Space : అంతరిక్షంలో మనుషులు చనిపోతే.. మృతదేహాలను ఏం చేస్తారో తెలుసా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అంతరిక్షంలోకి వెళ్లడమే పెద్ద సాహసం అనే చెప్పాలి.. ఇక ప్రాణాల మీద ఆశలు వదులుకున్న వారే వెళ్తారు.. అంతరిక్షంలో రహస్యాలను చేధించేందుకు గానూ భారతదేశంతో సహా ప్రపంచంలోని ఎన్నో దేశాలు అంతరిక్ష ప్రయాణాలు చేయడం సాధారణమైపోయింది. ఒకప్పుడు అంతరిక్ష ప్రయాణాలు చాలా అరుదుగా ఉండేవి. రానురాను ఈ అంతరిక్ష ప్రయాణాల పరంపర పెరుగుతోంది. 60ఏళ్ళ క్రితం అంతరిక్ష పరిశోధనలు ప్రారంభమయ్యాయి. అప్పటి నుండి ఇప్పటి వరకు అంటే 60ఏళ్ళ కాలంలో అంతరిక్ష పరిశోధనల్లో భాగంగా 20మంది మరణించారు.. అయితే అక్కడ మరణించిన వారి మృతదేహలను ఏం చేస్తారు అనే ప్రశ్నలు అందరికి వస్తాయి.. ఈ ప్రశ్నలకు సమాధానం దొరికిందని చెప్పాలి..
తాజాగా హ్యూస్టన్లోని బేలర్ కాలేజ్ ఆఫ్ మెడిసిన్కు చెందిన స్పేస్ మెడిసిన్, ఎమర్జెన్సీ ప్రొఫెసర్ ఇమాన్యుయేల్ ఉర్కెట సమాధానమిచ్చారు.. ఇక అలా చనిపోయిన వారిని కొన్ని గంటల వ్యవధిలోనే భూమీదకు తీసుకొస్తారు.. అదే విధంగా చంద్రును మీదకు వెళ్లినప్పుడు చనిపోతే కొన్ని రోజుల సమయం పడుతుందని ఆయన తెలిపారు.. స్థిరమైన ఉష్ణోగ్రత ఉండే వ్యోమనౌకలో నుంచి స్పేస్సూట్ లేకుండా వ్యోమగామి చంద్రుడు, అంగారకుడిపై అడుగుపెడితే వాతావరణ కారణాలతో వెంటనే ప్రాణాలు కోల్పోతారు. అంతరిక్షంలో మృతదేహాలను దహనం చేయడం వల్ల మృతదేహాలపై ఉండే బ్యాక్టీరియా, ఇతర సూక్ష్యక్రిములు అక్కడి వాతావరణంలో కలిసిపోయి కలుషితం చేస్తాయి..
Also Read
- America : భారతీయుల నెత్తిన మరో భారీ పిడుగు.. ఆందోళనలో లక్షలాది మంది పౌరులు
- ATA Vedukalu 2025: తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎత్తున 'ఆటా వేడుకలు'.. ఫుల్ డీటెయిల్స్ ఇవే!
- NRI Arrest: భార్యపై వేధింపులు.. అమెరికాలో తిరుపతికి చెందిన ఎన్నారై అరెస్టు
- Kodela Sivaram : టాంపాలో కొడెల శివరామ్తో తెలుగు వారి ఆత్మీయ సమావేశం విజయవంతం
అందుకే మృత దేహాలను భద్ర పరచి కుటుంబసభ్యులకు అందచేస్తారు.. 60 ఏండ్ల క్రితమే అంతరిక్ష యాత్ర మొదలైంది. ఇప్పటివరకు 20 మంది వ్యోమగాములు మరణించారు. 1986 నుంచి 2003 వరకు నాసా నిర్వహించిన ప్రయోగాల్లో 14 మంది చనిపోగా, 1967లో జరిగిన అపోలో లాంచ్ప్యాడ్ అగ్ని ప్రమాదంలో ముగ్గురు, 1971లో నిర్వహించిన సోయుజ్ 11 ప్రయోగంలో మరో ముగ్గురు వ్యోమగాములు మరణించారు. ఇకపోతే భూమికి దగ్గరగా ఉండే గ్రహాల మీద చనిపోతే భూమీదకు కొన్ని గంటల వ్యవధిలోనే తీసుకురావచ్చునని.. అదే 300 మిలియన్ మైళ్ల దూరంలోని అంగారకుడిపై మరణం సంభవిస్తే మాత్రం ఆ మృతదేహాన్ని తీసుకురావడం ఆలస్యమవుతుంది. మిషన్ను మధ్యలో ఆపేసి మిలియన్ మైళ్ల దూరం నుంచి అర్ధాంతరంగా వారు తిరిగిరాలేరు.. కొన్ని ఏళ్లు పడుతుంది.. మృతదేహాలను భద్ర పరచి తీసుకొని వస్తారు.. కొన్ని కెమికల్స్ వాడి బాడీని స్టోర్ చేస్తారని చెబుతున్నారు..
తాజావార్తలు
-
Zim vs Ban: ‘ఇన్నోసెంట్ కైయా’ సెంచరీ.. బంగ్లాదేశ్పై ఇన్నింగ్స్ తేడాతో జింబాబ్వే ఘన విజయం.!
-
2026 Half Year: అర్థ సంవత్సరంలో అంతర్జాతీయంగా జరిగిన విశేషాలు ఇవే!
-
Trisha: త్రిష పొలిటికల్ ఎంట్రీ ఫిక్స్? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్!
-
Brahmanandam: బ్రహ్మాజీ పరువు తీసేసిన బ్రహ్మానందం!
-
Farmer Job Offer: జాబ్ ఆఫర్ చేసిన మహిళా రైతు.. ఉదయం 6 నుంచి 2 గంటల వరకు పని.. టీ, బ్రేక్ఫాస్ట్ ఫ్రీ..
ట్రెండింగ్
-
Bread Pakoda Recipe: కరకరలాడే స్ట్రీట్ స్టైల్ ‘బ్రెడ్ పకోడా’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Kitchen Tips: ఫ్రిజ్ శబ్దం పెరిగిందా.? టెక్నీషియన్ను పిలవకుండా ఇంట్లోనే ఇలా చేయండి.!
-
Income Tax Returns: ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు అలెర్ట్.. జూలైలో మిస్ కాకూడని ముఖ్యమైన డెడ్లైన్లు ఇవే.!
-
Spider Control : వర్షాకాలంలో సాలీళ్ల బెడదా.? ఈ సహజమైన స్ప్రేలతో చెక్ పెట్టండి.!
-
Weight Loss Dosa : నూనె తక్కువ, ప్రోటీన్ ఎక్కువ..! ఆరోగ్యకరమైన మసూర్ బెలే దోస రెసిపీ