: ఫ్రిజ్ శబ్దం పెరిగిందా.? టెక్నీషియన్ను పిలవకుండా ఇంట్లోనే ఇలా చేయండి.!
-
Income Tax Returns: ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు అలెర్ట్.. జూలైలో మిస్ కాకూడని ముఖ్యమైన డెడ్లైన్లు ఇవే.!
-
Spider Control : వర్షాకాలంలో సాలీళ్ల బెడదా.? ఈ సహజమైన స్ప్రేలతో చెక్ పెట్టండి.!
-
Weight Loss Dosa : నూనె తక్కువ, ప్రోటీన్ ఎక్కువ..! ఆరోగ్యకరమైన మసూర్ బెలే దోస రెసిపీ
-
Black Jamun: నేరేడు పండు.. చిన్న పండులో బోలెడు ఆరోగ్య రహస్యాలు.. పోషకాలు మెండు కూడా.!