Lalu Prasad Yadav: పీఎఫ్ఐ లాగే ఆ సంస్థను కూడా నిషేధించాలి.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Lalu Prasad Yadav’s demand to ban RSS: రాడికల్ ఇస్లామిక్ సంస్థ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా( పీఎఫ్ఐ) కోరలు పీకే పనిలో ఉంది కేంద్ర ప్రభుత్వం. ఇప్పటికే రెండు విడతలుగా ఆపరేషన్ ఆక్టోపస్ పేరుతో దేశంలోని 15 రాష్ట్రాల్లో ఎన్ఐఏ, ఈడీ భారీ ఎత్తున పీఎఫ్ఐపై దాడులు చేసింది. ఈ సంస్థ కీలక వ్యక్తులు, కార్యకర్తలను అరెస్ట్ చేసింది. ఎన్ఐఏ విచారణలో విస్తూపోయే నిజాలు బయటకు వస్తుండటంతో పీఎఫ్ఐని బ్యాన్ చేయాలని దేశవ్యాప్తంగా పలు సంఘాలు కోరుతున్నాయి. ముస్లిం సంఘాలు కూడా దేశంలో విచ్ఛిన్నానికి ప్రయత్నిస్తున్న పీఎఫ్ఐని బ్యాన్ చేయాలని పిలుపునిచ్చాయి.
ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఐదేళ్ల పాటు పీఎఫ్ఐ సంస్థను నిషేధించింది. దీనిపై పలు రాష్ట్రాల సీఎంలు హర్షం చేశారు. అయితే కొంత మంది మాత్రం పీఎఫ్ఐ పై బ్యాన్ విధించడం ఓకే కానీ.. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) సంగతేంటని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ పీఎఫ్ఐ బ్యాన్ ను తప్పుపట్టారు. ఆర్ఎస్ఎస్ ను కూడా నిషేధించాలని డిమాండ్ చేశారు.
Also Read
- Railways: మొన్న హనీమూన్, నేడు బర్త్ డే.. వివాదాల పాలవుతున్న రైల్వే..
- Prakash Raj: "నా ఓటు తొలగించి, ఆట మొదలుపెట్టారు".. SIRపై ప్రకాష్ రాజ్ వార్నింగ్..
- Delhi Alert: రెడ్ఫోర్ట్ నుంచి మెట్రో స్టేషన్ల వరకు నిఘా.. ఢిల్లీలో భద్రత కట్టుదిట్టం.. 19 మంది ఉగ్రవాదుల పోస్టర్లు విడుదల..
- Government Schools Decline: ఒకే ఏడాదిలో 9,900 ప్రభుత్వ పాఠశాలల మూత... తెలుగు రాష్ట్రాల్లో భారీగా..! కారణమేంటి?
Read Also: IND Vs SA: పోటాపోటీగా కోహ్లీ, రోహిత్ భారీ కటౌట్లు.. ఫోటోలు వైరల్
ఇదిలా ఉంటే కేంద్ర నిర్ణయంపై ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ విరుచుకుపడ్దారు. పీఎఫ్ఐ లాగే ఆర్ఎస్ఎస్ ని కూడా బ్యాన్ చేయాలని డిమాండ్ చేశారు. పీఎఫ్ఐ లాగే ఆర్ఎస్ఎస్ కూడా విద్వేషాన్ని వ్యాప్తి చేస్తోందని.. అన్నింటి కన్నా ముందు ఆర్ఎస్ఎస్ ను బ్యాన్ చేయాలని.. ఇది పీఎఫ్ఐ కన్నా ప్రమాదకరమైన సంస్థ అని..గతంలో రెండు సార్లు ఆర్ఎస్ఎస్ ను బ్యాన్ చేసిన సంగతి గుర్తుంచుకోవాలని.. ఆర్ఎస్ఎస్ ను మొదటగా బ్యాన్ చేసింది ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ అని ట్విట్టర్ లో వ్యాఖ్యానించారు. ఆర్ఎస్ఎస్ హిందూ అతివాద సంస్థ అని దాన్ని నిషేధించాల్సి ఉందని అన్నారు.
మరోవైపు పీఎఫ్ఐ బ్యాన్ ను బీజేపీ నేతలు స్వాగతించారు. అజ్మీర్ దర్గా దీవాన్ ప్రభుత్వ చర్యలను స్వాగతించారు. ప్రభుత్వం పీఎఫ్ఐ సంస్థపై 5 ఏళ్లు నిషేధం విధించడంతో ఢిల్లీ షాహీన్ బాగ్ లోని ఆ సంస్థ కార్యాలయం వద్ద భారీ బందోబస్త్ ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రతను కట్టుదిట్టం చేశారు.
PFI की तरह जितने भी नफ़रत और द्वेष फैलाने वाले संगठन हैं सभी पर प्रतिबंध लगाना चाहिए जिसमें RSS भी शामिल है। सबसे पहले RSS को बैन करिए, ये उससे भी बदतर संगठन है।
आरएसएस पर दो बार पहले भी बैन लग चुका है। सनद रहे, सबसे पहले RSS पर प्रतिबंध लौह पुरुष सरदार पटेल ने लगाया था।
— Lalu Prasad Yadav (@laluprasadrjd) September 28, 2022
తాజావార్తలు
-
Railways: మొన్న హనీమూన్, నేడు బర్త్ డే.. వివాదాల పాలవుతున్న రైల్వే..
-
Lenin OTT: జీ5లో ‘లెనిన్’ సెన్సేషన్.. రెండు రోజుల్లోనే 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్!
-
Viswanath and Sons’ Censor : విశ్వనాథ్ అండ్ సన్స్’ సెన్సార్ టాక్.. సింపుల్ బ్లాక్బస్టర్
-
USA: ఉద్యోగంలో చేరిన కొన్ని రోజులకే.. అమెరికాలో ఏపీకి చెందిన టెక్కీ మృతి..
-
Public Wi-Fi Risks: ఎయిర్పోర్ట్, రైల్వేస్టేషన్, హోటళ్లు.. ఇలా పబ్లిక్ Wi-Fiకి కనెక్ట్ అవుతున్నారా? ఈ జాగ్రత్తలు తప్పనిసరి
ట్రెండింగ్
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..
-
Beetroot Dosa: ఎప్పుడు మాములు దోసలేనా..? కొత్తగా క్రిస్పీ & హెల్దీ బీట్రూట్ దోస చేసేయండి ఇలా.!
-
890cc V-Twin ఇంజిన్, కొత్త చాసిస్, కొత్త లుక్ తో Ducati Monster V2 లాంచ్.. ధర ఎంతంటే..?