India-Canada Row: ఖలిస్తాన్ నినాదాలు.. కెనడా రాయబారికి భారత్ సమన్లు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India-Canada Row: ఖలిస్తాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ని గుర్తుతెలియని వ్యక్తులు కెనడాలోని సర్రేలో కాల్చి చంపిన తర్వాత ఇండియా, కెనడాల మధ్య దౌత్యసంబంధాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఆ దేశ ప్రధాని జస్టిన్ ట్రూడో బహిరంగంగా భారత వ్యతిరేక శక్తులకు, ఖలిస్తాన్ మద్దతుదారులకు మద్దతు తెలుపుతున్నాడు. ఇదిలా ఉంటే టొరంటోలో ఖల్సాడే కార్యక్రమానికి ఆ దేశ ప్రధాని ట్రూడో హాజరైన సమయంలో పెద్ద ఎత్తున ‘‘ఖలిస్తాన్ నినాదాలు’’ చేయడం వివాదాస్పదమైంది. సిక్కు సమాజానికి అండగా నిలుస్తామంటూ ఆయన వ్యాఖ్యానించారు.
Read Also: Mahindra XUV 3XO: మహీంద్రా XUV 3XO లాంచ్.. ధర, ఫీచర్స్ వివరాలు..
Also Read
- Delhi Police Commissioner: ఢిల్లీకి కొత్త పోలీస్ బాస్.. ఎవరు ఈ అనురాగ్ కుమార్..?
- Hydrogen Fuel Cell Train: తొలి "హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్" రైలు షురూ.. రూ.14,700 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం..!
- Sonam Wangchuk Hunger Strike: 20వ రోజుకు సోనమ్ వాంగ్చుక్ నిరాహార దీక్ష.. అవయవ వైఫల్యం ముప్పు.. దీక్ష విరమణకు ససేమిరా..
- NEET UG Result 2026: నీట్ యూజీ ఫలితాలు వచ్చేశాయ్.. స్కోర్కార్డ్ను ఇలా డౌన్లోడ్ చేసుకోండి
అయితే, దీనిపై భారత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ప్రధాని జస్టిన్ ట్రూడో హాజరైన కార్యక్రమంలో ఖలిస్తాన్ అనుకూల నినాదాలు చేయడంతో కేంద్రం సోమవారం కెనడా డిప్యూటీ హైకమిషన్ని భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పిలిచింది. కెనడా రాయబారికి భారత్ తన ఆందోళనని తెలియజేసింది. ‘‘ఇది వేర్పాటువాదం, తీవ్రవాదం మరియు హింసకు కెనడా రాజకీయ స్థలాన్ని ఇవ్వడాన్ని మరోసారి వివరిస్తోంది. వారి నిరంతర వ్యక్తీకరణలు భారతదేశం-కెనడా సంబంధాలను ప్రభావితం చేయడమే కాకుండా, కెనడాలో దాని స్వంత పౌరులకు హాని కలిగించే విధంగా హింస మరియు నేరపూరిత వాతావరణాన్ని ప్రోత్సహిస్తాయి’’ అని భారత్ ఒక ప్రకటనను విడుదల చేసింది.
రాబోయే ఎన్నికల్లో ఖలిస్తాన్ ఓటర్లను ఆకర్షించేందుకు టొరంటోలో జరిగిన ఖల్సా డే కార్యక్రమానికి అధికార పార్టీతో పాటు ప్రతిపక్ష పార్టీల నేతలైన లిబరల్, కన్జర్వేటివ్, ఎన్డీపీ పార్టీలకు చెందిన నాయకులు హాజరయ్యారు. ట్రూడో తన ప్రసంగంలో సిక్కు సమాజ హక్కులు మరియు స్వేచ్ఛలను అన్ని విధాలుగా కెనడియన్ ప్రభుత్వం పరిరక్షిస్తుందని హామీ ఇచ్చారు. ఖల్సా డేని వైసాకి అని పిలుస్తారు, ఇది సిక్కుల నూతన సంవత్సర వేడుకలను సూచిస్తుంది. గతంలో నిజ్జర్ హత్య కేసులో భారత ప్రభుత్వ ఏజెంట్ల ప్రమేయం ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపించారు. దీనిని భారత్ తీవ్రంగా ఖండించింది. ఇవి అసంబద్ధ, ప్రేరేపిత వ్యాఖ్యలని భారత్ ఖండించింది.
తాజావార్తలు
-
PV Sindhu: జపాన్ ఓపెన్లో పీవీ సింధు చరిత్ర.. 16 ఏళ్ల తర్వాత సెమీస్లోకి దూసుకెళ్లిన రెండో భారత మహిళా షట్లర్
-
Chittoor Horror: అసలు తల్లివేనా..? వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ఏడేళ్ల కుమారుడికి చిత్రహింసలు..!
-
Delhi Police Commissioner: ఢిల్లీకి కొత్త పోలీస్ బాస్.. ఎవరు ఈ అనురాగ్ కుమార్..?
-
Hydrogen Fuel Cell Train: తొలి “హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్” రైలు షురూ.. రూ.14,700 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం..!
-
TamannaahBhatia : బోల్డ్ హారర్ థ్రిల్లర్లో తమన్నా భాటియా.. రసహృదయాలు కాస్త జాగ్రత్త
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?