Kiren Rijiju: కాశ్మీర్ విలీనాన్ని ఆలస్యం చేసింది నెహ్రూనే.. మహారాజా హరిసింగ్ కాదు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nehru delayed Kashmir’s accession to India not the Maharaja says union minister Kiren Rijiju: జమ్మూ కాశ్మీర్ భారత్ లో విలీనంపై బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. కాంగ్రెస్ నాయకుడు జైరాం రమేష్ చేసిన ట్వీట్లకు స్పందిస్తూ దివంగత ప్రధాని జవహర్ లాల్ నెహ్రూపై కీలక వ్యాఖ్యలు చేశారు కేంద్రమంత్రి కిరణ్ రిజిజు. భారతదేశంలో జమ్మూ కాశ్మీర్ విలీనాన్ని ఆలస్యం చేసింది జవహర్ లాల్ నెహ్రూనే అని.. జమ్మూ కాశ్మీర్ మహారాజు కాదని ఆయన ట్వీట్ చేశారు.
Read Also: Ram Gopal Varma: గరికపాటి చూపంతా ఆ హీరోయిన్ మీదే ఉందట.. వర్మ వీడియో వైరల్
Also Read
- Plastic Notes: ప్లాస్టిక్ నోట్లకు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. ఎప్పటి నుంచి అమల్లోకి వస్తాయంటే..
- Arunachal Pradesh: ‘‘అరుణాచల్ ప్రదేశ్ మాదే’’.. చైనా అభ్యంతరాలపై భారత్ స్ట్రాంగ్ రిఫ్లై..
- Pakistan: భారత్ నుంచి పాకిస్తాన్ను ‘‘బాగ్దాద్ ఒప్పందం’’ కాపాడలేదు.. ఇప్పుడు ‘‘ఇస్లామిక్ నాటో’’ పరిస్థితి కూడా అంతేనా?
- Rahul Gandhi: రాహుల్ గాంధీ, మహిళ ఫొటోపై బీజేపీ ప్రశ్నలు.. అసలు విషయం చెప్పిన కాంగ్రెస్
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గుజరాత్ లో జరిగిన ర్యాలీలో సర్దార్ వల్లభాయ్ పటేల్ అనేక స్వదేశీ సంస్థానాలను భారతదేశంలో విలీనం చేశాడని.. ఒక వ్యక్తి మాత్రం జమ్మూ కాశ్మీర్ సమస్యను పరిష్కరించలేదని పరోక్షంగా జవహర్ లాల్ నెహ్రును ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. దీనికి ప్రతిగా జైరాం రమేష్ ట్వీట్ చేశారు. భారత్ లో చేరడకుండా మహారాజా హరిసింగ్ కలలు కన్నారని.. పాకిస్తాన్ దాడి తర్వాత హరిసింగ్ భారతదేశంలో చేరేందుకు మొగ్గు చూపాడని.. షేక్ అబ్దుల్లా(జమ్మూ కాశ్మీర్ మొదటి సీఎం) భారతదేశంలో విలీనాన్ని సమర్థించారని.. నెహ్రుతో ఉన్న స్నేహం, గాంధీజీ పట్ల ఉన్న గౌరవం కారణంగా భారతదేశంలో విలీనాన్ని సమర్థించారని ట్వీట్స్ చేశారు.
ఈ వ్యాఖ్యలను తిప్పి కొట్టారు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు. ఈ చారిత్రక అబద్ధం చాలా కాలంగా సాగుతోందని.. స్వాతంత్య్రానికి నెల ముందు జూలై, 1947లోనే తొలిసారి మహారాజా హరిసింగ్ నెహ్రూను సంప్రదించారని..అయితే జవహర్ లాల్ నెహ్రూ మహారాజును తప్పిపంపారని.. కాశ్మీర్ భారత్ లో చేరడాన్ని ఆలస్యం చేసింది నెహ్రూనే అని అన్నారు. దీని వల్ల అక్టోబర్ 1947లో పాకిస్తానీ ఆక్రమణదారులు శ్రీనగర్ పట్టణానికి కిలోమీటర్ దూరం వరకు వచ్చారని కిరణ్ రిజిజు దుయ్యబట్టారు. నెహ్రూ ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే కొన్ని ప్రత్యేక చట్టాలను రూపొందించారని.. దీనికి ఇప్పటికీ భారత్ మూల్యం చెల్లిస్తోందని అన్నారు.
This 'historical lie', that Maharaja Hari Singh dithered on question of accession of Kashmir with India has gone on for far too long in order to protect the dubious role of J.L.Nehru. ⁰
Let me quote Nehru himself to bust the lie of @Jairam_Ramesh. 1/6⁰https://t.co/US4XUKAF8E— Kiren Rijiju (@KirenRijiju) October 12, 2022
తాజావార్తలు
-
CM Chandrababu: బాధితులకు ఊరట.. అగ్రిగోల్డ్ ఆస్తులపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం..
-
22A Lands: 22A భూములపై గుడ్ న్యూస్.. మంత్రి పొంగులేటి కీలక ప్రకటన.!
-
Plastic Notes: ప్లాస్టిక్ నోట్లకు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. ఎప్పటి నుంచి అమల్లోకి వస్తాయంటే..
-
Arunachal Pradesh: ‘‘అరుణాచల్ ప్రదేశ్ మాదే’’.. చైనా అభ్యంతరాలపై భారత్ స్ట్రాంగ్ రిఫ్లై..
-
Raghunandan Rao: తెలంగాణలో రూ.200 కోట్ల సోలార్ స్కామ్.?.. రఘునందన్ రావు సంచలన ఆరోపణలు
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..