Karnataka Elections: బీజేపీ, కుమారస్వామి మంతనాలు చేయనివ్వండి.. మాదే విజయమన్న డీకే శివకుమార్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Karnataka Elections: కర్ణాటక ఎన్నికల ఫలితాలకు మరికొన్ని గంటల సమయం ఉంది. రేపు మధ్యాహ్నం వరకు ఏ పార్టీ అధికారంలోకి రాబోతుందో అనే స్పష్టత వస్తుంది. ఇదిలా ఉంటే తాము ఒంటరిగానే అధికారంలోకి వస్తామని మరోసారి ధీమా వ్యక్తం చేశారు కర్ణాటక పీసీసీ చీఫ్ డీకే శివకుమార్. పొత్తులపై ఊహాగానాలను తోసిపుచ్చారు. 224 మంది సభ్యుల అసెంబ్లీలో దాదాపు 150 సీట్లు గెలుస్తామని, మెజారిటీ మార్కు 113 కంటే ఎక్కువగా గెలుస్తామన్న పార్టీ అంచనాకు కట్టుబడి ఉన్నానని అన్నారు.
Read Also: CBSE Class 10 Results: సీబీఎస్ఈ 10వ తరగతి పరీక్షా ఫలితాలు విడుదల.. 93.12 శాతం ఉత్తీర్ణత
Also Read
- Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
- Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
- Bangladesh: భారత్, పాకిస్థాన్ను దాటేసిన బంగ్లాదేశ్.. ఏ విషయంలోనో తెలుసా?
- Pakistan: పాకిస్తాన్ మరోసారి.. భారత విమానాలపై గగనతల ఆంక్షలు పొడగింపు..
నా అంచనాలు మారవని, కాంగ్రెస్ తప్పకుండా అధికారంలోకి వస్తుందని, మాకు పెద్ద నాయకులు బలం ఉంది, మా జాతీయ నాయకులు ప్రచారంలో సత్తా చాటారని అన్నారు. హంగ్ అసెంబ్లీ ఏర్పడితే కింగ్ మేకర్ పాత్ర పోషిస్తుందని భావిస్తున్న జేడీఎస్, కాంగ్రెస్ మధ్య ఎటువంటి చర్చలు జరగలేదని ఆయన అన్నారు. బీజేపీ, జేడీఎస్ ను బుజ్జగించేందుకు ప్రయత్నిస్తుందనే దానిపై తాను వ్యాఖ్యానించనని అన్నారు. బీజేపీ, కుమారస్వామి మంతనాలు చేస్తే చేయనీయండి అంటూ, అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్ పార్టీనే అని అన్నారు.
దక్షిణాదిలో బీజేపీకి కంచుకోటగా కర్ణాటక రాష్ట్రం ఉంది. అయితే 2024 లోక్ సభ ఎన్నికలకు ముందు జరుగుతున్న ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎలాగైనా గెలిచి మోడీ మ్యాజిక్ పనిచేయలేదని దేశానికి చెప్పాలని అనుకుంటోంది. అన్ని ఎగ్జిట్ పోల్ సర్వేలు కూడా హంగ్ అసెంబ్లీ ఏర్పడుతుందని, లేకపోతే కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని తమ ఫలితాలను వెల్లడించాయి. కొన్ని మాత్రం బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తాయని చెబుతోంది. కర్ణాటక మాజీ సీఎం, బీజేపీ నేత బీస్ యడియూరప్ప బీజేపీకి 115 కంటే ఎక్కవ సీట్లు వస్తాయని అంచానా వేశారు.
తాజావార్తలు
-
OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
-
Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
-
Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
-
Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
-
Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!