Komatireddy Venkat Reddy: ప్రధానితో భేటీ కానున్న కోమటిరెడ్డి వెంకట్.. కారణమిదీ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Komatireddy Venkat Reddy: భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఈ నెల 16న ప్రధాని నరేంద్ర మోదీని కలవనున్నారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తన పార్లమెంట్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులపై చర్చించనున్నారు. రేపు ఉదయం 11 గంటలకు పార్లమెంట్లో ప్రధాని మోదీతో భేటీ కానున్నారు. మూసీ నది ప్రక్షాళనకు రూ.3 వేల కోట్లు ఇవ్వాలని మోదీని కోరనున్నారు. విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారి విస్తరణతో పాటు నమామి గంగానది తరహాలో పూడిక మట్టిని శుభ్రం చేసే అంశంపై కూడా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రధానితో చర్చించనున్నారు. ఎంఎంటీసీ, మెట్రో రైలు పనులపై కూడా వెంకట్ రెడ్డి చర్చించనున్నారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నిన్న ఢిల్లీలో ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేతో భేటీ అయ్యారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితిపై చర్చించారు. అయితే..మరోవైపు రాష్ట్ర రాజకీయ పరిస్థితులపై కూడా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చర్చించారు.
Read also: Shraddha Walkar: శ్రద్ధా వాకర్ హత్యలో కీలక పరిణామం.. డీఎన్ఏ ఫలితాలు చెప్తున్నది ఇదే..
Also Read
- Ketan Agarwal Case: కోటేశ్వరుడైన కేతన్ను సియా ఎందుకు వద్దనుకుంది? దర్యాప్తులో సంచలన విషయాలు
- Bullet Trains: హైదరాబాదీలకు గుడ్న్యూస్.. బుల్లెట్ ట్రైన్ కారిడార్లు ప్రకటించిన కేంద్రం
- Ketan Agarwal Case: కేతన్ను లోయలోకి తోసేముందు చేతన్ ఏమన్నాడో తెలుసా.. వెలుగులోకి కొత్త విషయాలు
- Ketan Agarwal Case: కేతన్-సియా కేసులో కొత్త ట్విస్ట్.. బ్లాక్మెయిల్ కోణంలో దర్యాప్తు..
ఎన్నికలకు నెల రోజుల ముందు రాజకీయాల గురించి మాట్లాడతానని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మూడు రోజుల క్రితం ప్రకటించారు. తాను ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్నానని చెప్పారు. అయితే.. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సోదరుడు రాజగోపాల్ రెడ్డి ఈ ఏడాది ఆగస్టు 4న కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. తన సోదరుడు కాంగ్రెస్ పార్టీని వీడినా కాంగ్రెస్ పార్టీలోనే ఉంటానని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రకటించారు. ఇటీవల జరిగిన మునుగోడు ఉప ఎన్నికల్లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు.
Read also: Rajinikanth At Ameenpeer dargah: అమీన్ పీర్ దర్గాలో రజనీకాంత్, రెహమాన్ సందడి
ఈ ఎన్నికల్లో రాజగోపాల్ రెడ్డికి ఓటు వేయాలని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు చెప్పిన ఆడియో సంభాషణ వైరల్గా మారింది. గతంలో జరిగిన ఉప ఎన్నికల్లో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ తరపున ప్రచారం చేయలేదు. ఎన్నికల సమయంలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లారు. ఈ సమయంలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కలకలం సృష్టించాయి. మునుగోడులో కాంగ్రెస్ పార్టీ గెలవదని వెంకట్ రెడ్డి అన్నారు. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ సంఘం కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసుకు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సమాధానమిచ్చారు. ఈ పరిణామాల కారణంగా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు.
Chiranjeevi V/s Balakrishana: బాలయ్యపై చిరంజీవి పై చేయి సాధించారా!?
తాజావార్తలు
-
The India Story: మనం తినేది అన్నమా? విషమా?.. భయపెడుతున్న ‘ది ఇండియా స్టోరీ’ టీజర్
-
Ketan Agarwal Case: కోటేశ్వరుడైన కేతన్ను సియా ఎందుకు వద్దనుకుంది? దర్యాప్తులో సంచలన విషయాలు
-
IAS Transfers : తెలంగాణలో 13 మంది ఐఏఎస్ ల బదిలీ
-
Deewana: సినిమా నచ్చి బై వన్ గెట్ వన్ ఆఫర్ ప్రకటించిన హీరో శ్రీ విష్ణు
-
Shani Trayodashi 2026: రేపే శని త్రయోదశి.. పొరపాటున కూడా ఈ 5 తప్పులు చేయొద్దు..
ట్రెండింగ్
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!