Lalu Prasad Yadav: విషమంగా ఆర్జేడీ ఛీఫ్ పరిస్థితి!.. కదలికలు లేని స్థితిలో లాలూ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోగ్యం విషమంగా ఉన్న విషయం తెలిసిందే. లాలూ ప్రసాద్ యాదవ్ కదల్లేకపోతున్నారని ఆయన తనయుడు, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ చెప్పారు. ఇటీవల ఆదివారం తన ఇంట్లో మెట్లపై నుంచి లాలూ కింద పడిపోవడంతో కుడి భుజంతోపాటు మూడు చోట్ల ఫ్రాక్చరైంది. దీంతో కండరాలు, కీళ్లు పట్టేసి సమస్య తీవ్రంగా ఉందని తేజస్వి చెప్పారని ఓ వార్తా సంస్థ తెలిపింది. అందువల్ల ఎక్కువగా కదల్లేకపోతున్నారని తెలిపారు. త్వరలో కోలుకుంటారని తాము ఆశిస్తున్నట్లు చెప్పారు. తామంతా ఆస్పత్రిలో ఆయన వెంటే ఉన్నామని వివరించారు.
కొంతకాలంగా కిడ్నీ, హృదయ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన.. ప్రస్తుతం దిల్లీ ఎయిమ్స్లో చికిత్స పొందుతున్నారు. అయితే.. కండరాలు, కీళ్లు పట్టేయడంతో లాలూ శరీర కదలికలు అతి స్వల్పంగా ఉన్నాయంటూ ఆయన తనయుడు, ఆర్జేడీ నేత తేజస్వీయాదవ్ వెల్లడించారని ఓ వార్తాసంస్థ తెలిపింది. తొలుత పాట్నాలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందిన లాలూను.. మెరుగైన చికిత్స కోసం బుధవారం రాత్రి దిల్లీలోని ఎయిమ్స్కు తరలించారు. ప్రత్యేక వైద్యుల పర్యవేక్షణలో చికిత్స అందిస్తున్నారు. నాన్న వైద్య అవసరాలు ఎయిమ్స్ వైద్యులకు తెలుసునని, అందుకే ఢిల్లీ ఎయిమ్స్లో చేర్చామని తేజస్వి యాదవ్ చెప్పారు. భుజానికి గాయమైన నేపథ్యంలో.. దిల్లీ వైద్యుల సలహా ప్రకారం ముందుకెళ్తామని తేజస్వీ తెలిపారు.
Also Read
- Ketan Murder Case: కేతన్ హత్య కేసులో కొత్త ట్విస్ట్.. ఇద్దరు తల్లుల మధ్య మాటల యుద్ధం!
- Bank Fraud: భారీ బ్యాంకు మోసం.. రూ.3.66 కోట్ల ఇన్సూరెన్స్ పాలసీలను అటాచ్ చేసిన ఈడీ.!
- MK Stalin: తిరుచ్చి ఈస్ట్ ఉపఎన్నికపై రాజకీయ ఉత్కంఠ.. స్టాలిన్ బరిలోకి దిగుతారా? డీఎంకేలో పెరుగుతున్న డిమాండ్
- Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
PM Narendra Modi: జాతీయ విద్యా విధానంపై ప్రధాని కీలక వ్యాఖ్యలు
`లాలూ ఆరోగ్యం కాసింత మెరుగు పడింది. ఆయన క్షేమం కోసం ప్రార్థించండి, త్వరలో ఇంటికి తరిగి వస్తారు` అని లాలూ సతీమణి రబ్రీదేవి చెప్పారు. లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోగ్యం క్షీణిస్తున్నదని, కిడ్నీ మార్పిడికి సింగపూర్కు వెళ్లేందుకు అనుమతించాలని ఇటీవల కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. భుజానికి గాయం కావడంతో ఢిల్లీలో ఎయిమ్స్ వైద్యుల సలహా మేరకు నిర్ణయం తీసుకుంటామని తేజస్వి యాదవ్ తెలిపారు. మరోవైపు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్.. తేజస్వి యాదవ్కు ఫోన్ చేసి లాలూ ఆరోగ్య పరిస్థితిపై వాకబు చేశారు. భుజానికి గాయమైన నేపథ్యంలో.. దిల్లీ వైద్యుల సలహా ప్రకారం ముందుకెళ్తామని తేజస్వీ తెలిపారు. బుధవారం బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్.. పట్నా ఆసుపత్రిలో లాలూను కలిసి పరామర్శించారు. ఆయన ఆరోగ్యం గురించి వైద్యులను వాకబు చేశారు.
తాజావార్తలు
-
RC17 Update: రామ్ చరణ్ కెరీర్లోనే తొలిసారి.. సుక్కు మాస్టర్ ప్లాన్ మాములుగా లేదుగా!
-
Oppo Reno 16 Series: ఒప్పో రెనో 16 సిరీస్ రిలీజ్.. 7000mAh బ్యాటరీ, 50MP కెమెరా, కొత్త మ్యాగ్నెటిక్ డిస్ప్లే
-
Ketan Murder Case: కేతన్ హత్య కేసులో కొత్త ట్విస్ట్.. ఇద్దరు తల్లుల మధ్య మాటల యుద్ధం!
-
Bank Fraud: భారీ బ్యాంకు మోసం.. రూ.3.66 కోట్ల ఇన్సూరెన్స్ పాలసీలను అటాచ్ చేసిన ఈడీ.!
-
Samantha: సమంతకు ముందే.. గర్భంతో నటించిన హీరోయిన్ ఎవరో తెలుసా? ప్రసవాన్నే సినిమాలో చూపించారు!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
-
Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉండే రుచికరమైన స్నాక్ “పెసర గారెలు” చేసేయండి ఇలా.!
-
Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3′ వస్తోంది!